Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌ కుసుమ్ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ అకస్మాత్తుగా కుప్పకూలడంతో 8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 100 మంది ఫ్యాక్టరీలో ఉన్నట్లు సమాచారం.

New Update
Chhattisgarh

Chhattisgarh Photograph: (Chhattisgarh)

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కుసుమ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా కుప్పకూలడంతో  8 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికి పైగా కార్మికులు  ఉన్నట్లు సమాచారం. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. పోలీసుల కేసు నమోదు  చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఒక్కసారిగా కుప్పకూలడానికి కారణం ఏంటి అనే కోణంలో విచారణ చేయనున్నారు. 

ఇది కూడా చూడండి:  Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే

సూర్యాపేట జిల్లాలో జాతీయ రహదారిపై..

ఇదిలా ఉండగా.. ఇటీవల సూర్యాపేట జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని.. ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !

ట్రావెల్స్ బస్సు ఖమ్మం మీదుగా ఒరిస్సా నుంచి హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బస్సు టైరు పేలడంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు మొదలు పెట్టారు. 

ఇది కూడా చూడండి:  Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment