Priyanka Chopra: లాస్‌ ఏంజెలెస్‌ నుంచి మహేశ్‌ బాబు కోసం హైదరాబాద్ కు ప్రియాంక.. ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్!

అమెరికా లాస్ ఏంజెల్స్ నుంచి నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చారు. ఇందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ వీడియో నెట్టింట వైరలవుతోంది. దీంతో మహేశ్‌- రాజమౌళి # #SSMB29 కోసమే ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చారంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

New Update
Priyanka chopra

Priyanka chopra

Tollywood : రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్  #SSMB29. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా క్షణాల్లో వైరలవుతోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్  ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ చేరుకోవడం నెట్టింట వైరల్ గా మారింది. హైదరాబద్ ఎయిర్ పోర్ట్ లో ప్రియాంక తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి కనిపించారు. దీంతో మహేశ్‌- రాజమౌళి #SSMB29  ప్రాజెక్ట్ కోసమే ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.  

Also Read : సైఫ్ ను కోటి డిమాండ్ చేసిన దుండగుడు.. వెలుగులోకి సంచలన నిజాలు

Rajamouli - Mahesh Babu Combo SSMB29

Also Read :  'జైలర్ 2' గెస్ట్ రోల్స్ లో టాలీవుడ్ స్టార్స్.. ఎవరెవరంటే?

ఇటీవలే చిత్రబృందం పూజ కార్యక్రమాలతో సినిమాను  గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదు.   అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్ పై కె.ఎల్‌.నారాయణ  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ఇందులో మహేష్ బాబు (Mahesh Babu) ఇదివరకు కనిపించని విధంగా సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. 

Also Read: Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!

Also Read :   Breaking: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో డీమార్ట్, రిలయన్స్ ట్రెండ్స్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rajinikanth ఫ్యాన్స్ తో కలిసి సింపుల్ గా తలైవా జర్నీ.. విమానమంతా అరుపులు, కేకలు! వీడియో చూశారా

సూపర్ స్టార్ రజినీ ఇండిగో విమానంలో ఎంతో సింపుల్ గా ఎకానమీ క్లాస్ లో ప్రయాణించారు. ఆయన విమానంలోకి రాగానే ప్రయాణికులంతా తలైవా అంటూ కేకలు వేస్తూ వీడియో రికార్డు చేశారు. రజినీ కూడా చిరునవ్వుతో అభిమానులు హయ్ చెప్పారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది

New Update
Rajinikanth flight video viral

Rajinikanth flight video viral

Rajinikanth సూపర్ స్టార్ తలైవా ఎంతో సింపుల్ గా  ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం అభిమానులను ఆనందపరిచింది. ఇటీవలే షూటింగ్ నేపథ్యంలో ఫ్లైట్ జర్నీ చేసిన రజినీకాంత్ ఇండిగో విమానంలో ఎకానమీ క్లాస్ లో ప్రయాణించారు. రజినీని తమతో పాటు విమానంలో చూడడం ప్రయాణికులతో ఉత్సాహాన్ని నింపింది. ఆయన రాగానే ప్రయాణికులంతా తలైవా.. తలైవా అంటూ కేకలు వేస్తూ వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. తలైవా కూడా చిరునవ్వుతో వారికి హాయ్ చెప్పి.. పలకరించారు. 

అందుకే హంబుల్ సూపర్ స్టార్ 

 ఇందుకు సంబంధించిన వీడియోను మనోబాల విజయబాలన్ Xలో షేర్ చేస్తూ.. సూపర్ స్టార్ రజినీ భారీ ఆదరణతో విమానాన్ని థియేటర్ గా మార్చారు అని క్యాప్షన్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు తలైవా సాధారణంగా అందరితో కలిసి ప్రయాణించడాన్ని ప్రశంసిస్తున్నారు. ఫరెవర్ హంబుల్ సూపర్ స్టార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరో అభిమాని తెరపై ఆయనను చూసి ఎప్పుడూ అలసిపోలేదు అని రాశారు.

Also Read :   Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజినీ కాంత్ చివరిగా 2024లో 'వేట్టయాన్' సినిమాలో కనిపించారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో  'కూలీ', నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్2 చేస్తున్నారు. 'కూలీ' ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి.  ఈ చిత్రం ఆగష్టు 14న విడుదల కానుంది.  ఇక  'జైలర్2'  విషయానికి వస్తే..   జనవరిలో అనౌన్స్  ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది. ఫస్ట్ షెడ్యూల్ చెన్నైలో జరిగినట్లు సమాచారం. 

latest-news | telugu-news | cinema-news

Also Read: Viral Video: హీరో విజయ్ని చూడటానికి చెట్టు మీద నుండి దూకిన క్రేజీ అభిమాని (వీడియో వైరల్)

Advertisment
Advertisment
Advertisment