/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Crime-News-2.jpg)
crime news
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల కుమార్తెకు చిత్రహింసలు పెట్టిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ రాములు అనే వ్యక్తితో విజయవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ వివాహిత మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహిత మహిళ భర్త ఒక ఆటో డ్రైవర్. వ్యక్తిగత కారణాలతో విడిపోయి మూడేళ్ల కూతురుతో కలిసి ఉంటోంది.
ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
మూడేళ్ల పాప అడ్డుగా ఉందని చిత్రహింసలు చేసి..
ఈ క్రమంలో శ్రీరాములు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ కలిసి ఇటీవల హైదరాబాద్కు వచ్చారు. కూతురు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంటుందని ఇద్దరూ కలిసి పాపను చిత్రహింసలకు గురిచేశారు. ఒంటిపై వాతలు పెడుతూ నరక యాతనకు గురిచేసిన విషయం తెలుసుకున్న శ్రీరాములు తల్లి స్థానికుల సాయంతో పాపను తీసుకుని విజయవాడకు వచ్చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్మెయిల్ ‘వస్తేనే ఇస్తా’
గుజరాత్లో ఘోరం జరిగింది. సూరత్లోని ధర్మశాలలోని జైన సన్యాసి మైన్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన 7ఏళ్ల క్రితం జరగగా సన్యాసికి10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ మేరకు ధర్మశాలకు చెందిన కళాశాలలోని 19ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారం చేశాడు.
ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త
ఈ కేసులో జైన దిగంబర్ శాఖకు చెందిన సన్యాసికి సూరత్లోని సెషన్స్ కోర్టు శనివారం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అత్యాచారం కేసులో శాంతిసాగర్ జీ మహారాజ్ దోషిగా తేలడంతో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఏకే షా నిందితుడికి రూ.25 వేల రూపాయల జరిమానా కూడా విధించారు.
ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి
vijayawada | telugu-news | Latest crime news | telugu crime news | today-news-in-telugu | latest-telugu-news