Crime News: ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి ఇదేం పనిరా.. మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణం

తిరుపతి జిల్లాలో ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన ఓ ల్యాబ్ టెక్నీషియన్ పేషెంట్ బంగారు గాజులను దొంగిలించాడు. ప్రమిల అనే మహిళకు గాయలు అయ్యాయి. ఆమెకు డ్రెస్సింగ్ చేయడానికి వచ్చి ఇంజక్షన్ ఇచ్చాడు. ఆమె మత్తులోకి వెల్లడంతో 6సవర్ల గాజులు పట్టుకుని పారిపోయాడు.

New Update
Lab technician Theft gold bangles for women undergoing treatment in Tirupati

Lab technician Theft gold bangles for women undergoing treatment in Tirupati

శత్రువులు ఎక్కడో ఉండర్రా.. మన పక్కనే.. మనతోనే ఉంటారు అనే ఈ డైలాగే అందరూ వినే ఉంటారు. కొన్నిసార్లు అదే నిజమనిపిస్తుంది. మనం నమ్మిన వారే మనల్ని నట్టెట ముంచేసే పరిస్థితులు కొందరికి ఎదురవుతాయి. కొన్ని సినిమాల్లోనూ అలాంటి సన్నివేశాల్ని చూపిస్తారు. అలాంటివి రియల్ లైఫ్‌లోనూ జరుగుతాయి. 

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. తెలిసిన వ్యక్తే కదా అని వారానికోసారి ఇంట్లోకి రానిస్తే.. అతడు చేసిన పనికి అంతా షాకయ్యారు. ఏకంగా మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు. అతడు చేసిన దారుణం బయటకు రావడంతో పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఫైల్ అయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?.. మహిళ ఇంటికి ఎందుకు వచ్చాడు?.. వారానికి రావలసిన అవసరం ఏమొచ్చింది?.. వచ్చి అతడు చేసిన దారుణం ఏంటి?.. అనే విషయానికొస్తే.. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణం

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా కోటలోని స్థానిక NCR నగర్‌లో ప్రమీల అనే మహిళ నివాసముంటుంది. ఆమెకు ఒక కుమారుడు. ఇద్దరూ అదే ఇంట్లో ఉంటున్నారు. ఆమెకు మధుమేహ సమస్య ఉంది. అయితే ఇటీవల ప్రమీలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లోని ల్యాబ్‌లో పనిచేస్తున్న సంపత్ అనే వ్యక్తి వారాని ఒకసారి వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ చేసి వెళ్లిపోయేవాడు. 

Also Read: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇదే క్రమంలో ఈ నెల అంటే ఏప్రిల్ 10న గాయాలతో ఉన్న ప్రమీలకు డ్రెస్సింగ్ చేయడానికి వచ్చాడు. ఇందులో భాగంగానే ఆమెకు పెయిన్స్ తగ్గేందుకు ఒక ఇంజక్షన్ ఇచ్చాడు. వెంటనే ఆమె మత్తులోకి వెళ్లిపోయింది. దీంతో సంపత్ ఆమె చేతికి ఉన్న ఆరు సవర్ల గాజులను తీసుకుని పారిపోయాడు. అనంతరం మెలుకువలోకి వచ్చిన ప్రమీల తన చేతులను చూసుకోగా.. బంగారు గాజులు కనిపించలేదు. దీంతో తన ఇంటికి వచ్చిన సంపతే దొంగిలించి ఉంటాడని.. అతడిని నిలదీసింది. అతడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో బాధితురాలు ప్రమీల ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

crime news | chori | gold-theft | tirupathi | latest-telugu-news | tirupati crime

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు