AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి

సంక్రాంతికి విడుదల అవుతున్న పెద్ద సినిమాల్లో బాలకృష్ణ నటించిన డాకూ మహరాజ్ కూడా ఒకటి. ఈ మూవీ టికెట్లను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. జనవరి 12 నుంచి 25 వరకు రోజుకు ఐదు షోలకు పర్మిషన్ ఇచ్చింది. 

author-image
By Manogna alamuru
New Update
daku maharaj chinni chinni song

daku maharaj chinni chinni song

సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ డాకూ మహారాజ్ సినిమాలు విడుదల అవుతున్నాయి. మూడూ పెద్ద హీరోల సినిమాలు కావడంతో పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఈ మూవీస్ జనవరి 10 నుంచి 15 లోపునే విడుదల అవుతున్నాయి.  ఇందులో బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ జనవరి 12న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి విడుదల అవుతోంది. 

 Also Read: ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి.. ఈ నంబర్లకు కాల్ చేయండి!

టికెట్లను రేట్లు పెంపు..

డాకూ మహారాజ్ టికెట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తాజాగా అనుమతులను ఇచ్చింది. ఈ మూవీ టికెట్ల రేట్లను పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. జనవరి 12 ఉదయం 4 గంటలకు వేసే బెనిఫిట్ షో టికెట్ రేటును రూ.500గా నిర్ణయించింది. దాంతో పాటూ ఫస్ట్ డే నుంచి జనవరి 25 వరకు రోజుకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. దీంట్లో మల్టీప్లెక్స్ టికెట్‌పై రూ.135, సింగిల్ స్క్రీన్‌లపై రూ.110 వరకు పెంచుకోవచ్చని చెప్పింది.మరోవైపు తెలంగాణలో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  రీసెంట్‌గా పుష్ప–2 సినిమా వివాదం తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు లాంటివి ఉండవని ముయమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడంతో ఇక్కడ యథావిధిగా ఎప్పుడూ ఉన్న విధంగానే సినిమాలు ఆడనున్నాయి. 

Also Read: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment