City Buses : మహిళలకు సిటీ బస్ లో ఫ్రీ జర్నీ ఉంటుందా? ఉండదా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ!

సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.

New Update
City Buses : మహిళలకు సిటీ బస్ లో ఫ్రీ జర్నీ ఉంటుందా? ఉండదా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ!

Sajjanar : హైదరాబాద్‌(Hyderabad)లో సిటీ బస్సుల్లో(City Buses) ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువ. మెట్రో ఉన్నా కూడా చాలామంది ఇప్పటికీ సిటీ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. బస్ స్టాప్‌లు ఎక్కువగా ఉండడంతో పాటు బస్సుల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. దీంతో గమ్యస్థానానికి దగ్గరలోనే బస్సు ఆగుతుంది. వెంటనే వెళ్లాల్సిన ప్లేస్‌కు వెళ్లిపోవచ్చు. అందుకే బస్సుల్లో నిత్యం రద్దీ ఉంటుంది. స్కూల్‌, కాలేజీకి వెళ్లే సమయాల్లో లేదా వదిలే సమయాల్లో చాలా మంది వేలాడుతూ కనిపిస్తారు. ఇక తాజాగా తెలంగాణలో కాంగ్రెస్‌(Telangana Congress) అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు నేతలు. గెలిచిన తర్వాత అదే మాట నిలబెట్టుకున్నారు. అయితే సిటీ బస్సుల్లో ఫ్రీ ఉందా లేదా అన్నదానిపై తాజాగా టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్‌(Sajjanar) క్లారిటీ ఇచ్చారు.

అందులోనూ ఫ్రీ:
పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. అంటే సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. స్థానికత ధ్రూవీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి. కిలోమీటర్ల ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవు. ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేస్తారు. అంతర్రాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.

సజ్జనార్ కీలక ఆదేశాలు:
ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశమున్నందున, బస్ స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను సజ్జనార్ ఆదేశించారు. ఉచిత ప్రయాణం అమలులో ప్రతి సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహారించాలని, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. రెండేళ్లుగా సిబ్బంది ప్రవర్తనలో మార్పు వచ్చిందని, దాని వల్లే సంస్థ రెవెన్యూ పెరిగిందని గుర్తుచేశారు. అదే స్పూర్తితో ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ టీఎస్ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.

Also Read: ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత.. ప్రభుత్వ కీలక నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది

New Update
Rains

Rains

ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా గురువారం పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కొన్నిచోట్ల వడగాలులు వీచే అవకాశాలుకూడా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో బలపడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనికి అనుబంధంగా వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో గురువారం పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

గురువారం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!

అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం కూడా ఏపీలో వర్షాలు పడనున్నాయని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్య సాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు.

ఇదే సమయంలో కొన్ని జిల్లాలలో ఎండలు పెరుగుతున్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఉలిందకొండలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, నంద్యాల జిల్లా దొర్నిపాడు, పల్నాడు జిల్లా అమరావతిలో 39.7,ప్రకాశం జిల్లా దరిమడుగలో40.3 , చిత్తూరు జిల్లా తవణంపల్లెలో40.1  , వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో39.9 డిగ్రీల  ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని.. శుక్రవారం7 మండలాల్లో తీవ్రవడగాలులు, 66 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: GT Vs RR: గుజరాత్ తొలి ఇన్నింగ్స్ పూర్తి.. రాజస్తాన్ టార్గెంట్ ఎంతంటే?

ap | rains | weather | andhra pradesh weather | andhra-pradesh-weather-forecast | andhra-pradesh-weather-report | ap today weather update | ap-weather | AP Weather Alert | latest-news | telugu-news | ap telugu news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment