/rtv/media/media_files/2025/04/14/swWSGxd49Q5FuTVJCNDr.jpg)
Lab technician Theft gold bangles for women undergoing treatment in Tirupati
శత్రువులు ఎక్కడో ఉండర్రా.. మన పక్కనే.. మనతోనే ఉంటారు అనే ఈ డైలాగే అందరూ వినే ఉంటారు. కొన్నిసార్లు అదే నిజమనిపిస్తుంది. మనం నమ్మిన వారే మనల్ని నట్టెట ముంచేసే పరిస్థితులు కొందరికి ఎదురవుతాయి. కొన్ని సినిమాల్లోనూ అలాంటి సన్నివేశాల్ని చూపిస్తారు. అలాంటివి రియల్ లైఫ్లోనూ జరుగుతాయి.
తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. తెలిసిన వ్యక్తే కదా అని వారానికోసారి ఇంట్లోకి రానిస్తే.. అతడు చేసిన పనికి అంతా షాకయ్యారు. ఏకంగా మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణానికి ఒడిగట్టాడు. అతడు చేసిన దారుణం బయటకు రావడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?.. మహిళ ఇంటికి ఎందుకు వచ్చాడు?.. వారానికి రావలసిన అవసరం ఏమొచ్చింది?.. వచ్చి అతడు చేసిన దారుణం ఏంటి?.. అనే విషయానికొస్తే..
Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..
మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణం
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా కోటలోని స్థానిక NCR నగర్లో ప్రమీల అనే మహిళ నివాసముంటుంది. ఆమెకు ఒక కుమారుడు. ఇద్దరూ అదే ఇంట్లో ఉంటున్నారు. ఆమెకు మధుమేహ సమస్య ఉంది. అయితే ఇటీవల ప్రమీలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లోని ల్యాబ్లో పనిచేస్తున్న సంపత్ అనే వ్యక్తి వారాని ఒకసారి వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ చేసి వెళ్లిపోయేవాడు.
Also Read: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!
ఇదే క్రమంలో ఈ నెల అంటే ఏప్రిల్ 10న గాయాలతో ఉన్న ప్రమీలకు డ్రెస్సింగ్ చేయడానికి వచ్చాడు. ఇందులో భాగంగానే ఆమెకు పెయిన్స్ తగ్గేందుకు ఒక ఇంజక్షన్ ఇచ్చాడు. వెంటనే ఆమె మత్తులోకి వెళ్లిపోయింది. దీంతో సంపత్ ఆమె చేతికి ఉన్న ఆరు సవర్ల గాజులను తీసుకుని పారిపోయాడు. అనంతరం మెలుకువలోకి వచ్చిన ప్రమీల తన చేతులను చూసుకోగా.. బంగారు గాజులు కనిపించలేదు. దీంతో తన ఇంటికి వచ్చిన సంపతే దొంగిలించి ఉంటాడని.. అతడిని నిలదీసింది. అతడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో బాధితురాలు ప్రమీల ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!
crime news | chori | gold-theft | tirupathi | latest-telugu-news | tirupati crime