Araku Chilapanduga: రేపు అరకు చలిపండుగ...ఈ పండుగలో ఏం చేస్తారంటే....

ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త టూరిజం పాలసీని సైతం ప్రవేశపెట్టింది. ఈ పాలసీలో భాగంగా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పండుగలు నిర్వహించాలని నిర్ణయించింది.

New Update
Araku Chilapanduga

Araku Chilapanduga

Araku Chilapanduga: ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చెందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కొత్త టూరిజం పాలసీని సైతం ప్రవేశపెట్టింది. ఈ పాలసీలో భాగంగా ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పండుగలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాంగా  ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులో చలి పండుగ నిర్వహించేందుకు సిద్దమైంది. జనవరి 31 శుక్రవారం ప్రారంభమయ్యే ఈ పండుగ మూడు రోజులపాటు జరుగుతుంది.

Also Read: Deep Seek: డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలన


ఈ కార్యక్రమంలో పర్యాటకులను ఆకట్టుకోవడానికి పలు ఆకర్షణనీయమైన కార్యక్రమాలను, పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. అరకు లోయలోని ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ చలి పండుగను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందులో తొలి రోజు అయిన శుక్రవారం ఉదయం  పద్మాపురం గార్డెన్ నుంచి కార్యక్రమ ప్రధాన వేదికైన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వరకూ అరకు మారథాన్ పరుగు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారు.

Also Read: Arvind Kejriwal: యమునా నది వివాదం.. కేజ్రీవాల్‌పై కేసు నమోదు !

11 గంటలకు పద్మాపురం గార్డెన్స్ లో ఫ్లవర్ షో, 12 గంటలకు అరకు ట్రైబల్ మ్యూజియంలో పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫుడ్ స్టాల్స్ ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకు పద్మాపురం గార్డెన్స్ నుంచి డిగ్రీ కాలేజ్ వరకూ కార్నివాల్ పరేడ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో సంప్రదాయ గిరిజన నృత్యాలతో పాటు స్థానిక కళలను ప్రదర్శిస్తారు. 

Also Read: నేను తాగే నీళ్లల్లో విషం.. ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్!

ఈ పండుగలో ఏం చేస్తారంటే....

ఫిబ్రవరి ఒకటిన బొర్రా గుహల నుంచి అరకు డిగ్రీ కాలేజ్ వరకూ సైక్లింగ్ ర్యాలీ ఉంటుంది. అరకు ఎంపీడీవో ఆఫీసు వద్ద 11 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. 12 గంటలకు డిగ్రీ కాలేజ్ లో అరకు బొకే ఇనాగ్రేషన్ ఉంటుంది. అనంతరం వాటి అమ్మకాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు అరకు కాఫీ హౌస్ లో కాఫీ పరిచయం ఉంటుంది. అక్కడే 3 గంటల నుంచి 4 గంటల వరకూ వక్తలు కాఫీ ప్రత్యేకత ఉపయోగాలపై మాట్లాడతారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి ఫ్యాషన్ షో, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరిగి ఫిబ్రవరి 2న ఆదివారం ఉదయం 7 గంటలకు అరకు సుంకమెట్ట కాఫీ తోటల నుంచి అరకు ట్రెక్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి అరకులో వాల్ పెయింటింగ్, 11 గంటలకు ముగ్గుల పోటీ ఉంటుంది. 12 గంటలకు ట్రైబల్ మ్యూజియంలో ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు మగింపు కార్యక్రమాలు, సాంస్కృతి కార్యక్రమాలు, లేజర్ షో కూడా ఉంటాయి. అలాగే ఈ మూడు రోజుల పాటు అరకులో హెలికాఫ్టర్ రైడ్ కూడా పర్యాటకుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు పలువురు ప్రముఖులు హాజరవ్వనున్నారు.


 Also Read: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ram Charan vs. Allu Arjun : పెద్ది సినిమా అప్డేట్…రాంచరణ్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ రచ్చరచ్చ

గత కొంతకాలంగా మెగాఫ్యామిలీకి, బన్ని ఫ్యాన్స్‌ కి మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైన వివాదం బన్ని పుష్ప-2 విడుదల, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన కూడా ప్రభావం చూపింది.తాజాగా మరోసారి వివాదం తెరమీదకు వచ్చింది.

New Update
Ram Charan vs. Allu Arjun

Ram Charan vs. Allu Arjun

Ram Charan vs. Allu Arjun: గత కొంతకాలంగా మెగాఫ్యామిలీకి, బన్ని ఫ్యాన్స్‌ కి మధ్య జరుగుతున్న రచ్చ తెలిసిందే. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మొదలైన వివాదం బన్ని పుష్ప-2 విడుదల, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన కూడా ప్రభావం చూపింది.తాజాగా మరోసారి వివాదం తెరమీదకు వచ్చింది. అయితే ఇద్దరు హీరోల మధ్య ఎలాంటి వివాదాలు లేకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం తగ్గడం లేదు. నిజానికి నటులు ఏనాడు నేరుగా గొడవపడింది లేదు. ఇద్దరు ఎలాంటి గొడవలు పడడం లేదు కానీ.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్... పెద్ద గొడవే పెట్టుకుంటున్నారు. వాస్తవంగా ఇవాళ శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో...హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా నుంచి అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ పెద్ది సినిమా ఫస్ట్ షాట్ అంటూ ఓ గ్లింప్స్ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. 
 Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

దీంతో ఇవాళ ఉదయం నుంచి... సోషల్ మీడియాలో పెద్ది సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ దెబ్బకు వెంటనే అలర్ట్ అయిన అల్లు అర్జున్ అభిమానులు...రామ్ చరణ్ ఫ్యాన్స్ పై యుద్ధమే ప్రకటించారు. AA22 పేరుతో కొత్తగా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి... సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అల్లు అర్జున్ అలాగే అట్లీ కాంబినేషన్ లో అతి త్వరలోనే సినిమా రాబోతుందన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. దీనిపై ఏప్రిల్ 8వ తేదీన.. అల్లు అర్జున్ బర్త్..డే ఉంది. ఆ రోజునే A A22 మూవీ ప్రకటన రానుందని అంటున్నారు.

Also read: Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి
 
దీంతో రామ్ చరణ్ అభిమానులకు కౌంటర్ గా... ఇవాల్టి నుంచే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ట్రెండింగ్ లో ఉన్న పెద్ది సినిమాను అల్లు అర్జున్ కొత్త సినిమా AA22 దాటేసింది. ఇక తాము తగ్గేదే లేదని... రామ్ చరణ్ ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో.. కౌంటర్ స్టార్ట్ చేశారు. ఇలా ఇద్దరు బడా హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. దీంతో రెండు సినిమాల మీదా ఈ ప్రచారం ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. గతంలో సినిమా అభిమానుల మధ్య ఉన్న మంచివాతావరణం ఈమధ్య చెడిపోతుందన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది.

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

 

Advertisment
Advertisment
Advertisment