Telangana : యువకుడి ప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్

సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వినీత్ అనే బీటేక్ విద్యార్థి ఐపీఎల్‌ బెట్టింగ్ కోసం ఆన్‌లైన్ యాప్స్‌లో రూ.25 లక్షలు లోన్ తీసుకున్నాడు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Betting Killed : ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌ యాప్స్‌(Online Apps) లో బెట్టింగ్ పెట్టడం రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఐపీఎల్‌(IPL) సీజన్ ఉన్న నేపథ్యంలో ఈ బెట్టింగ్‌లు తారాస్థాయికి చేరాయి. చాలామంది బెట్టింగ్‌ల వల్ల లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరైతే బెట్టింగ్‌ల వల్ల అప్పులు ఎక్కువై ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే తాజాగ క్రికెట్‌ బెట్టింగ్(Cricket Betting) ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వినీత్ అనే విద్యార్థి బీటెక్ చదువుతున్నాడు.

Also read: మరో నల్లజాతీయుడిపై పోలీసుల కర్కశత్వం.. ఊపిరాడక బాధితుడు మృతి

ఐపీఎల్‌లో బెట్టింగ్ పెట్టేందుకు ఆన్‌లైన్ యాప్స్‌లో రూ.25 లక్షల వరకు లోన్లు(25 Lakhs Loan) తీసుకున్నాడు. బెట్టింగ్ తీవ్రంగా నష్టపోవడంతో వినీత్ మనస్తాపం చెందాడు. అతని తల్లిదండ్రులు అయోధ్య టూర్‌కి వెళ్లడంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌ నోట్ కూడా రాశాడు. విషయం తెలుసుకున్న వినీత్ తల్లిందండ్రులు హుటాహుటీనా సంగారెడ్డికి బయలుదేరారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కాంగ్రెస్ మండలాధ్యక్షుడి దారుణ హత్య.. సముద్రంలో డెడ్ బాడీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ కొట్టేయాలనుకున్న దొంగని కి.మీ ఈడ్చుకెళ్లారు. ఇది బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర జరగ్గా.. సోషల్ మీడియాలో వీడియో వైరలవుతోంది. కిటికీలోంచి ఫోన్ లాక్కొని పారిపోదామని చూసిన దొంగ చేయి ప్యాసింజర్ గట్టిగా పట్టుకున్నాడు.

New Update
running train theft

కదులుతున్న రైల్లో దొంగతనం చేసి సీజీగా తప్పించుకోవచ్చని చాలామంది కేటుగాళ్లు భావిస్తున్నారు. దీంతో స్టేషన్ నుంచి ట్రైన్ మూవ్ కాగానే.. ప్యాసింజర్ల ఫోన్లు, బంగారు ఆభరణాలు లాక్కొని ఉడాయిస్తు్న్నారు. ఇటీవల ఇలాంటి దొంగతనం కేసులు చాలా జరుగుతున్నాయి. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకే ప్రయత్నం ప్యాసింజర్ చేయడనే ధైర్యంతో చైన్ స్నాచర్లు, 420లు ఇలా చేస్తున్నారు. కదులుతున్న ట్రైన్‌లో ప్రయాణికుడి ఫోన్ కొట్టేయాలని ట్రై చేసిన ఓ దొంగ దొరికిపోయాడు. కిటికీలోంచి దొంగని గట్టిగా అలానే పట్టుకొని కిలోమీటర్ వరకు అలానే లాక్కెల్లారు. ఈ ఘటన బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

Also read: Rafale Marine jets: ఫ్రాన్స్ నుంచి భారత్‌ మరో 26 రఫెల్ ఫెటర్ జెట్లు!

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ వాడుతున్నాడు. దానిపై కన్నేసిన దొంగ కిటికీలోచ్చి ఫోన్ లాక్కొని పారిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు. ప్రయాణికుడు అప్రమత్తంగా ఉండటంతో దొంగ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. తన ఫోన్‌తోపాటు దొంగ చేయి కూడా వదలకుండా గట్టిగా ఉడం పట్టు పట్టినట్లు పట్టుకున్నాడు. గజేంద్రమోక్షంలో ఏనుగు కాలు నోట కరుచుకున్న మొసలిలా ప్రయాణికుడు దొంగ చేయి పట్టుకొని కిలో మీటర్ వరకు రన్నింగ్ ట్రైన్‌లో ఈడ్చుకెళ్లాడు. తలపై రెండుమూడు దెబ్బలు కూడా తగిలించారు తోటి ప్రయాణీకులు. దీంతో దొంగ చేయి కిటికీలోపల, తల, కాళ్లు, బాడీ ట్రైన్ బయట ఉంది. గిలిగిలా కొట్టుకుంటూ దొంగ కదులుతున్న ట్రైన్‌లో కిలో మీటర్ దూరం వెళ్లాడు. దీన్ని అదే బోగీలో కూర్చున్న ఇతర ప్రయాణికులు వీడియో తీశారు. ఆ విడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment