మచిలీపట్నంలో విషాదం.. నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి

అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. పార్క్‌లో ఆడుతుండగా.. కార్పొరేషన్ గేటు దినేష్ అనే బాలుడుపై పడగా మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోధిస్తున్నారు.

New Update
Krishna Accident

Krishna Accident Photograph: (Krishna Accident)

అధికారుల నిర్లక్ష్యం వల్ల కొందరు బలి అవుతున్నారు. స్కూల్, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ఎక్కడైనా ఏదైనా గేటు, తలుపులు వంటివి డ్యామేజ్ అయితే వాటిని మళ్లీ రిపైర్ చేయరు. ఏం కాదులే అని నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి ఘటన ఒక తాజాగా కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నం కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఏడేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. 

ఇది కూడా చూడండి: అశ్విన్‌ స్థానంలో మరో యంగ్ స్పిన్నర్‌కు చోటు.. అతడెవరంటే! 

తలపై పడటంతో..

యూకేజీ చదువుతున్న దినేష్ అనే బాలుడు ఇంటికి దగ్గరలో ఉన్న మున్సిపల్ పార్క్‌లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రహరీ గోడకు ఏర్పాటు చేసి బరువైన గేటు విరిగి పడి దినేష్ తలపై పడింది. దీంతో ఆ బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దినేష్ చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోధిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Allu arjun: అల్లు అర్జున్ విచారణ పూర్తి.. కీలక ప్రశ్నలకు సమాధానాలివే!

కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మరణించాడని ఆరోపిస్తున్నారు. తుప్పు పట్టి ఉన్న ప్రహరీ గోడ గేటు విరిగిపోయిన కూడా అధికారులు దాన్ని రిపైర్ చేయకపోవడం ఏంటని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబానికి తగు సాయం చేస్తామంటూ అధికారులు హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ఇది కూడా చూడండి: Jani Master: అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్ వైరల్

తన బిడ్డ ప్రాణాల్ని కబళించిన గేటును చూసి ఎప్పటికప్పుడు దినేష్ తల్లి కన్నీరు మున్నీరవుతుంది. ఏదైనా సాయం దక్కుతుందన్న ఆశతో పది నెలలుగా అధికారులు చుట్టూ తిరిగి విజ్ఞప్తులు అందిస్తున్నా పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. బిడ్డను కోల్పోయిన బాధను దిగమింగుకుంటూ ఆ తల్లి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి ఇచ్చింది. ఇప్పటికైనా ఆమెకు సాయం దక్కుతుందో లేదో చూడాలి.

ఇది కూడా చూడండి: AP: ఏపీలో దారుణం.. సిబ్బంది నిర్లక్ష్యానికి గర్భిణి మృతి..!


Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Crime: ఓరి పాపిస్టోడా.. రూ.5 కోసం ముసలవ్వను కొట్టి కొట్టి చంపేశావ్ కదరా!

అన్నమయ్య జిల్లాలో శనివారం దారుణం జరిగింది. రూ.5 కోసం జరిగిన వివాదం వృద్ధురాలిని బలిగొంది. ఆటో ఎక్కిన గంగులమ్మ (70) తనకు రావాల్సిన రూ.5 తిరిగి అడిగింది. డ్రైవర్ ఇవ్వకపోవడంతో తిట్టింది. కోపగ్రస్తుడైన డ్రైవర్ ఆమెను కొట్టి కొట్టి చంపేశాడు.

New Update
Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

Annamayya Madanapalle woman died after being attacked by an auto driver

ఏపీలో దారుణమైన ఘటన జరిగింది. 70 ఏళ్ల ముసలవ్వకు, ఆటో డ్రైవర్‌కు మధ్య రూ.5 కోసం జరిగిన వాగ్వాదం ఒకరి చావుకి కారణమైంది. ఆటో డ్రైవర్ రూ.5 ఎక్కువ తీసుకున్నాడని.. ముసలవ్వ నోరు పారేసుకుంది. అది సహించుకోలేని ఆటో డ్రైవర్.. ఏకంగా ఆమెను కానరాని లోకాలకు పంపించేశాడు. ఆ వృద్ధురాలిని కొట్టి కొట్టి చంపేసి రోడ్డుపై పడేశాడు. రన్నింగ్ ఆటోలోంచి కింద పడిపోయినట్లు కథ అల్లాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

రూ.5 గొడవకు ప్రాణం బలి

రూరల్ ఎస్సై గాయత్రి ప్రకారం.. రెడ్డెప్ప, గంగులమ్మ (70) దంపతులు. వీరు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, చంద్రాకాలనీలో ఉంటున్నారు. గాజులు, బొమ్మలను జాతరలో అమ్ముతూ జీవిస్తున్నారు. రెండు రోజుల క్రితం (శుక్రవారం) రాత్రి గంగులమ్మ అక్క లక్ష్మీ దేవి కుమారుడు వెంకటరమణ నీటితొట్టెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

దీంతో ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమని గంగులమ్మ రూ.2 లక్షలు తీసుకుని బయల్దేరింది. ఇందులో భాగంగానే విష్ణు అనే వ్యక్తి షేర్ ఆటో ఎక్కింది. సీఎస్‌ఐ చర్చి వద్ద ఆమె దిగి ఆటో డ్రైవర్‌కు రూ.20 ఇచ్చింది. తిరిగి తనకు రూ.5 వస్తాయని అడిగింది. ఆ ఆటో డ్రైవర్ ఇవ్వకపోవడంతో ముసలవ్వ అతడ్ని తిడుతూ మళ్లీ ఆటో ఎక్కింది. అయితే తనను తిట్టడం అవమానంగా భావించిన ఆ ఆటోడ్రైవర్ బసినికొండ పంచాయతీలోని రామాచార్లపల్లె సమీపంలోకి తీసుకెళ్లి కొట్టి కొట్టి చంపేశాడు. 

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

ఆపై రోడ్డుపై పడేసి.. రన్నింగ్ ఆటోలోంచి దూకి చనిపోయినట్లు కథ అల్లాడు. ఇక ఈ విషయం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. తమదైన శైలిలో ఆటో డ్రైవర్ విష్ణు విచారించడంతో అసలు నిజం బయటపడింది. అయితే ప్రస్తుతం గంగులమ్మ తీసుకెళ్లిన రూ.2 లక్షలు ఏమయ్యాయి అనే విషయంపై విచారిస్తు్న్నామని ఎస్ ఐ గాయత్రి తెలిపారు. 

(crime news | murder | latest-telugu-news | telugu-news | AP Crime | ap-crime-news)

Advertisment
Advertisment
Advertisment