AP: దారుణం.. మాజీ మంత్రి కాకాణి అనుచరుడి భాగోతం.. మహిళపై లైంగిక దాడి!

ఏపీలో మహిళపై లైంగికదాడి కేసులో మాజీ మంత్రి కాకాణి అనుచరుడు వైసీపీ నేత వెంకట శేషయ్య అరెస్ట్‌ అయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ వెంకట శేషయ్య ఓ మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. పదే పదే ఇబ్బందిపెట్టడంతో ఆ మహిళ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

New Update
ysrcp leader venkata seshaiah arrested

ysrcp leader venkata seshaiah arrested

రాజకీయ అండతో కొందరు నేతలు రెచ్చిపోతున్నారు. తమ కోరికలు తీర్చాలంటూ మహిళలను వేధిస్తున్నారు. ఒప్పుకోకపోతే ఏదో వంకపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాంటిదే మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని మాజీ మంత్రి ప్రధాన అనుచరుడైన ఓ వ్యక్తి మహిళలను లొంగదీసుకున్నాడు.

Also Read: ఏపీలో ఫ్రీ బస్ పథకం.. 2,000 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరం!

ఉద్యోగం ఇప్పిస్తానని పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ మహిళ ఊరు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లినా అతడి కామకోరికలు తగ్గలేదు. ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారమంతా ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శనం గంట నుంచి 3 గంటల్లోపే

వెంకటాచంలో పనిచేస్తున్న లైన్‌మెన్‌‌కు తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళతో 13 ఏళ్ల క్రితం పెళ్లైంది. అయితే 2021లో ఆమె భర్త గుండెపోటుతో మరణించాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబభారం భార్యపై పడింది. కుటుంబ పోషణ నిమిత్తం భర్త ఉద్యోగాన్ని భర్య అడిగింది. కానీ అత్తంటివారు మాత్రం భర్త తమ్ముడికి ఇప్పించాలని ప్రయత్నించారు. ఈ గొడవ సర్ధుమనిగించేందుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైకాపా ఉపాధ్యక్షుడు మందల వెంకట శేషయ్య ఎంట్రీ ఇచ్చాడు. 

Also Read: రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం రాదు

తాను, తన బిడ్డలు రోడ్డున పడతామని ఆ మహిళ వెంకట శేషయ్యను ప్రాధేయపడింది. దీంతో భర్త ఉద్యోగం భార్యకి.. ఇతర ప్రయోజనాలు అత్తమామాలకు వచ్చేలా రాజీ చేశాడు. ఈ క్రమంలోనే వెంకట శేషయ్య ఆ మహిళతో అసభ్యంగ, అనుచితంగా ప్రవర్తించాడు. తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించాడు. లైంగికంగా తనను తృప్తి పరిస్తే ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ మహిళ అంగీకరించింది. దీంతో వెంకట శేషయ్య పలుమార్లు తనపై లైంగికదాడికి పాల్పడ్డాడు. 

Also Read: తెలంగాణలో కీచక టీచర్.. నాలుగో తరగతి బాలికలతో, ఛీ ఛీ!

ఊరు విడిచి వెళ్లినా ఆగని వేధింపులు

ఇక 2022లో ఆ మహళకు ఉద్యోగం వచ్చి సూళ్లూరుపేటకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి అక్కడే ఉంటుంది. అయినా వెంకట శేషయ్య వేధింపులు ఆగలేదు. ఏదో కారణంతో పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల అతడు చాలా సార్లు ఆమెకు ఫోన్ చేశాడు. కానీ ఆమె రెస్పాండ్ అవ్వలేదు. 

కోపం పెంచుకున్న ఆయన ఆ మహిళ డిసెంబర్ 22న వెంకటాచలం రావడంతో బెదిరించాడు. కోరిక తీర్చాలని బలవంతం చేయడంతో ఆమె వెంకటాచలం పోలీస్టేషన్‌కు పరుగులు తీసింది. అక్కడ వెంకట శేషయ్యపై కంప్లైంట్ ఇచ్చింది. జరిగిన విషయాన్ని మొత్తం ఆమె చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chiranjeevi - Mark Shankar: పవన్ కుమారుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. చిరంజీవి సంచలన ట్వీట్

మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అతడు ఇంకా కోలుకోవాలి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఉంటాడు. మార్క్ శంకర్  కోలుకోవాలని మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశాడు.

New Update
పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్ కాళ్లూ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా దట్టమైన నల్లటి పొగ ఎక్కువగా పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పవన్ ఫ్యాన్స్, మెగా అభిమానులు, జన సేన కార్యకర్తలు, జన సైనికులు పూజలు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు

చిరంజీవి ట్వీట్

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి.. మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్ అందిచారు. మా బిడ్డ క్షేమంగా ఇంటికొచ్చేశాడని.. కానీ అతడు ఇంకా కోలుకోవాలి అని తెలిపాడు. ఈ మేరకు అతడు ట్వీట్ చేశాడు. ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో  త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో.. మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. 

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

రేపు హనుమత్ జయంతి.. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి.. ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో.. ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్  కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు  తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు. 

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

(megastar chiranjeevi latest | Pawan Kalyan | pawan kalyan son mark shankar | pawan son mark shankar | latest-telugu-news | telugu-news)

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

Advertisment
Advertisment
Advertisment