/rtv/media/media_files/2025/02/15/o54Iw7ibaVicCjeRNEq4.jpg)
Bihar Teacher at a school asked a girl student to become his girlfriend
Bihar: తల్లీతండ్రీ తర్వాత టీచరే దైవం అంటారు. పిల్లలకు విద్య నేర్పించే గురువు మంచి బుద్ధులతో ఉండాలి. సత్ప్రవర్తనతో ఉంటూ పిల్లలకు అదే నేర్పించాలి. కానీ ఈ కాలంలో టీచర్లు కిరాతకంగా తయారవుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల కీచకుల్లా ప్రవర్తిస్తున్నారు. అసలే ఆడపిల్లలు బతకడం కష్టం అవుతుంటే...ఇప్పుడు టీచర్లు కూడా ఇలా తయారవడం తో పిల్లల తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.
Also Read : వల్లభనేని వంశీ అరెస్ట్..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!
ఏకలవ్యుడి కథతో ప్రపోజల్..
తాజాగా బీహార్ లోని కిసాన్ గంజ్ జిల్లాలో ఉన్న హైస్కూల్లో పని చేస్తున్న కీచక టీచర్ వికాస్ కుమార్...అదే స్కూల్లో చదువుతున్న 12వ తరగతి విద్యార్థిని వెంట పడ్డాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని రోజూ ఫోన్ చేస్తూ వేధించాడు. తనకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలంటూ తినేశాడు. పైగా దానికి మహాభారతం నుంచి ఏకలవ్యుడి కథను ఉదాహరణగా చెప్పాడు కూడా. గురుదక్షిణ కింద తనకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలని కోరాడు. ఈ క్రమంలోనే ఆ విద్యార్థినికి వికాస్ కుమార్ పలుమార్లు ప్రపోజ్ చేశాడు. ఇద్దరం కలిసి సిలిగురికి వెళ్లి.. ఎంజాయ్ చేద్దామని చెప్పాడు.
Also Read : RCB vs GG : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ శుభారంభం
ఈ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసింది. స్కూల్ యాజమాన్యానికి కూడా కంప్లైంట్ ఇచ్చింది. ప్రిన్సిపల్ ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. అయితే ఎవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వికాస్ కుమార్ మీద ఎటువంటి చర్యా తీసుకోలేదు. దీంతో ఈ విషయం కాస్తా గ్రామస్తుల వరకూ వెళ్ళింది. వారు ఆగ్రహంతో స్కూల్ దగ్గర ధర్నా చేశారు. దాంతో పోలీసులు అక్కడకు వచ్చారు. విషయం జిల్లా కలెక్టర్ వరకూ వెళ్ళింది. ఆయన వచ్చి వికాస్ కుమార్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. అయితే వికాస్ కుమార్ గతంలో అదే స్కూల్లో పని చేసిన మహిళా టీచర్కు ప్రపోజ్ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు.
Also Read: Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?
Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!