Cinema: హీరో లేకుండా సినిమా తీస్తా..సందీప్ వంగా

హీరో లేకుండా సినిమా తీస్తానని క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా అన్నారు. అది కూడా 4, 5 ఏళ్ళల్లో తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పుడు నా గురించి విమర్శలు చేస్తున్న వారందరికీ ఆ సినిమాతో సమాధానం చెబుతానని చెప్పారు. 

New Update
SANDEEP REDDY VANG

SANDEEP REDDY VANG

సందీప్ వంగా...ఇంత క్రేజీ డైరెక్టర్ మరొకరు ఉండరేమో. ఈయన తీసిని రెండు సినిమాలూ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో పాటూ విపరీతమైన విమర్శలను ఎదుర్కొన్నాయి. మితిమీరిన రొమాన్స్ లేదా వైలెన్స్ చూపిస్తారు తన సినిమాల్లో సందీప్ వంగా. అంతేకాదు  ఈయన మూవీస్ లో హీరో కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. హీరోయిన్లను చాలా చులకనగా చూపిస్తారని అంటారు. దీనిపై సమాధానాలు చెప్పారు సందీప్.

హీరో లేకుండా తీస్తే ఎవరికీ నచ్చదు..

తాజాగా జరిగిన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో సందీప్ వంగా తన సినిమాలపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పారు. అంతేకాదు పాటలు లేకుండా సినిమా తీస్తారా? హీరో లేకుండా సినిమా తీస్తారా అని అడిగితే హీరో లేకుండానే తీయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఆలోచన అని చెప్పారు. 4, 5 సంవత్సరాల్లో నేను హీరో లేకుండా సినిమా తీస్తానని తెలిపారు.  అయితే అలా మూవీ చేస్తే ఇప్పుడు ఎవరైతే మహిళలు తనను విమర్శిస్తున్నారో అప్పుడు వారే తనను మళ్ళీ విమర్శిస్తారని చెప్పుకొచ్చారు కావాలంటే ఆ విషయాన్ని తాను రాసిస్తానని సందీప్ వంగా నమ్మకంగా చెప్పారు. ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా ‘5 ఏళ్ల క్రితం సందీప్‌ చెప్పింది. చేసి చూపించాడు’ అని మాట్లాడుకుంటారు’’ అని చెప్పారు.

ప్రస్తుతం సందీప్ వంగా యానిమల్ పార్క్, ప్రభాస్ తో స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. స్పిరిట్ సినిమా బాహుబలి రికార్డులను దాటాలని తారు అనుకోవడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 2వేల కోట్లు అనేది చాలా పెద్ద మొత్తం అని...దానిని దాటడం చాలా కష్టమని సందీప్ చెప్పారు. కానీ తానోక మంచి సినిమా తీస్తున్నానని..ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని సందీప్ తెలిపారు. 

Also Read: AP: విడదల రజనీపై విచారణ..అనుమతి కోసం గవర్నర్ కు లేఖ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment