Social Media: సోషల్ మీడియాలోనూ పోటీలు పడుతున్న పార్టీలు..టాప్‌లో బీజేపీ

దేశంలో ప్రధాన పార్టీలు ప్రజలతో ఇంటరాక్ట్‌ అవ్వడానికి సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నాయి. 2014 నుంచి దీన్ని ఫాలో అవుతున్నా...ఇప్పుడు అది మరింత పెరిగింది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా వాడుకోవడంలో అందరికంటే బీజేపీ ముందంజలో ఉంది.

New Update
Social Media: సోషల్ మీడియాలోనూ పోటీలు పడుతున్న పార్టీలు..టాప్‌లో బీజేపీ

Political Parties In Social Media: నేటి ఆధునిక జీవనశైలిలో సోషల్ మీడియా ఒక పార్ట్‌ అయిపోయింది. ఇది లేకపోతే పొద్దు గడవడం లేదు. అందుకే 2014 నుంచి రాజకీయ పార్టీలు దీని మీద దృష్టిని పెట్టాయి. ఎన్నికలు ఉన్నప్పుడే కాకుండా..మామూలు టైమ్‌లో కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రజలకు చేరువలో ఉండడానిక ప్రయత్నాఉల చేస్తున్నాయి. ప్రధాని మోదీ లాంటివారు అయితే దీన్నే ప్రధాన ఆయుధంగా చేసుకున్నారు కూడా. ప్రస్తుతం ఎన్నికల నేథ్యంలో సోషల్ మీడియాలో యాడ్స్, ప్రచారాలు చేస్తూ దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రారాజు ఎవరు అనే సర్వే జరిగింది. ఇందులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇండియా టుడే యొక్క ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టీమ్ ఈ సర్వేను చేసింది.

గత కొంతకాలంగా బీజేపీ. కాంగ్రెస్ , ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు సోసల్ మీడియా ఖాతాలను పరిశీలించింది. దీంతో పాటు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన రాజకీయ పార్టీల నేతల డేటాను కూడా విశ్లేషించారు. ఈ మొత్తం సర్వేలో బీజేపీనే టాప్ ప్లేస్‌లో ఉందని స్పష్టం అయింది. అయితే కాంగ్రెస్, ఆప్ పార్టీల ఫేస్‌బుక్, ఇన్స్టా పేజీల్లో మాత్రం కొత్త యూజర్లు బాగా పెరుగుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీ కంటే ఈ రెండు పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఇక తృణమూల్ కాంగ్రెస్ హవా మాత్రం తక్కువగానే ఉంది. ఇది దేశంలోనే మూడవ అతి పెద్దగా పార్టీగా ఉన్నా సోసల్ మీడియాలో మాత్రం దీని ప్రబావం అంతంత మాత్రమే అని సర్వే చెబుతోంది.

మోదీని ఢీకొట్టేవారే లేరు..
ఇక రాజకీయ నాయకులు, నేతల విషయానికి వస్తే అందరూ అనుకుంటున్నట్టుగానే సోషల్ మీడియాలో ప్రదాని మోదీ హవా నడుస్తోంది. ఈ ఏడాది అందరు నేతలకూ ఫాలోయింగ్ బాగా పెరుగుతున్నప్పటికీ మోదీని ఢీకొట్టేవారు మాత్రం ఎవరూ లేరు. జనవరి, ఫిబ్రవరిలలో ప్రతి నెలా 1.2 లక్షల మందిఫాలోవర్స్ బిజెపి ఖాతాలో జాయిన్ అవుతున్నారు. కానీ ఒక్క మార్చిలో మాత్రమం ఏకంగా 1.7 లక్షల మంది కొత్త యూజర్లు జాయిన్ అయ్యారు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో కాంగ్రెస్ పార్టీకి జనవరిలో 59 వేలు, ఫిబ్రవరిలో 70 వేలు, ఇంకా మార్చిలో 1.08 లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు.

యూట్యూబ్‌లో ఆమ్ ఆద్మీ..

ఇక యూట్యూబ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఆప్ పార్టీదే పైచేయి. కొత్త సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకోవడంలో కాంగ్రెస్, ఆప్ పార్టీలో ముందంజలో ఉన్నారు. మరోవైపు యూట్యూబ్‌లో బీజేపీ రోజురోజుకూ క్షీణిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన యూట్యూబ్ ఛానెల్ మూడు నెలల్లో 5.9 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. మార్చిలో 3.6 లక్షల కంటే ఎక్కువ మంది సభ్యులను చేర్చుకుంది. అదే సమయంలో, ఈ ఏడాది మూడు నెలల్లో బీజేపీ యూట్యూబ్ ఛానెల్‌లో 5.3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు పెరగగా, కాంగ్రెస్ యూట్యూబ్ ఛానెల్‌లో 5 లక్షల మంది సబ్‌ స్క్రైబర్లు పెరిగారు. ఇక టీఎంసీకి అయితే కేవలం 28 వేల మంది యాడ్ అయ్యారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే బీజేపీ సబ్‌స్క్రైబర్లు అయితే పెరగలేదు కానీ వాళ్ళు పోస్ట్చేసిన కంటెంట్‌కు మాత్రం బోలెడన్ని వ్యూస్ వచ్చాయి. మూడు నెలల్లో బీజేపీ వీడియోలకు 43 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వీడియోలకు 30.78 కోట్లు, కాంగ్రెస్ వీడియోలకు 16.69 కోట్ల వ్యూస్ వచ్చాయి.

Also Read:Rahul Gandhi: సీఎం స్టాలిన్ నోటిని తీపి చేసిన రాహుల్ గాంధీ..ఫేమస్ మైసూర్ పాక్ గిఫ్ట్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime : అన్నంలో మత్తు మందు కలిపి... వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పని మనుషులే ఈ దోపిడీకి పాల్పడ్డారు.

New Update
Massive theft

Massive theft

 TG Crime :  హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హేమ్‌రాజ్‌ , అతడి భార్య మీనా దుగ్గర్‌ నివాసముంటున్నారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారు నగలు, నగదు తీసుకుని పారిపోయారు.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్‌రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో పాటు కారు తీసుకుని ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే  హేమరాజ్‌ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. 

Also read: Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్‌

దీంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన పని మనుషులు (నేపాలి దంపతులు) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also read: wife harassment: మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’

Advertisment
Advertisment
Advertisment