Big Breaking: ఆలేరు ఎమ్మెల్యే సునీతకు హైకోర్టు షాక్

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డికి హైకోర్టు 10వేల రూపాయల జరిమానా విధించింది. 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో ఎమ్మెల్యే సునీత ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించ లేదంటూ ఆమెపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

New Update
Big Breaking: ఆలేరు ఎమ్మెల్యే సునీతకు హైకోర్టు షాక్

ఆలేరు ఎమ్మెల్యే గోంగిడి సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ తగిలింది. సునీత మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ. 10వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫీడవిట్ లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు అయింది.

కాగా, ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. అయితే, ఎమ్మెల్యే సునీత ఇప్పటివరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చెయ్యలేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ఆమెకు జరిమానా విధించింది. అక్టోబర్ 3లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోపు కౌంటర్ దాఖలు చెయ్యకపోతే ఆ తర్వాత అవకాశం ఉండదని స్పష్టం చేసింది. గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇంతకు ముందు ఇలాగే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల సమయంలో వనమా వెంకటేశ్వర రావు తన ఆస్తి వివరాలన్నింటిని ఎన్నికల అఫిడవిట్ లో జత పరచలేదని ప్రత్యర్థి అభ్యర్థి జలగం వెంకట్రావు 2019 నుంచి న్యాయపోరాటం చేస్తే వనమా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల్లో జలగం వెంకట్రావుదే విజయం గా పేర్కొని, ఆయనను ఎమ్మెల్యేగా తెలిపింది. అయితే.. వనమా ఈ కేసు విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభించింది. కోర్టు స్టే ఇవ్వడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.

ఇవికూడా చదవండి:జగన్ సర్కార్ కు కాగ్ చురకలు.. నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కూడా..

చంద్రబాబు బెయిల్, కస్టడి పిటిషన్లపై విచారణ వాయిదా.. మరికొన్ని రోజులు జైలులోనే?

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేష్.. అరెస్ట్ తప్పదా?

కోమటిరెడ్డికి షాక్ ఇచ్చిన ఉత్తమ్, రేవంత్.. నల్లగొండ కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది?   

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K Terror Attack: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిలో బలైన వారికి సంతాపం తెలిపారు.ఉగ్ర ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు.

New Update
trump pehalgam

trump pehalgam

జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ప్రధాని మోడీ కి ట్రంప్‌ ఫోన్‌ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి  జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో తెలియజేశారు. '' ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు.

Also Read:Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)

ఉగ్రదాడిలో బలైన వారికి ట్రంప్‌  సంతాపం తెలియజేశారు. ఉగ్ర దాడి ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని జైస్వాల్‌ పేర్కొన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్‌ అన్నారు. ఉగ్రవాద పోరులో అమెరికా, భారత్‌ ఒకరికొకరు కలిసి పోరాడతాయని ఎక్స్‌ లో రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

Also Read: J&K Terror Attack: 'పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు'

ట్రంప్ ఫోన్ చేసి మద్ధతుగా మాట్లాడడంతో ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్‌ కృత నిశ్చయంతో ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. అంతకు ముందే ఇదే విషయమై ట్రంప్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్‌ ఉగ్ర ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు,.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మోడీకి, భారతప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.మరో వైపు రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని మోడీ తన పర్యటనను కుదించుకున్నారు.

జెడ్డా నుంచి మంగళవారం రాత్రి భారత్‌కు ఆయన తిరుగుపయనమయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలోని మినీ స్విట్జర్లాండ్‌ గా పేర్కొందిన పెహల్గాం సమీప బైసరన్‌ లోయలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. పర్యటకులను చుట్టుముట్టి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది చనిపోగా,వారిలో ఇద్దరు విదేశీయులను ఉన్నట్లు అధికారులు గుర్తించారు.మృతుల్లో హైదరాబాద్‌ కు చెందిన నిఘా విభాగం అధికారి మనీశ్‌ రంజన్‌ సైతం ఉన్నారు. 

Also Read: BIG BREAKING : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

Also Read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

J&K Terror Attack | Pahalgam attack | trump | modi | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు