Year Ender 2024: ఈ ఏడాది చనిపోయిన వ్యాపార దిగ్గజాలు వీరే!

ఈ ఏడాది భారత్ దిగ్గజ వ్యాపారవేత్తలను కోల్పోయింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, రతన్ టాటాతో పాటు నారాయణన్ వాఘుల్, బిబెక్ దెబ్రాయ్, శశి రుయా, అమియా కుమార్ బాగ్చి వంటి మహానుభావులు ఈ ఏడాది మృతి చెందారు.

author-image
By Kusuma
New Update
Year ender 2024 business

Year ender 2024 business Photograph: (Year ender 2024 business)

2024లో ఎందరో వ్యాపార దిగ్గజాలు మృతి చెందారు. భారత వ్యాపార రంగంలో ఎనలేని కృషి చేసిన మహానుభావులు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. రామోజీరావు నుంచి రతన్ టాటా వరకు ఈ ఏడాది మృతి చెందిన వ్యాపార దిగ్గజాలు ఎవరెవరో ఈ ఆర్టికల్‌లో చూద్దాం. 

రామోజీ రావు

ఈనాడు సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీ వ్యవస్థాపకులు చెరుకూరి రామోజీరావు అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది మృతి చెందారు. సామాన్య కుటుంబంలో జన్మించిన రామోజీరావు ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ గుర్తింపుని సంపాదించుకున్నారు. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ఫిల్మ్ స్టూడియోల్లో రామోజీ ఫిల్మ్ సిటీ పెద్దది. కేవలం మీడియా సంస్థలకు అధిపతిగానే కాకుండా హాస్పిటాలిటీ, ఫుడ్, రిటైల్, పచ్చళ్లు, మూవీ నిర్మాతగా రాణించారు. భారత ప్రభుత్వం రామోజీ రావును పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. 

rAMOJI RAO
rAMOJI RAO Photograph: (rAMOJI RAO)

రతన్ టాటా

పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా అనారోగ్య సమస్యలతో ముంబాయిలో ఈ ఏడాది మరణించారు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ దేశంలోనే టాప్ కంపెనీల్లో ఒకటి. కేవలం ఒక రంగంలోనే కాకుండా ఆటోమొబైల్, ఐటీ, టాటా స్టీల్ ఇలా అన్ని రంగాల్లో కూడా టాప్‌లో ఉంది. 

Ratan Tata busi
Ratan Tata busi Photograph: (Ratan Tata busi)

 

నారాయణన్ వాఘుల్

బ్యాంకింగ్ రంగ వెటరన్ నామ్ నారాయణన్ వాఘుల్ ఈ ఏడాది మేలో మృతి చెందారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కెరీర్‌ను ప్రారంభించిన వాఘుల్ ఐసీఐసీఐ గ్రూప్స్ స్థాపించారు. అయితే 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీగా నియమితులయ్యారు. దేశంలో ప్రభుత్వ బ్యాంకుకు సీఎండీ నియమితులైన అతిపిన్న వయస్కుడు కూడా ఇతనే. ఇతని సేవలకు దేశం వాఘుల్‌కి పద్మభూషణ్‌తో సత్కరించింది. 

Narayanan Vaghul
Narayanan Vaghul Photograph: (Narayanan Vaghul)

 

బిబెక్ దెబ్రాయ్

ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత బిబేక్ దేబ్రాయ్ ఈ ఏడాది మరణించారు. ఇతను ప్రధానమంత్రికి సలహాదారుగా కూడా పనిచేశారు. ఇతను చేసిన సేవలకు భారత్ ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 

Bibek Debroy
Bibek Debroy Photograph: (Bibek Debroy)

 

శశి రుయా

ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు శశి రుయా ఈ ఏడాది మృతి చెందారు. సోదరుడితో కలిసి ఎస్సార్ గ్రూప్‌ను ప్రారంభించారు. 

Shashi Ruia
Shashi Ruia Photograph: (Shashi Ruia)

 

అమియా కుమార్ బాగ్చి

ఎమెరిటస్ ప్రొఫెసర్, ఆర్థిక చరిత్రకారుడు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ కోల్‌కతా (IDSK) వ్యవస్థాపక డైరెక్టర్ అమియా కుమార్ బాగ్చి ఈ ఏడాది మృతి చెందారు. ఇతనికి దేశం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 

Amiya Kumar Bagchi
Amiya Kumar Bagchi Photograph: (Amiya Kumar Bagchi)

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates

🔴Live News Updates: 

Hyderabad Metro: వివాదంలో  హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం

హైదరాబాద్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీకి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

Hyderabad metro
Hyderabad metro

 

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్..  వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ మెట్లో రై ళ్లలో యథేచ్ఛగా జరుగుతున్న బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌ ఎన్వీఎస్ రెడ్డికి  నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ను తక్షణమే దాఖలు చేయాలని ఆదేశించింది. 

Also Read: Air india:పహల్గాం ఉగ్రదాడి...కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్‌ ఇండియా!

మెట్రో రైళ్లలో చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ.. హైకోర్టులో అడ్వకేట్ నాగూర్ బాబు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణించే మెట్రో రైలులో నిబంధనలను ఖతారు చేయకుండా అధికారులు ఎలా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు అనుమతులు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది యువతను తప్పుదారిలోకి మళ్లించే ప్రమాదం ఉందని అన్నారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

మరోవైపు.. తెలంగాణ గేమింగ్ యాక్ట్ 2017 స్పష్టంగా అమల్లో ఉన్నప్పటికీ, HMRL తో పాటు దాని  అనుబంధ సంస్థలు కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడానికి భారీగా ముడుపులు అందుకున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ అక్రమ లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేత సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ కుంభకోణంలో ఎంత మంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు లాభం పొందారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ పిటిషన్‌పై గురువారం  తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కీలక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న అనంతరం, ప్రతివాదులైన HMRL ఎండీకి నోటీసులు జారీ చేశారు. పూర్తి ఆధారాలు, వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. దీంతో ఈ కేసులో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు న్యాయ నిపుణులు అంటున్నారు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఒకవేళ ఇది HMRL నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.

Also Read:RCB Vs RR: దుమ్ము దులిపేసిన కోహ్లీ, పడిక్కల్.. ఆర్సీబీ భారీ స్కోర్ - రాజస్థాన్ టార్గెట్ ఇదే

Also Read: All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్‌లో రాహుల్ గాంధీ పర్యటన

  • Apr 25, 2025 21:25 IST

    ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు

    కొమురం భీం జిల్లా జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన చత్రుషావ్ ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టాడు. ఒక యువతితో నాలుగేళ్లు.. మరో యువతితో ఏడాది పాటు ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం తెలిసి ఇద్దరు యువతులు అతడ్నే పెళ్లి చేసుకుంటామని ముందుకొచ్చారు.

    telangana young man
    telangana young man Photograph: (telangana young man)

     



  • Apr 25, 2025 16:46 IST

    ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!

    కాంగ్రెస్ అగ్రనేతలు  సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఇతరులకు భారీ ఊరట లభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది.  కొత్త చట్ట నిబంధనల ప్రకారం విచారించకుండా ఛార్జిషీట్‌ తీసుకోలేమని స్పష్టం చేసింది.

    ed-sonia
    ed-sonia

     



  • Apr 25, 2025 15:08 IST

    నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి

    ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిచివేస్తోంది. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో వివాహమైంది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించారు.

    jagityal married women
    jagityal married women

     



  • Apr 25, 2025 15:07 IST

    రిపీటైతే తీవ్ర చర్యలుంటాయ్.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్!

    రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ జోడో యాత్రలో దివంగత సావర్కర్ ను 'బ్రిటిష్ ఏజెంట్'గా రాహుల్ అభివర్ణించారు. స్వాతంత్య్ర సమరయోధుల్ని అవమానిస్తే చూస్తూ ఉండబోమని, ఇది మళ్లీ రిపీటైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

    suprmee-court rahul gandhi
    suprmee-court rahul gandhi

     



  • Apr 25, 2025 09:55 IST

    Hyderabad MLC Elections: బీజేపీకి భారీ షాక్..!! ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు.

    హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధించారు. బీజేపీ తరఫున బరిలో దిగిన గౌతమ్ రావుపై కేవలం 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

    Hyderabad MLC Elections
    Hyderabad MLC Elections

     



  • Apr 25, 2025 08:23 IST

    BIG Breaking: కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్..

    బోర్డర్ దగ్గర పాకిస్తాన్ అప్పుడే కాల్పులను ప్రారంభించేసింది. నిన్న రాత్రి కూడా పలు చోట్ల కాల్పులు జరిపిన  దాయాది దేశం ఈరోజు ఉదయం నుంచి మరింత వేగం పెంచింది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. 

    india
    Pakistan Started Firing

     



  • Apr 25, 2025 07:45 IST

    TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఉచితంగానే..!

    తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య సంకీర్తనలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించాలని ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. వేసవిలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు

    Tirumala Tirupati Devasthanams .
    Tirumala Tirupati Devasthanams .

     



  • Apr 25, 2025 07:44 IST

    Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

    సూర్యా నటించిన 'రెట్రో' సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ్,తెలుగు వర్షన్లకు ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విజయ్ దేవరకొండతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానుండటం తో సినిమాపై హైప్ పెరిగిపోయింది.

    Retro Pre Release
    Retro Pre Release

     



  • Apr 25, 2025 06:51 IST

    RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

    మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

    ipl
    RCB VS RR

     



  • Apr 25, 2025 06:50 IST

    Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

    కాశ్మీర్ ఉగ్రదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.అపార నష్టంతో కుమిలిపోతున్న మనం రగిలిపోతుంటే..పాకిస్తాన్ మాత్రం పొగరుతో కాలు దువ్వుతోంది. యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే గెలుపెవరిది?ఎవరి బలం ఎంతుంది?

    Indian Army
    Indian Army

     



  • Apr 25, 2025 06:50 IST

    Air india: పహల్గాం ఉగ్రదాడి... కీలక ప్రకటన చేసిన ఇండిగో,ఎయిర్‌ ఇండియా!

    టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.భారత్‌కు చెందిన విమానాలకు పాక్‌ తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక పై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది.

    Air India
    Air India

     



Advertisment
Advertisment
Advertisment