Google: ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందాలు

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యా్ప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్స్ గవర్సెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కమార్ అమరావతి ఏసీ సచివాలయంలో మొమోరెండ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

New Update
AP

ఏఐ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యా్ప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్స్ గవర్సెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కమార్ అమరావతి ఏసీ సచివాలయంలో మొమోరెండ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ లివింగ్ మా ప్రభుత్వ లక్షమని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

ఇది కూడా చదవండి : AP: ఏపీలో వారందరికి ఉచితంగా స్కూటీలు..!

యువతకు ఏఐ ఆధారిత భవిష్యత్ కల్పించేందుకు గూగుల్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. గూగుల్ చేసుకున్న ఒప్పందాలతో టెక్నాలజీ రంగంలో ఏపీ దూసుకుపోతుందని లోకేశ్ చెప్పారు. యువతకు అంతర్జాతీయ స్థాయి స్కిల్స్ వస్తాయని, అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మినిస్టర్ లోకేశ్ అన్నారు.

Also Read: డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు: సీఎస్

గూగుల్ కీలక ఒప్పందాలు ఇవే

విద్య, నైపుణ్యాభివృద్ధి: విద్యార్థులు, డెవలపర్లకు ఏఐ ఆధారిత నైపుణ్యాల కోసం 10 వేల మందికి గూగుల్ ఎసెన్షియల్ పేరుతో నైపుణ్య శిక్షణ కోర్సు అందిస్తుంది. రోజువారీ జీవితంలో AIని ఎలా ఉపయోగించాలి, ఏఐ ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఈ కోర్సులో అంతర్భాగంగా ఉంటాయి. సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ జనరేటివ్ AI వంటి రంగాల్లో Google క్లౌడ్ సర్టిఫికేషన్‌లు, స్కిల్ బ్యాడ్జ్‌లను గూగుల్ అందజేస్తుంది.

స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎనేబుల్ మెంట్: ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడం, మెంటర్‌షిప్, నెట్‌వర్కింగ్ అవకాశాలను అందించడం, స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ల కోసం Googleకి యాక్సెస్‌ని అందిస్తుంది. ఇందుకోసం Google సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌తో కలిసి పనిచేస్తుంది. దీంతోపాటు అర్హత కలిగిన AI స్టార్టప్‌లు క్లౌడ్ క్రెడిట్‌లు, సాంకేతిక శిక్షణ వ్యాపార మద్దతును పొందుతాయి.

సుస్థిరత: గాలి నాణ్యత, పట్టణ ప్రణాళిక, విపత్తు నిర్వహణకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో గూగుల్ ఏఐ ఆధారిత సహకారం, సేవలను అందిస్తుంది.

హెల్త్‌కేర్: నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపర్చడం, రోగి ఆరోగ్య ఫలితాలను వేగవంతం చేయడంలో ఏఐ సేవల వినియోగానికి సహకారం అందించడం, హెల్త్ AI ఇమేజింగ్ మోడల్‌లకు యాక్సెస్ అందించడం, LLMలు ద్వారా హెల్త్‌కేర్‌ ఉత్పాదకరంలో AI అప్లికేషన్‌లను అన్వేషించడం, హెల్త్ AI డెవలపర్ ఫౌండేషన్స్ (HAI-DEF) ద్వారా పరిశోధన కార్యక్రమాలకు గూగుల్ మద్దతు ఇస్తుంది.

AI పైలట్‌లు: వ్యవసాయం, ట్రాఫిక్ నిర్వహణ, వెబ్‌సైట్ ఆధునీకరణ, పౌరుల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలలో క్లౌడ్ టెక్నాలజీ, AI ప్రయోజనాలపై కీలక రంగాలలో పైలట్ ప్రాజెక్ట్‌లకు Google సహకరిస్తుంది.

Also Read: మీది ప్రజాపాలన కాదు.. రాక్షసపాలన.. కౌశిక్‌రెడ్డి ఇష్యుపై హరీష్‌రావు ఆగ్రహం

Also Read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్‌ కంపెనీ..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!

ప్రతి రామాలయంలో సీతారామలక్ష్మణులతో పాటుగా ఆంజనేయడు కూడా కొలువై ఉంటాడు. రాములోరి సేవలో తరిస్తూ భక్తుల పూజలు అందుకుంటూ ఉంటాడు. కానీ ఆంజనేయుడు లేని రామాలయం ఒకటుందని.. మీకు తెలుసా.. ఆ ఆలయం గురించి ఈ కథనంలో..

New Update
hanuman

hanuman

రామాలయం లేని ఊరు.. హనుమంతుడు లేని రాములోరి ఆలయం ఉండదనేది పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ హనుమంతుడు లేని రామాలయం కూడా ఒకటి ఉంది. అది కూడా మరెక్కడో కాదు సాక్షాత్తు  ఏపీలోనే ఉందని తెలుసా.. అదే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం. అన్ని ఆలయాల్లో సీతారామలక్ష్మణ ఆంజనేయస్వాములు కనిపిస్తే ఇక్కడ మాత్రం ఆంజనేయస్వామి ఉండరు. దాని వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉంది. 

Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

ఆంజనేయస్వామిని కలవకముందే.. ఈ ప్రాంతంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు సంచరించారని.. అందుకే ఆలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదనేది స్థానికులు చెబుతారు.ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. అందుకే ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా పిలుస్తారు. త్రేతాయుగంలో సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు దండకారణ్యంలో సంచరిస్తూ ఇక్కడకు వచ్చారని పురాణాలు చెప్తున్నాయి. 

Also Read: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఆ సమయంలో సీతాదేవికి బాగా దప్పిక వేసిందని.. సీతాదేవి దాహం తీర్చేందుకు శ్రీరాముడు భూమిలోనికి బాణం వేస్తే నీటిబుగ్గ పుట్టిందని పురాణాల్లో ఉంది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయ్యిందని చెప్తుంటారు.ఇక ఈ ఆలయం పేరుపైనా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కోదండరామస్వామి ఆలయాన్ని మిట్టమీద నిర్మించారని.. అందుకే ఒంటిమిట్ట రామాల‌యం అని పేరు వ‌చ్చింద‌ని కొంతమంది చెప్తుంటారు. అయితే ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ‌భ‌క్తులు ఈ గుడిని నిర్మించారని.. వారి పేరుమీద ఒంటిమిట్ట రామాలయం అయ్యిందనేది మరో వాదన. సీతారాముల క‌ల్యాణం త‌ర్వాత మృకండ మహర్షి, శృంగి మహర్షి యాగ రక్షణ కోసం శ్రీరామలక్ష్మణులు ఇక్కడ‌కు వ‌చ్చారని.. అందుకు ఆ మ‌హర్షులు సీతారామ ల‌క్ష్మణుల విగ్రహాల‌ను ఇక్కడ ఏర్పాటు చేయించారని మరో కథనం. ఆ విగ్రహాలకు తర్వాత కాలంలో జాంబవంతుడు ప్రాణ ప్రతిష్ట చేశాడ‌ని మరికొందరు అంటుంటారు.

ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కళ్యాణం రాత్రి వేళ ఎందుకు జరుగుతుందనే దానికి కూడా ఆసక్తికరమైన కథ ఉంది. అది కూడా శ్రీరామనవమి రోజున కాకుండా చైత్ర శుద్ధ పౌర్ణమి రాత్రి జరుగుతుంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వివాహం పగలు జరిగినప్పుడు, చంద్రుడు తన సోదరి లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోయానని విష్ణువుతో మొరపెట్టుకున్నాడట. దీంతో "నీ కోరిక రామావతారంలో తీరుతుంది" అని మహా విష్ణువు వరమిచ్చాడు. 

ఆ ప్రకారం ఒంటమిట్టలో సీతారాముల కళ్యాణం వెన్నెల వెలుగుల్లో నిర్వహిస్తారు. ఇక ఒంటిమిట్ట ఆలయ గోపురాలు చోళ శైలిలో, రంగమంటపం విజయనగర శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. 32 స్తంభాలతో కూడిన రంగమంటపం, 160 అడుగుల ఎత్తైన గోపురం దీని సౌందర్యాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.

Also Read: Iran: చరిత్రలో రికార్డ్ స్థాయికి పడిపోయిన ఇరాన్ కరెన్సీ విలువ.. డాలర్‌కు 10 లక్షల రియాల్స్‌..

Also Read: Sri Rama Navami 2025: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

 

 kadapa | vontimitta-kodandaram | temple | sri-rama-navami | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment