Murder: బరితెగించిన భార్య.. భర్తను లేపేసేందుకు ప్రియుడికి రూ.20 లక్షల సుపారీ!

ఖమ్మం ధర్మారావు హత్య కుట్ర కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే భార్య, ప్రియుడు రాము కలిసి ఓరౌడీ గ్యాంగ్‌కు రూ.20 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

New Update
Khammam Dharma Rao murder case

Khammam Dharma Rao murder case

Murder: ఖమ్మం ధర్మారావు హత్య కుట్ర కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే భార్య, ప్రియుడు రాము కలిసి ఓరౌడీ గ్యాంగ్‌తో 20 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుల నుంచి ఓ ఎయిర్ గన్ సహా రెండు కత్తులు, ఓకారు, 90 వేల నగదు, 5సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

Also Read: Musk-Trump: ట్రంప్ మీటింగ్‌లో మస్క్ "టాప్ సీక్రెట్" నోట్..అసలు అందులో ఏముంది!

ప్రియురాలి భర్తను అడ్డుతొలగించాలని..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ప్రియురాలి భర్తను అడ్డుతొలగించాలనుకున్న  కొండూరి రామాంజనేయులు అలియాస్ రాము హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామానికి చెందిన తోట ధర్మారావు హత్యకు సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ఓరౌడీ గ్యాంగ్ తో 20 లక్షలకు సుపారీ కుదుర్చుకుని 5 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు. అనుకున్న పథకం ప్రకారం గత నెల మార్చి 12 న ధంసలాపురం వద్ద తోట ధర్మారావును కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. అనంతరం సుపారీ ఇచ్చిన రాముకు వీడియో కాల్ చేసి కిడ్నాప్ చేసిన వ్యక్తిని తోట ధర్మారావుగా నిర్థారించుకున్న సుపారీ గ్యాంగ్.. మరింత డబ్బు డిమాండ్ చేసింది. 

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

హత్యచేయకుండా వదిలేయడంతో..

అయితే రాము స్పందించకపోవడంతో విసుగుచెందిన సుపారీ గ్యాంగ్.. లక్షాయాభైవేల రూపాయల నగదు, బంగారు గొలుసు తీసుకుని బాధితుడు తోట ధర్మారావును హత్యచేయకుండా వదిలేసింది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో చర్చించి విషయాన్ని ఖమ్మం ఏసీపీ రమణమూర్తి దృష్టికి తీసుకెళ్లాడు బాధితుడు ధర్మారావు. దీంతో వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన నగర ఏసీపీ రమణమూర్తి.. ఖమ్మం నగరంలోని చెరుకూరి మామిడితోటలో సుపారీ గ్యాంగ్ సమావేశమయ్యారన్న సమాచారంతో రంగంలోకి దిగారు.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ 

ప్రధాన నిందితుడు కొండూరి రామాంజనేయులు అలియాస్ రాము, దంతాల వెంకట్ నారాయణ అలియాస్ వెంకట్ సుపారీ గ్యాంగ్ సభ్యులు పగడాల విజయ్ కుమార్ అలియాస్ చంటి, వేముల కృష్ణ, బుర్రి విజయ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

 husband | wife | lover | murder-case | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment