Barmar: జైభీమ్ సీన్ రిపీట్ : దొంగతనం ఆరోపణలతో దళితుడిని చెట్టుకు తలకిందులుగా కట్టేసి..!

దొంగతనం ఆరోపణలతో ఓ దళితుడిని చెట్టుకు తలకిందులుగా కట్టేసి దారుణంగా కొట్టారు.  ఈ ఘటన  రాజస్థాన్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

New Update
Rajasthan case

Rajasthan case Photograph: (Rajasthan case)

దొంగతనం (Theft) ఆరోపణలతో ఓ దళితుడిని చెట్టుకు తలకిందులుగా కట్టేసి దారుణంగా కొట్టారు.  ఈ ఘటన  రాజస్థాన్ లో చోటుచేసుకుంది.  తనను కట్టివేసి కొట్టడంతో ఓ యువకుడు ఏడుస్తూ స్థానికులకు దండం పెడుతూ వేడుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇది  వైరల్ గా మారడంతో  బార్మర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు విషయం తెలుసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.  

Also Read :  దారుణం.. రూ.300ల కోసం హత్య చేసిన స్నేహితులు

ఈ ఘటనకు సంబంధించిన వీడియో శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిందని గుడమలాని పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ ముక్తా పరీక్‌ తెలిపారు. దీంతో విచారణ చేయగా.. శుక్రవారం ఓ గ్రామంలో శ్రవణ్ కుమార్ అనే దళితుడిని చెట్టుకు తలకిందులుగా కట్టేసి కొట్టినట్లు ప్రాధమిక విచారణలో తేలింది.  నిందితులు శ్రవణ్ కుమార్ ను దొంగతనానికి పాల్పడ్డాడు.  బాధితుడు శ్రవణ్ మేరకు ఆరుగురిపై ఇండియన్ జస్టిస్ కోడ్, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Also Read :  మహారాష్ట్రలో విషాదం.. తండ్రీ కొడుకులు ఆత్మహత్మ!

శ్రవణ్ కుమార్ పై ఓ కేసు

అంతకుముందు  దళితుడైన (Dalit Man) శ్రవణ్ కుమార్ పై ఓ కేసు నమోదైంది.   దొంగతనం కేసులో బెయిల్‌పై విడుదలైన శ్రవణ్ పై తాజాగా  బైక్‌ను దొంగిలించాడనే అనుమానంతో  ఇలా  చెట్టుకు తలకిందులుగా కట్టేసి దారుణంగా కొట్టారు.   అయితే తాను ఏ దొంగతనం చేయలేదని శ్రవణ్ కుమార్ చెబుతున్నాడు. 

Also Read :  గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు

గత ఏడాది సెప్టెంబర్‌లో రాజస్థాన్‌ (Rajasthan) లోని బరన్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఒక యువకుడిని చెట్టుకు కట్టివేసి, అతడిని బూట్ల దండతో కొట్టారు.  బాధిత యువకుడి సోదరుడు నిందితుడి కుటుంబానికి చెందిన మహిళను అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుల్లో బాధితురాలి భార్య కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని రక్షించారు. ఈ కేసులో బాధితురాలి భార్య సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. 

Also Read :  షాకింగ్ ఘటన .. 80 మంది విద్యార్థినుల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad : మరో అమ్మాయితో లవర్ పెళ్లి.. బాత్రూమ్ లోకి వెళ్లి..!

ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్‌ పెట్టినట్లు తెలిపింది.

New Update
mallishwari

mallishwari

ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళ్తే..  మిర్యాలగూడ బొక్కనుంతలపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి నిమ్స్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తు్ంది.  మధురపురి కాలనీలోని హాస్టల్‌లో ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆమె అదే గ్రామానికి చెందిన జానారెడ్డితో ప్రేమలో ఉంది. అయితే మల్లీశ్వరి కులం వేరే కావడంతో జానారెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు.

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

మల్లీశ్వరి కులం వేరే కావడంతో

 దీనికి తోడు ఇటీవల జానారెడ్డికి మరో యువతితో పెళ్లి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మల్లీశ్వరి తాను ఉంటున్న  హాస్టల్ లో మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్‌ పెట్టినట్లు తెలిపింది. మల్లీశ్వరి స్వగ్రామమైన బొక్కమంతలపాడుకు మృతదేహాన్ని తరలించి ఆమె మృతికి కారణమైన జాన్ రెడ్డి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలంటూ సోమవారం అర్ధరాత్రి దాటేవరకు ధర్నా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితుడు జానారెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

Also read :  Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

Also read :  పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

Advertisment
Advertisment
Advertisment