Manchu:మోహన్‌బాబు యూనివర్సిటీలో హై టెన్షన్..మళ్లీ తన్నుకున్న బౌన్సర్లు

మోహన్‌బాబు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. తిరుపతిలోని విద్యానికేతన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. అవ్వ, తాతల సమాధుల వద్ద నివాళులు అర్పించేందుకు రానివ్వకపోవడంతో మనోజ్‌ బలవంతంగా గేట్లు తోసుకుని వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్‌బాబు, మనోజ్ బౌన్సర్లు తన్నుకున్నారు. 

New Update
manchu family

manchu family Photograph: (manchu family)

Mohanbabu Vs manoj: మోహన్‌బాబు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. తిరుపతిలోని విద్యానికేతన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. అవ్వ, తాతల సమాధుల వద్ద నివాళులు అర్పించేందుకు రానివ్వకపోవడంతో మనోజ్‌ బలవంతంగా గేట్లు తోసుకుని వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్‌బాబు, మనోజ్ బౌన్సర్లు తన్నుకున్నారు. 

గేట్లు తీయాలంటూ అరిచిన మనోజ్..

ఈ మేరకు తమ తాత-నానమ్మల వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న వారి సమాధుల వద్ద నివాళులు అర్పించేందుకు మనోజ్ తన భార్యతో కలిసి వెళ్లాడు. అయితే వారిని పోలీసులు, సిబ్బంది లోనికి అనుమతించలేదు. ఇటీవల నమోదైన కేసు కోర్టు పరిధిలో ఉన్న కారణంగా లోనికి అనుమతించే వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కనీసం వారి సమాధులకు దండంపెట్టుకుని వెళ్తానని మనోజ్ చెప్పాడు. అయినప్పటికీ వినకపోవడంతో మోహన్ బాబు బౌన్సర్లను అరేయ్ గేట్లు తియ్యండ్రా అంటూ గట్టిగా కేకలు వేశాడు. రోడ్డుమీద ట్రాఫిక్ జామ్ కావడతో అనవసరంగా కాలేజీ ముందు ఉన్న దుకాణ దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డాడు. మనోజ్ అవ్వతాతల సమాధి వద్దకు వెళ్లేందుకు వీలైతే ఎస్పీ దగ్గరకి వెళ్తానని చెప్పాడు మనోజ్.

ఇది కూడా చదవండి: TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపరాఫర్.. 40 వేల ఉద్యోగాలు!

ఇక మీడియాతో మాట్లాడుతూ..మోహన్ బాబు నార్త్ నుంచి బౌన్సర్లను తెప్పించుకుని దారుణం చేస్తున్నారని ఆరోపించాడు. 'నేను వెనక్కి వెళ్లను. దమ్ముంటే అరెస్టు చేసుకోండి. గొడవ చేసేందుకు రాలేదు. ఈ క్యాంపస్‌ ఒక్కరిదే కాదు. అభిమానులు ఏర్పాటు చేసిన నా ఫ్లెక్సీలు కావాలనే చించి వేశారని అన్నారు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా. నన్ను ఎలా అడ్డుకుంటారు. గొడవ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. అనుమతిస్తే సమాధుల వద్దకు వెళ్లి దండం పెట్టుకుని వెళ్లిపోతానని చెప్పాడు. నార్త్ బౌన్సర్లకు తాను ఒక్కడినే చాలని ఒక్కొక్కడి తోలు తీస్తానన్నారు. ఇదే క్రమంలో గొడవ మరింత ముదరడంతో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవకు దిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. 

ఇది కూడా చదవండి: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. ఎన్నిక రద్దు?

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP liquor scam : ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో మరో సంచలనం...  సజ్జల శ్రీధర్‌ రెడ్డి అరెస్ట్

వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవలె కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
SAJJALA SREEDHAR REDDY

SAJJALA SREEDHAR REDDY

AP liquor scam : వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసులో వరుస అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇటీవలె కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో శ్రీధర్‌ రెడ్డి ఏ6గా ఉన్నారు. ఆయనను కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి కాగా.. కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్‌ రెడ్డి కీలకంగా వ్యహించినట్లుగా సీట్ గుర్తించింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి (ఏ1), ఆయన తోడల్లుడు చాణక్య (ఏ8)ను అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని అడ్డు పెట్టుకుని ప్రతినెలా రూ.60 కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, నాటి ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్‌ స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్‌తో కలిసి శ్రీధర్‌రెడ్డి కూడా కుట్రలు చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కేసులో శ్రీధర్‌ రెడ్డిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

శ్రీధర్‌ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి, వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి వందల కోట్లు వెనకేసుకున్నట్లు సిట్‌ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు... శుక్రవారం సాయంత్రం శ్రీధర్‌ రెడ్డిని అరెస్టు చేసి. విజయవాడకు తీసుకొచ్చారు. శనివారం ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
   
మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్‌రెడ్డి పాత్ర గురించి చాణక్య రిమాండ్‌ రిపోర్టులోనే ‘సిట్‌’ క్లుప్తంగా వివరించింది. దీని ప్రకారం... 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్‌లోని తాజ్‌ కృష్ణ హోటల్లో శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్‌ యజమానులను రప్పించారు. లిక్కర్‌ సరఫరా చేయాలంటే కనీసం 12శాతం కమీషన్‌ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు.  

Also Read: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

హైదరాబాద్‌లోని స్టార్‌ హోటళ్లలో సజ్జల శ్రీధర్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్య ప్రసాద్‌ పలుమార్లు చర్చలు జరిపారు. కమీషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు వెళ్లాయి. అలాగే అప్పటికే ఏపీలో ఉన్న డిస్టిలరీస్‌ను బలవంతంగా లాక్కుని సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. శ్రీధర్‌రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ్‌లో మిథున్‌రెడ్డికి వాటా వచ్చేలా ప్లాన్‌ చేశారు. వైసీపీ హయాంలో మద్యం దుకాణాల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న సదరన్‌ బ్లూ, నైన్‌ హార్స్‌ వంటివి వీరి ఉత్పత్తులే కావడం గమనార్హం.

Also Read :  మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

Advertisment
Advertisment
Advertisment