Inter Student Suicide: క్లాస్‌ రూం నుంచి బయటికొచ్చి, మూడవ అంతస్తు నుంచి దూకి ఇంటర్ విద్యార్థి సూసైడ్

అనంతపురం జిల్లాలో ఓ ఇంటర్‌ విద్యార్థి క్లాస్‌ రూం నుంచి బయటికి వచ్చి మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Inter student walks out of class, jumps to death from 3rd floor

Inter student walks out of class, jumps to death from 3rd floor

Inter Student Suicide: ఈ మధ్యకాలంలో జీవితాన్ని ఇంకా చూడని యువతీ, యువకులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పరీక్షల్లో ఫెయిలయ్యామని, చదువుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని, ఉద్యోగం రాలేదనే కారణంతో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  అయితే తాజాగా అనంతపురం జిల్లాలో ఓ ఇంటర్‌ విద్యార్థి క్లాస్‌ రూం నుంచి బయటికి వచ్చి మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది.  

Also Read: భార్యను గోడకేసి కొట్టి.. మటన్ కత్తితో ముక్కలుగా నరికి.. కుక్కర్ క్రైమ్ స్టోరీలో విస్తుపోయే నిజాలు

చెప్పులు విడిచి.. గోడపై నుంచి దూకి 

ఇక వివరాల్లోకి వెళ్తే.. అనంతరపురంలోని నారాయణ కాలేజ్‌లో చరణ్ (16) అనే యువకుడు ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గురువారం ఎప్పట్లాగే కాలేజీలో క్లాసులు జరుగతున్నాయి. ఈ క్రమంలోనే క్లాస్ మధ్యలోనుంచి సడెన్‌గా లేచి నడుచుకుంటూ వెళ్లాడు. గది ప్రవేశం చెప్పులు విడిచిపెట్టాడు. ఆ తర్వాత నేరుగా ముందుగా ఉన్న మూడవ అంతస్తు గోడపై నుంచి కిందకి దూకేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన చరణ్‌ను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే చరణ్ ప్రాణాలు విడిచాడు. అతడు మూడవ అంతస్తు నుంచి దూకిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Also Read :  Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

Also Read: జమ్మూకశ్మీర్‌లో మిస్టరీ మరణాలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి

అయితే చరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. కుమారుడి మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా కాలేజ్ ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. నారాయణ కాలేజ్‌ను మూసివేయాలని, కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కళాశాలకు చేరుకున్నారు. అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభినట్లు పేర్కొన్నారు. 

Also Read: Maharashtra Train Accident: 12 మంది ప్రాణాలు తీసిన పుకారు.. రైలు ప్రమాదానికి ఇదే కారణం

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment