నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం

నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం బయటపడింది. బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ సీఈవో వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాడని సెక్రటరీ పద్మావతి ఆరోపిస్తున్నారు.

New Update
Big fraud in Nandyal district

Big fraud in Nandyal district

Big fraud : నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం బయటపడింది. బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.  సీఈవో వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాడని సెక్రటరీ పద్మావతి ఆరోపిస్తున్నారు. కాగా ఈ బ్యాంక్‌ మహిళలకు అధిక వడ్డీల ఆశ చూపించి భారీ మొత్తం రుణాలు ఇస్తామని డిపాజిట్లు సేకరించినట్లు ఆరోపణలున్నాయి. నంద్యాల జిల్లాలో 5 బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి వేలాది మంది మహిళల నుండి సుమారు రూ. 2 కోట్ల మేరకు భారీ మొత్తం లో డిపాజిట్లు  సేకరించి నట్లు సమాచారం. సీఈవో వెంకట రమణ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించిన సెక్రటరీ పద్మావతి.

Also Read :  వారేవా పాకిస్థాన్.. న్యూజిలాండ్కు చుక్కలు చూపించింది!

సీఈవో గా ఉన్న వెంకటరమణ గత 20 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతం లోకి వెళ్లడంతో డిపాజిట్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అధిక వడ్డీల ఆశ చూపించి భారీ మొత్తం లో రుణాలు ఇస్తామని డిపాజిట్లు  సేకరించినట్లు వెంకటరమణ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లా చెందిన ఏవి వెంకట రమణ అనే వ్యక్తి జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యం లో గత 2021 అక్టోబర్ 8 న కోవెలకుంట్ల లో జననీ సహాయ సహకార పరపతి పొదుపు సంఘం పేరుతో, అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేత మహిళా బ్యాంకును ప్రారంభించాడు. కోవెలకుంట్ల లో బ్రాంచి ఏర్పాటు చేసిన అనంతరం నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, చాగలమర్రి లో మరో నాలుగు బ్రాంచి ఆఫీసులను సీఈవో వెంకట రమణ ఓపెనింగ్ చేపించాడు, 

Also Read :  బాగా ఫీల్ అయినట్టున్నాడు... పెళ్లికి పిలువలేదని కాల్చి పారేశాడు!

స్థానిక పొదుపు మహిళా బ్యాంకు లో మహిళలకు నమ్మకం కలిగించే విధంగా బ్యాంకు గ్రూపు కమిటీకి 15 మంది మహిళలను నియమించి అధిక వడ్డీల ఆశ చూపించి భారీ మొత్తం రుణాలు ఇస్తామని వేలాది మంది మహిళల నుండి దాదాపు 2 కోట్ల మేరకు భారీ మొత్తం లో డిపాజిట్లు సేకరించినట్లు సమాచారం. కోవెలకుంట్ల మహిళ పొదుపు బ్యాంకు సెక్రెటరీగా ఉన్న పద్మావతి అనే మహిళ సహకారం తోనే సీఈవో వెంకట రమణ భారీ ఎత్తున డిపాజిట్స్ సేకరించి సొమ్ము చేసుకొని అజ్ఞాతం లోనికి వెళ్లినట్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా సీఈవో వెంకటరమణ, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి,అజ్ఞాతంలోకి వెళ్లడం తో పొదుపు మహిళా బ్యాంకు గ్రూపు కమిటీ సెక్రెటరీగా ఉన్న పద్మావతి తో పాటు, సభ్యులు, సిబ్బంది లబోదిబమంటూ మొత్తుకుంటున్నారు.

Also read :  ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు!

డిపాజిటర్లకు డబ్బులు చెల్లించ కుండా పారిపోయిన సీఈవో వెంకటరమణ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కడపకు చెందిన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ, నిర్వాహకుడు వెంకట రమణ,2009 లో కోవెలకుంట్ల లో డ్వాక్రా పొదుపు గ్రూప్ సంఘాల కోఆర్డినేటర్ గా పనిచేయడం జరిగిందన్నారు, ప్రస్తుతం కోవెలకుంట్ల జననీ సహాయక సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు డిపాజిటర్ల పరిస్థితి ప్రశ్నార్ధకం గా మారింది,జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ నిర్వాకం పై పోలీసులు దృష్టి సారించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి నట్లయితే, మరిన్ని  విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Also Read :  బాలకృష్ణ షోతో నా జీవితం నాశనం.. రూ.80 లక్షలు పోగొట్టుకున్నా.. నెల్లూరు బాధితుడి సంచలన ఇంటర్వ్యూ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపైకి దూసుకెళ్లిన బొలెరో!

ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.

New Update
ACCIDENT

AP Kakinada road accident one man died

Accident: ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు. ఈ మేరకు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొలెరో డ్రైవర్ మద్యం సేవించినట్లు అనుమానిస్తు్న్నారు. శివ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా మృతిడి పేరెంట్స్, బంధువులు శోకచంద్రంలో మునిగితేలారు. 

ప్రేమోన్మాది కత్తితో దాడి..

ఇదిలా ఉంటే.. విశాఖలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.  

ఇది కూడా చదవండి: Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!

ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

 kakinada | died | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment