JNTUK: 'వాక్ విత్ నేషన్స్'..194 దేశాల జాతీయ పతాకాల ఆవిష్కరణ!

సుందర్‌ అసోసియేట్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బాదం సుందరరావు ఆధ్వర్యంలో జేఎన్‌టీయూకే ప్రాంగణంలో 'వాక్ విత్ నేషన్స్' పేరుతో అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచదేశాల జాతీయ పతాకాలను ఏర్పాటుచేశారు. ఇది వసుదైక కుటుంబమన్నారు.

New Update
Walk with Nations

Walk with Nations Photograph: (Walk with Nations)

Walk with Nations: పూర్వ విద్యార్థి సుందర్‌ అసోసియేట్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ బాదం సుందరరావు సహకారంతో జేఎన్‌టీయూకే ప్రాంగణంలో 'వాక్ విత్ నేషన్స్' పేరుతో అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంవద్ద భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుని ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచదేశాల జాతీయ పతాకాలను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ప్రపంచదేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని వీసీ మురళీకృష్ణ అన్నారు.

వసుదైక కుటుంబ ముఖ్య ఉద్ధేశ్యం..

ప్రపంచంలో జెనీవా, అమెరికాలోని న్యూయా ర్క్‌, దక్షిణకొరియాలోని సియోల్‌, చైనాలోని షాం గై, డొమినికన్‌ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగోలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఆరోది కాకినాడ జేఎన్టీయూకేలో ఏర్పాటు చేశామని వీసీ చెప్పారు. వసుదైక కుటుంబం అనేది దీని ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. అన్ని దేశాల జాతీయ పతాకాలు ఒకే చోట ఉండడం ద్వారా కలిగే అనుభూతి చెప్పలేనిదని కొనియాడారు. భూమిలోని సకల జీవరాశులు ఒక కుటుంబంగా భావిస్తారని, అందుకే ఇక్కడ ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy: ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే!

194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు..

ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు అక్షర క్రమంలో ఉంటాయని, ప్రతి జెండా స్తంభానికి క్యూ ఆర్‌ కోడ్‌తో కూడిన డిస్‌ప్లేను ఉంచారు. దీని ద్వారా ఆ దేశ జనాభా, రాజధాని, కరెన్సీ తదితర పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వర్సిటీ అనుబంధ కళాశాలలతోపాటు జిల్లాలోని ప్రతిపాఠశాల, సంస్థ జేఎన్టీయూకేను సందర్శించి ఫొటోలు తీసుకోవడాన్ని గర్వంగా భావించడంతో పాటు విజ్ఞాన, పర్యాటక ప్రదేశంగా మారబోతుందన్నారు. వాక్‌ విత్‌ నేషన్స్‌ అనే ప్రపంచ పౌరసత్వం స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రాజెక్ట్‌ అని, ఈ ఐకానిక్‌ ప్రదర్శన మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert:  ఉరుములు..మెరుపులు...ఏడు రోజులు భారీ వర్షాలు.. ఎక్కడంటే?

వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది.

New Update
  Rain Alert For Telangana

Rain Alert

Rain Alert : వాతావరణం రోజురోజుకు అనేక మార్పులు సంతరించుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే , మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశంలోని పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అశకాశాలున్నాయని తెలిపింది. రాబోయే ఏడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కు మార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!
 
ముఖ్యంగా అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాంలోని గౌహతిలో  భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రెండు మూడు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా.. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read:TG Crime: కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని కొడుకునే లేపేసిన పిన్ని!
 
అయితే.. వాయువ్య బీహార్ మీదుగా తుఫాను ఏర్పడిందని.. ఇది మన్నార్ గల్ఫ్ వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో రాబోయే 7 రోజులు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ నెల22 నుంచి27 మధ్య అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలలో కూడా భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?
 
ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

 

 

Advertisment
Advertisment
Advertisment