Ap Rains : ఏపీలో అలర్ట్.. ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు!
ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.. ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు.
ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది.. ఈ మేరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లు అలెర్ట్ అయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు బ్రహ్మోత్సవాలు కావడంతో స్వామివారికి ఘనంగా చక్రస్నానం నిర్వహించి మాడ వీధుల్లో విహరించున్నారు. ఈ రోజు స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రానున్నారు.
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారని వైసీపీ ఎంపీ గురుమూర్తి చేసిన ట్వీట్కు కౌంటర్ ఇచ్చారు లోకేష్. వైసీపీ అధ్యక్షుడు నుంచి కార్యకర్త వరకు అందరు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
దివ్వెల మాధురి మీద తిరుమల వన్ టౌన్ లో కేసు నమోదు అయింది. మతవిశ్వాసాలు దెబ్బతీసే విధంగా ఆమె తిరుమల మాడవీధిలో రీల్స్ చేశారని ఆలయ విజిలెన్స్ అధికారి ఫిర్యాదు చేశారు. BNS 292,296, 300 సెక్షన్ 66 -2000-2008 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
AP: జైల్లో ఉన్నప్పుడు తనను చంపాలని కుట్ర చేశారనే ప్రచారం జరిగిందని అన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం చేసిన దానికి కక్ష తీర్చుకోవడం తన లక్ష్యం కాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కొరకే తాను కృషి చేస్తానని చెప్పారు.
AP: ఈరోజు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమీన్ హాస్పిటల్ డాక్టర్ ఇంతియాజ్ సైబర్ కేటుగాళ్ల వలలో పడిపోయాడు. మీ పేరుతో డ్రగ్స్ కేసు నమోదైందని పోలీసు అధికారి ఫొటోతో ఒక ఫోన్ వచ్చింది. ఆపై డూప్లికేట్ పోలీస్ స్టేషన్ చూపించి రూ.2 కోట్లు కొట్టేశారు.
దువ్వాడ శ్రీనివాస్, మాధురి పెళ్లి చేసుకున్నారని వచ్చిన వార్తలను అతను ఖండించారు. పార్టీ కార్యకర్తలతో తిరుమల బ్రహ్మోత్సవాలు చూడటానికి వెళ్లానని దువ్వాడ తెలిపారు. అందరిలాగానే తాను తిరుమలకు వెళ్లారని, దుష్ప్రచారాలను ప్రచారం చేయవద్దని కోరారు.