Lay Off: ఒకేసారి 99 మంది ఉద్యోగులను తీసేసిన CEO.. కారణం తెలిస్తే షాకే!

అమెరికా మ్యూజిక్ కంపెనీ సీఈఓ బాల్డ్విన్ నిర్వహించిన మీటింగ్‌కు హాజరు కాలేదని 99 మంది ఉద్యోగులపై వేటు వేశారు. కంపెనీలో మొత్తం 111 మంది ఉండగా.. మీటింగ్‌కి హాజరు కాని వారికి ఉద్యోగంపై సీరియస్‌నెస్ లేదని తీసేశారు.

New Update
Layoffs: మస్తు పనిచేసిండ్రు..ఇక ఇంటికి పోండి..ఐటీ కంపెనీ నిర్ణయం..!

సీఈవో నిర్వహించిన ఓ మీటింగ్‌కు ఎంప్లాయిస్ హాజరు కాలేదని ఉద్యోగం నుంచి తొలగించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన మ్యూజిక్ కంపెనీ ఉద్యోగులు అందరికి ఓ సమావేశం నిర్వహించింది. మొత్తం 111 మంది ఎంప్లాయిస్ ఉండగా అందులో కొందరు మాత్రమే హాజరయ్యారు. దీంతో హాజరుకాని వారిని సీఈఓ బాల్డ్విన్ ఉద్యోగం నుంచి తొలగించారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

సమావేశానికి హాజరు కానీ 99 మందిపై..

మీటింగ్‌కి హాజరు కానీ ఒక పది మందిపై వేటు వేశారని అనుకుంటే పొరబాటే. 111 మంది ఉన్న ఎంప్లాయిస్‌లో 99 మందిపై వేటు వేశారు. ఉద్యోగాన్ని సీరియస్‌గా తీసుకోలేదని, సీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఉద్యోగులు చేయాల్సిన పనిలో విఫలమయ్యారు.. కనీసం సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగంలో నుంచి తీసేశారు.

ఇది కూడా చూడండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత

సంస్థకి సంబంధించిన అన్ని ఖాతాలను సైన్ ఔట్ చేయడంతో పాటు వస్తువులను తిరిగి ఇచ్చేయాలన్నారు. సమావేశానికి హాజరైన వారిని ఉద్యోగంలో ఉంచి మిగతా వారిని తీసేశారు. ఈ విషయాన్ని ఆ సంస్థలో పనిచేసే ఒక ఇంటర్న్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హైదరాబాద్‌లో ఐటీ దాడులు

సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో.. దీనికి కొందరు నెటిజన్లు స్పందించారు. మీటింగ్ అంటే ఎవరో పది మంది హాజరు కాకపోవచ్చు.. మరీ 99 మంది సమావేశానికి హాజరు కాకుండా ఉండరు కదా. ఆఫీస్ యాజమాన్యం కావాలనే అలా చేసిందని అంటున్నారు. మరికొందరు ఆఫీస్‌లో రాజకీయాలు జరుగుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే జరిగిందా? లేకపోతే కంపెనీ అలా క్రియేట్ చేసిందా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Stock Markets: టారీఫ్ లకు బ్రేక్..ఆసియా, వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్లో జోష్

సుంకాలకు బ్రేక్ ఇస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈరోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో కూడా మార్కెట్లు రికార్డ్ స్థాయిలో లాభపడ్డాయి. మహావీర్ జయంతి కారణంగా భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. 

author-image
By Manogna alamuru
New Update
stock market

ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గారు. 90 రోజుల పాటూ టారీఫ్ లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.  దీంతో కొన్ని రోజులుగా అతలాకుతలం అవుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఈరోజు పుంజుకున్నాయి. అమెరికా మార్కెట్లు రికార్డ్‌ స్థాయిలో లాభాలను ఆర్జించగా.. ఆసియా మార్కెట్లు కూడా కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు 12% పెరిగాయి. ఆసియా మార్కెట్లు కూడా 10% పెరిగాయి. మహావీర్ జయంతి సెలవుదినం కారణంగా భారత మార్కెట్లు మాత్రం మూసివేయడ్డాయి. 

ఆసియా మార్కెట్లు..

జపాన్ నిక్కీ ఇండెక్స్ 2,660 పాయింట్లు అటే 8.39% పెరిగి 34,370 వద్దకు చేరుకుంది. కొరియా కోస్పి ఇండెక్స్ 110 పాయింట్లు అనగా 4.70% పెరిగి 2400 వద్దకు చేరుకుంది. తైవాన్‌కు చెందిన TAIEX సూచీ 620 పాయింట్లు లేదా 9.35% పెరిగి 19,020 వద్దకు చేరుకుంది. షాంఘై సూచీ మాత్రం స్వల్పంగా 0.6శాతం లాభంతో కొనసాగుతోంది. 

24 ఏళ్ళ తర్వాత సూపర్ డే..

టారీఫ్ లపై ట్రంప్ ప్రకటన తర్వాత బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లాయి. డౌ జోన్స్ 2,962 పాయింట్లు లేదా 7.87% పెరిగి 40,608 వద్ద ముగిసింది. 2020 ఇది మార్చి నమోదైన అతిపెద్ద లాభం. అలాగే S&P 500 ఇండెక్స్ 9.52% పెరిగి 5,456.90కి చేరుకుంది.  2008 తర్వాత  S&P 500 ఇండెక్స్ అతిపెద్ద సింగిల్-సెషన్ పెరుగుదల ఇది.  మరోవైపు టెక్ స్టాక్స్ ఇండెక్స్ అయిన నాస్డాక్ కాంపోజిట్ 12.16% పెరిగి 17,124 కు చేరుకుంది. నాస్‌డాక్‌ ఒక రోజులో ఇలా రికార్డ్‌ స్థాయిలో లాభపడడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. వాల్ స్ట్రీట్ లో దాదాపు 30 బిలియన్ షేర్లు ట్రేడ్ అయ్యాయి. దీంతో బుధవారం వాల్ స్ట్రీట్ చరిత్రలో అత్యధికంగా ట్రేడ్ అయిన రోజుగా నిలిచింది.

 today-latest-news-in-telugu | stock-markets | asia | trump tariffs 

Also Read: USA: సైనిక చర్యలు తప్పువు..ఇరాన్ డీల్ పై ట్రంప్ మరోసారి..

Advertisment
Advertisment
Advertisment