Cinema: యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న కింగ్ డమ్ మూవీ టీజర్

గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో వస్తున్న విడి12 మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. దీనికి కింగ్ డమ్ అని పేరు పెట్టినట్టు చెబుతూ టీజర్ ను వదిలారు. ఇప్పుడు ఇది యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. 

New Update
movies

Vijaya devarakonda Mew Movie Kingdom

వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. జెర్సీ లాంటి మూవీస్ తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ తరువాతి సినిమా రాబోతోంది. దీనికి కింగ్ డమ్ అని పేరు పెట్టారు. ఈరోజు ఈ సినిమా పేరును ప్రకటించడమే కాకుండా టీజర్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఎన్టీయార్ వాయిస్ ఓవర్ తో  ఉన్న ఈ టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. విజయ్ దేవరకొండ గెటప్ కూడా ఆసక్తిని కలిగిస్తోంది.

సినిమా మీద పెరిగిన అంచనాలు..

ఎన్టీయార్ ఇచ్చిన ఇంట్రడక్షన్ తో కింగ్ డమ్ మూవీ కొత్తగా ఉండనుంది అని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. కింగ్ డమ్ మవీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఈరోజు తెలుగు టీజర్ తో పాటూ తమిళ, హిందీ టీజర్ లు కూడా రిలీజ్ అయ్యాయి. ఇందులో తమిళ్ కు సూర్య, హిందీకి రణబీర్ కపూర్ లు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్  మే 30న బాక్సాఫీస్ ముందు రానుంది. కింగ్ డమ్ టీజర్ యూట్యూబ్ లో అప్పుడే హిట్ కొట్టింది. సాయంత్రం నుంచి ఇప్పటి వరకు 10 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని దుమ్మురేపుతోంది. ఎన్టీయర్ వాయిస్, విజయ్ యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్ అన్నీ అధిరిపోయాయని ఫ్యాన్ అంటున్నారు. సినిమా కోసం ఈ గర్ గా వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు. 

Also Read: USA: ఐదేళ్ళ తర్వాత కలుస్తున్న ట్రంప్, ప్రధాని మోదీ...కీలక అంశాలపై చర్చ! 

Also Read: Cricket: మూడో మ్యాచ్ లోనూ విజయం..ఇంగ్లాండ్ తో వన్డే సీరీస్ క్లీన్ స్వీప్

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రవస్తి ఆరోపణలు.. పాటతో కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత

సింగర్ సునీత ఇన్‌డైరెక్ట్‌గా ప్రవస్తిని ఉద్దేశించి ఓ పోస్ట్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు అనే పాటను షేర్ చేశారు. ప్రవస్తి గురించే ఈ పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

New Update
singer pravasthi comments on Sunitha

singer pravasthi comments on Sunitha

గాయని ప్రవస్తి పాడుతా తీయగా షోలోని జడ్జిలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారికి నచ్చిన వారికే ప్రోగ్రాంలో ఎంకరేజ్ చేస్తారని మిగతా వారిని తొక్కేస్తారని సింగర్ ప్రవస్తి కామెంట్లు చేసింది. అలాగే తనని బాడీ షేమింగ్ చేశారని తెలిపింది. అయితే దీనికి సింగర్ సునీత స్పందిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ప్రవస్తి కూడా సునీత కోసం వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

కీరవాణి అందించిన పాటను..

ఈ క్రమంలో సింగర్ సునీత మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ప్రవస్తి గురించి డైరెక్ట్‌గా కాకుండా.. లిరిక్స్‌ను షేర్ చేశారు. గోపీచంద్‌ నటించిన 'ఒక్కడున్నాడు' మూవీలో కీరవాణి సంగీతం అందించిన పాటను ఆమెను షేర్ చేశారు. 'అడుగడుగున పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు.. కోరిన తీరాన్నే చేరుకునే వరకు ఓ నిమిషమైనా నిదరపోవా..' అనే లిరిక్స్‌ పాటను షేర్ చేశారు. అయితే సునతీ సింగర్ ప్రవస్తి గురించే పాటను షేర్ చేశారని నెటిజన్లు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

ఇదిలా ఉండగా పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో చాలా మంది సింగర్లు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అయితే ఈ షోలో జడ్జెస్‌గా సునీత, కీరవాణి, చంద్రబోస్‌లపై గాయని ప్రవస్తి ఆరోపణలు చేసింది. జడ్జిమెంట్‌ విషయంలో వివక్ష చూపుతున్నారని, కొందరు పాడకపోయినా కూడా సపోర్ట్ చేస్తూ.. చివరి వరకు తీసుకువచ్చారని తెలిపింది. దీనిపై సింగర్ సునీత కూడా క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా పలుమార్లు విమర్శలు చేయడంతో ఈ వీడియోను షేర్ చేశారు. 

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

Advertisment
Advertisment
Advertisment