Athlete: మహిళా అథ్లెట్‌పై 62 మంది లైంగిక దాడి.. 5 ఏళ్లుగా ఆ వీడియోలు చూపిస్తూ!

కేరళలో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల మహిళా అథ్లెట్‌పై 5 ఏళ్లుగా 62 మంది పురుషులు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. పతనంతిట్ట జిల్లా పోలీసులు 60 మందిపై ఎఫ్ఐర్ నమోదు చేసి 5గురిని అరెస్ట్ చేశారు.

New Update
Kurnool : సమాజం సిగ్గుపడే ఘటన.. సొంత చెల్లికే ప్రెగ్నెంట్ చేసిన కామాంధుడు!

Kerala  Athlete: దేశంలో మరో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా అథ్లెట్‌పై 5 సంవత్సరాల పాటు 62 మందికి పైగా పురుషులు లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. 13 ఏళ్ల వయసులోనే ఆమెకు అశ్లీల వీడియోలు చూపించి 18 ఏళ్ల వయసు వచ్చేవరకు రకరకాల పద్ధతిలో ఆమెను వేధించారు కామాంధులు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకోగా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తుండగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

అశ్లీల వీడియోలను బలవంతంగా చూపించి..

కేరళ రాష్ట్రంలోని  పతనంతిట్ట జిల్లాకు చెందిన 13 ఏళ్ల అమ్మాయికి పక్కింటి అబ్బాయి అశ్లీల వీడియోలను బలవంతంగా చూపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ విషయం తెలియగానే ఆ బాలికను తన ఇంటికి సమీపంలోని మరికొంత మంది అబ్బాయిలు బెదిరించడం మొదలుపెట్టారు. అలా ఒకరోజు ఆమెను బలవంతంగా ఓ కొండకు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. అయితే ఇంతకాలం మౌనంగా ఉన్న ఆమె.. కుటుం సభ్యులకు చెప్పడంతో భయంకర నిజాలు బయటపడ్డాయి. పేరెంట్స్ వెంటనే ఈ విషయం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలియజేయడంతో అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కమిటీ పోలీసులను అప్రమత్తం చేసింది.  

62 మంది పురుషులు నేరస్థులు..

పతనంతిట్ట జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులతోపాటు అమ్మాయి కోచ్‌, తోటి క్రీడాకారులను అదుపులోకి తీసుకుని విచారించారు. 62 మంది నిందుతులపై పోలీసులు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. నిందితులందరినీ పట్టుకునేందుకు పతనంతిట్ట జిల్లా పోలీస్‌ చీఫ్‌ వీజీ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో 62 మంది పురుషులు నేరస్థులుగా గుర్తించబడ్డారు. 40 మంది పురుషులపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసులు నమోదు చేయబడ్డాయి. సుబిన్, ఎస్ సందీప్, వీకే వినీత్, కే ఆనందు, శ్రీని అనే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి), పోలీసులు కలిసి ప్రాణాలతో బయటపడిన వారికి అవసరమైన మద్దతు, రక్షణ కల్పించేలా కృషి చేస్తున్నారు. బాధితురాలిని షెల్టర్ హోంకు తరలించారు. ఎలవుంతిట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినప్పటికీ నిందితుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇతర స్టేషన్‌ల అధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Dil Raju : తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన దిల్ రాజు

ఇక ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉండే అవకాశం ఉందని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్యామలా దేవి అన్నారు. 'మేము ప్రస్తుతం వివరాలను సేకరిస్తున్నాం. బాలికను షెల్టర్ హోంకు తరలించారు. తదుపరి సమాచారం రెండు రోజుల్లో వెల్లడిస్తాం' అని ఆమె చెప్పారు.  మరిన్ని ఆధారాలు సేకరించేందుకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కూడా జనవరి 11న బాధితురాలితో మాట్లాడనున్నట్లు తెలిపారు. ఆ క్రీడాకారిణి మానసిక స్థితి, గోప్యతకు కూడా ప్రాధాన్యతనిస్తున్నాం. ఆమెకు అవసరమైన కౌన్సెలింగ్ సేవలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Heart Attack: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP liquor scam : ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో సంచలనం...  సజ్జల శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్

వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవలె కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
SAJJALA SREEDHAR REDDY

SAJJALA SREEDHAR REDDY

AP liquor scam : వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవలె కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో శ్రీధర్‌ రెడ్డి ఏ6గా ఉన్నారు. ఆయనను కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి కాగా.. కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్‌ రెడ్డి కీలకంగా వ్యహించినట్లుగా సీట్ గుర్తించింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి (ఏ1), ఆయన తోడల్లుడు చాణక్య (ఏ8)ను అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని అడ్డు పెట్టుకుని ప్రతినెలా రూ.60 కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, నాటి ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్‌తో కలిసి శ్రీధర్‌రెడ్డి కూడా కుట్రలు చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కేసులో శ్రీధర్‌ రెడ్డిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

శ్రీధర్‌ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి, వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి వందల కోట్లు వెనకేసుకున్నట్లు సిట్‌ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు... శుక్రవారం సాయంత్రం శ్రీధర్‌ రెడ్డిని అరెస్టు చేసి. విజయవాడకు తీసుకొచ్చారు. శనివారం ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
   
మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్‌రెడ్డి పాత్ర గురించి చాణక్య రిమాండ్‌ రిపోర్టులోనే ‘సిట్‌’ క్లుప్తంగా వివరించింది. దీని ప్రకారం... 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్లో శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్‌ యజమానులను రప్పించారు. లిక్కర్‌ సరఫరా చేయాలంటే కనీసం 12శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు.  

Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

హైదరాబాద్‌లోని స్టార్‌ హోటళ్లలో సజ్జల శ్రీధర్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్య ప్రసాద్‌ పలుమార్లు చర్చలు జరిపారు. కమీషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు వెళ్లాయి. అలాగే అప్పటికే ఏపీలో ఉన్న డిస్టిలరీస్‌ను బలవంతంగా లాక్కుని సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. శ్రీధర్‌రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ్‌లో మిథున్‌రెడ్డికి వాటా వచ్చేలా ప్లాన్‌ చేశారు. వైసీపీ హయాంలో మద్యం దుకాణాల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న సదరన్‌ బ్లూ, నైన్‌ హార్స్‌ వంటివి వీరి ఉత్పత్తులే కావడం గమనార్హం.

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

Advertisment
Advertisment
Advertisment