Sankranthi: కొత్త అల్లుడికి అదిరిపోయే విందు.. 500 రకాల ఐటమ్స్!

సంక్రాంతి సందర్భంగా ఏపీ యానాంలో కొత్త అల్లుడికి అత్తగారు అదిరిపోయే విందు ఇచ్చారు. 500 రకాల ఐటమ్స్‌ ఏర్పాటు చేసి సత్యభాస్కర్-వెంకటేశ్వరి దంపతులు ఔరా అనిపించారు. ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందంటూ సాకేత్ సంతోషం వ్యక్తం చేశాడు. 

New Update
sankranthi

sankranthi special 500 hundred types of food feast ap

Sankranthi: సంక్రాంతి సందర్భంగా ఏపీ యానాంలో కొత్త అల్లుడికి అత్తగారు అదిరిపోయే విందు ఇచ్చారు. 500 రకాల ఐటమ్స్‌ ఏర్పాటు చేసి సత్యభాస్కర్-వెంకటేశ్వరి దంపతులు ఔరా అనిపించారు. ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందంటూ సాకేత్ సంతోషం వ్యక్తం చేశాడు. 

500 వందల రకాలు..

మర్యాదలతో చుట్టాలని కట్టిపడేయటం గోదావరి జిల్లా వాసుల ప్రత్యేకత. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల రెండవ కుమార్తె హరిణ్య కు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్ వివాహం అయింది. కొత్తగా పెళ్లయి వచ్చిన చిన్నల్లుడిని సంక్రాంతి పండగకు ఆహ్వానించి 500 రకాలతో ప్రత్యేక విందును ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు క్లోజ్ ఫ్రెండ్ బిగ్ షాక్.. రేవంత్ పై పొగడ్తల వర్షం.. అసలేం జరుగుతోంది?

వివిధ రకాల శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు ఇలా 500 వందల రకాలు కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు సాకేత్ కుమార్తె హరిణ్యకు ఇద్దరికి విందు ఏర్పాటు చేశారు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన విందుకు అల్లుడు సాకేత్ ఉబ్బితబిబ్బయ్యాడు. శాఖాహారంలో ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందని అల్లుడు సాకేత్ తెలిపారు.

అలాగే సత్యభాస్కర్ నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. హరిదాసు కీర్తనలు, 200 అడుగులు భోగిపిడకల దండతో భోగి మంటలు వేశారు. మాజేటి ఉమ్మడి కుటుంబంలో వివాహం కావడంతో కొత్త అల్లుడు సాకేత్, హరిణ్యకి గుర్తుండిపోయే విధంగా సంక్రాంతి విందు భోజనాన్ని ఏర్పాటు.  

ఇది కూడా చదవండి: Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు