Venu Swamy: ప్రభాస్, దేవరకొండ, సమంత సూసైడ్ పక్కా.. వేణు స్వామి సంచలన ఆడియో లీక్!

వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత ముగ్గురు సెల‌బ్రిటీలు చనిపోతారని చెప్పిన ఆడియో వైరల్‌గా మారింది. అందులో విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటాడని అన్నట్లు వినిపిస్తుంది. దీంతో వేణుస్వామిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

New Update
venu swamy

Venu Swamy

సెలబ్రిటీ జోతిష్యుడిగా వేణుస్వామి బాగా పాపులర్ అయ్యాడు. హీరో, హీరోయిన్స్‌ పర్సనల్, ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించి జోష్యం చెప్తూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అతడు నాగచైతన్య, సమంత విడాకుల అంశంతో సంచలనంగా మారాడు. అదే సమయంలో ఎన్నో విమర్శల పాలయ్యాడు. ఆ తర్వాత మరెంతో మందిపై జోష్యం చెప్పి వివాదాల్లో చిక్కుకున్నాడు. 

ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

ఇటీవలే నాగ చైతన్య, శోభిత మ్యారేజ్ చేసుకోగా.. అప్పుడు కూడా తన జోష్యం చెప్పి హాట్ టాపిక్‌గా మారాడు. ఈ జంట విడాకులు తీసుకోబోతుంది అంటూ దారుణమైన కామెంట్స్ చేయడంతో నెట్టింట అభిమానులు, సినీ ప్రియులు అతడిపై మండిపడ్డారు. ఫిలిం జర్నలిస్టులు సైతం వేణుస్వామిపై కంప్లైంట్ చేశారు. కానీ అతడు వెనక్కి తగ్గకుండా సెలబ్రిటీల గురించి కామెంట్స్ చేస్తున్నాడు. 

ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!

ముగ్గురు సెలబ్రిటీలు సూసైడ్

తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు సెలబ్రిటీలు సూసైడ్ చేసుకుంటారని వేణుస్వామి చెప్పిన ఆడియో నెట్టింట సంచలనంగా మారింది. ఓ జర్నలిస్టుతో వేణుస్వామి మాట్లాడిన ఆడియో లీక్ అయి హాట్ టాపిక్‌గా మారింది. అతడి ఆడియో ప్రకారం.. ‘‘నేను ముగ్గురు సెలబ్రిటీలు చనిపోతారని చెప్పాను. అందులో ఒక హీరోయిన్, ఒక హీరో చనిపోతారు. మరొకరు సూసైడ్ చేసుకుంటారు. నా లెక్క ప్రకారం.. విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటాడు. బయటకు రావడానికి కాస్త టైం పడుతుంది. 

Also Read :  లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

ఒక హీరోకి సీరియస్ ఇంజ్యూరి ఉంటుంది. అతడికి అన్నీ సమస్యలే. మీడియాకి ఎవరికీ ఏం చెప్పలేదు. మేనేజ్ చేస్తున్నారు. అందుకే రాజాసాబ్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఆ సినిమా సెప్టెంబర్‌కు పోయింది. ఇవన్నీ ముందు ముందు జరగబోతున్నాయి. అన్నీ అయిన తర్వాత మాట్లాడుకుందాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో అభిమానులు వేణుస్వామిపై చిర్రెత్తిపోతున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RGV : పోలీసులే భయపడితే..  హారర్ కామెడీ సినిమా చేస్తున్న.. ఆర్జీవీ సంచలన ప్రకటన

నిత్యం సోషల్ మీడియాలో తన ట్వీట్లతో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. కొత్త సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

New Update
rgv new movie

rgv new movie

నిత్యం సోషల్ మీడియాలో తన ట్వీట్లతో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశారు. కొత్త సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలకు భయం వేస్తే పోలీసుల వద్దకు పరిగెడతారు.. అలాంటిది మరి పోలీసులే భయపడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను చేయబోతున్నట్లుగా వెల్లడించారు.  

 ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్య తర్వాత

తాను ఇంతవరకు హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్, పొలిటికల్ డ్రామాలు, అడ్వెంచర్ కేపర్‌లు, థ్రిల్లర్‌ లాంటి సినిమాలు చేసాను. కానీ ఎప్పుడూ కూడా  హార్రర్ కామెడీ చేయలేదు. అందుకే ఈ చిత్రానికి ‘పోలీస్ స్టేషన్ మెయిన్ భూత్’ ట్యాగ్ లైన్: You Can't Kill The Deadతో అనే టైటిల్ పెట్టానన్నారు.  ఘోరమైన ఎన్‌కౌంటర్ హత్య తర్వాత, పోలీసు స్టేషన్  హాంటెడ్ స్టేషన్‌గా మారింది. గ్యాంగ్‌స్టర్ల దెయ్యాల నుండి తప్పించుకోవడానికి పోలీసులందరూ భయంతో పరుగులు తీస్తారంటూ ఆర్జీవీ సినిమా కాన్సెప్ట్‌ను కూడా వెల్లడించారు.

సత్య, కౌన్ స్కూల్ తర్వాత తాను బాజ్‌పేయి మనోజ్ ఇద్దరం కలిసి ఈ సినిమా చేయబోతున్నట్లుగా ఆర్జీవీ తెలిపారు. శారీ అనే చిత్రం తరువాత ఆర్జీవీ నుంచి మళ్లీ సినిమా రాలేదు.  దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది.  

Also read : TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!

Advertisment
Advertisment
Advertisment