Hansika: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు జూలై 3కు వాయిదా వేసింది.

New Update
hansika

hansika Photograph: (hansika)

Hansika: గృహ హింస కేసులో భాగంగా ముంబై హైకోర్టును ఆశ్రయించింది నటి హన్సిక. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్.. తనతోపాటు తన తల్లిపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2024 డిసెంబర్ 18న అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 

హన్సిక ఫ్యామిలీపై కేసు..

ఈ మేరకు హన్సిక సోదరుడు ప్రశాంత్‌ మోత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ తనను వేధిస్తున్నారంటూ హన్సిక ఫ్యామిలీపై కేసు పెట్టింది. హన్సికా, ఆమె తల్లి మోనా మోత్వానీ తన భర్తతో వివాహం, రిలేషన్‌షిప్‌ అంశంలో జోక్యం చేసుకుంటున్నారని, తమ మధ్య గొడవలు పుట్టించారని ఆమె ఆరోపించింది. ప్రశాంత్ గృహ హింసకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. వారివల్లే తనకు పక్షవాతం వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది. హన్సిక, అత్త ఆస్తి లావాదేవీల్లో మోసం చేస్తున్నట్లు ఆరోపించింది. 

ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయగా సెక్షన్ 498A కేసును రద్దు చేయాలంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించింది హన్సిక. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన జస్టిస్ సరంగ్ కోట్వాల్, జస్టిస్ మోడక్‌లతో కూడిన ధ‌ర్మాస‌నం ముస్కాన్ నాన్సీకి నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది.

 

https://www.youtube.com/watch?v=y8IgX9yxRMY

domestic-voilence | mumbai | high-court | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Crime: ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత

మహారాష్ట్ర ఠాణే నగరంలో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ళ యువకుడు పదేళ్ల బాలికను ఎత్తుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి చంపాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఆరో అంతస్తులోని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు విసిరేసాడు.

New Update
Maharashtra thane  brutal incident

Maharashtra thane brutal incident

Crime: మహారాష్ట్ర ఠానే నగరంలో మరో కామాంధుడి కిరాతకం బయటపడింది. పదేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి ఆపై గొంతు కోసి చంపినా ఘటన వెలుగులోకి వచ్చింది.  పోలీసుల వివరాల ప్రకారం.. ఆసిఫ్ మన్సూరీ అనే ఇరవై ఏళ్ళ యువకుడు సామ్రాట్‌నగర్‌ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అయితే సోమవారం రాత్రి తన సమీప భవనంలో  నివాసం ఉండే పదేళ్ల బాలికకు ఆటవస్తువులు ఆశ చూపించి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆ చిన్నారి పట్ల  అత్యంత కిరాతకంగాప్రవర్తించాడు. బాలికపై అత్యాచారం చేసి ఆపై గొంతుకోసి చంపాడు. అనంతరం  బాలిక మృతదేహాన్ని ఆరో అంతస్తులోని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు విసిరేసాడు. బాలిక పోస్టుమార్టంలో ఆమెపై అత్యాచారం జరిగినట్టు బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

 

telugu-news | crime news | maharastra | latest-news

Advertisment
Advertisment
Advertisment