AP: స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు

ఎండ తీవ్రత వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఒంటి పూట బడుల తేదీని ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయి. ఉదయం 11 తర్వాత తీవ్రమైన ఎండ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
Schools: ఆ రాష్ట్రంలో 1600 స్కూళ్ల మూసివేత‌..

Half day schools

వేసవి కాలం (Summer Season) రావడంతో స్కూల్ విద్యార్థులకు ఒంటిపూట బడుల (Hoff Day Schools) విషయంలో ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతు నమోదవుతున్నాయి. ఇంకా మార్చి నెలలో అయితే ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత బయటకు అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ వారికి ఇప్పటికే పరీక్షలు మొదలయ్యాయి. మార్చి 17వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. 

ఇది కూడా చూడండి: TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త!

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ప్రస్తుతం రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేక చాలా మంది బయటకు వెళ్లలేకపోతున్నారు.  పెద్దవారే ఈ తీవ్రమైన ఎండకి ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది స్కూల్ పిల్లలు ఇబ్బంది పడతారని ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన ఎండ బారిన పడితే నీరసం, అలసట వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండాలంటే మజ్జిగ, లస్సీ, ఓఆర్‌ఎస్ వంటివి తాగుతుండాలి. అప్పుడు మీ బాడీ డీ హైడ్రేషన్‌కు గురి కాదు.

ఇది కూడా చూడండి:  హైదరాబాద్‌కు AICC ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. ముందున్న సవాళ్లు ఇవే..! 

ఇదిలా ఉండగా ఈసారి ఏపీ బడ్జెట్‌లో ప్రభుత్వ సూళ్లకు (Government Schools) నిధులు మంజూరు చేశారు. రాష్ట్ర ప్రగతికి పరుగులు పెట్టించేలా వివిధ విధాన నిర్ణయాలు ఉన్నాయని బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 

విద్యా, మున్సిపాల్టీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందించడంతో స్థానిక సంస్థలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గనుందనే చెప్పాలి.

ఇది కూడా చూడండి: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

APSRTC: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్‌ చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ !

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట నిచ్చేలా ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఏప్రిల్‌ 1 నుంచే ఇంటర్‌ సెకండ్ ఇయర్‌ క్లాసులు ప్రారంభం అయ్యాయి.ఈ క్రమంలో .ఏప్రిల్ నెలలోనూ విద్యార్థులకు బస్‌పాస్‌లను రెన్యువల్ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

New Update
APSRTC

APSRTC

ఇంటర్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఈసారి గతానికి భిన్నంగా ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తైన తర్వాత.. సెలవులు ప్రకటించేవారు. అయితే ఈసారి మాత్రం ఏప్రిల్‌లోనే ఇంటర్‌ సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించారు.

Also Read: Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!

2025-26 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి అనుగుణంగా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. అలాగే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు.

Also Read: Horoscope: నేడు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు!

అయితే ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి చదువుకునే విద్యార్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఈ బస్‌పాస్‌లు ఎంతోగానో ఉపయోగపడతాయి. ప్రయాణించే దూరాన్ని బట్టి నెలవారీగా కొంత మొత్తం తీసుకుంటూ విద్యార్థులకు ఆర్టీసీ బస్‍‌పాస్‌లు అందిస్తూ ఉంటుంది. 

సాధారణంగా ఏటా జూన్‌ నుంచి మార్చి వరకు ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు జరిగేవి. దీనికి అనుగుణంగానే ఆర్టీసీ యాజమాన్యం బస్ పాస్‌లు జారీ చేసేది. ఈ ఏడాది తరగతులు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభించారు. అయితే ఈ విషయాన్ని ఇంటర్‌ బోర్డు అధికారులు ఆర్టీసీకి సమాచారం ఇవ్వలేదు. దీంతో విద్యార్థులకు ఆర్టీసీ సిబ్బంది బస్‌పాస్‌లు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ప్రయాణ ఖర్చులు భరిస్తూనే తరగతులకు హాజరవ్వాల్సి వచ్చింది.

అయితే ఈ విషయమై మీడియాలో వార్తలు రావటంతో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు స్పందించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏప్రిల్ నెల కూడా రాయితీ బస్‌పాస్‌లు రెన్యువల్‌ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని జిల్లాలు, డిపోల అధికారులకు ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో విద్యార్థులకు భారం తప్పనుంది.

Also Read: USA: అమెరికాకు ఎగుమతులను ఆపేస్తున్న బడా కంపెనీల కార్లు..జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రేక్

Also Read: Rain Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు హెచ్చరికలు!

apsrtc | apsrtc-buses | Ap Inter classes | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment