కొత్త రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఈ అర్హతలు ఉంటేనే?

తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 నుంచి రేషన్ కార్డులు జారీ చేయనుంది. గతంలో రూరల్‌లో రూ.1.50 లక్షలు, అర్బన్ ఏరియాలో రూ.2 లక్షల ఆదాయం కంటే తక్కువగా ఉన్నవారికే ఇచ్చేవారు. మరి ఈ ఆదాయాన్ని పెంచుతారో? లేదో? చూడాలి.

New Update
TS New Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుకు ఎదురుచూస్తున్న వారికి షాక్.. అప్లికేషన్లు మరింత ఆలస్యం.. కారణమిదే!

Ration cards

తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కొత్త పేర్లు చేర్చుకోవడం, పేర్లు మార్పులు వంటి వాటికి కూడా ప్రభుత్వం అనుమిస్తోంది. అయితే కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునేవారు తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి.

ఇది కూడా చూడండి: TS:  గ్రామ సభల్లో రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణ

ఆధార్ కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్..

పెళ్లయిన వారు కొత్త కార్డులకు అప్లై చేసుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్‌తో పాటు ఆధార్ కార్డు కూడా ఉండాలి. కొత్తగా ఎవరైనా పేర్లు చేర్చుకోవాలంటే వారి ఆధార్ కార్డు లేదా బర్త్ సర్టిఫికేట్‌ ఉండాలి. ఇవన్నీ ఒరిజినల్స్ తీసుకుని మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకోవాలి. రేషన్ కార్డుకి మీరు అర్హులు అనుకుంటేనే జారీ చేయనున్నారు. అయితే ప్రజల ఆదాయం బట్టి మాత్రమే రేషన్ కార్డులను మంజూరు చేస్తారు.

ఇది కూడా చూడండి:AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి

ఇప్పటి వరకు రూరల్‌లో రూ.1.50 లక్షలు, అర్బన్ ఏరియాలో రూ.2 లక్షల్లోపు ఆదాయం కంటే తక్కువగా, భూమి 3.5, మాగాణి 7.5 ఎకరాలు ఉంటేనే కార్డులు జారీ చేసేవారు. మరి ఈసారి ఏమైనా మార్పులు చేస్తారో లేదో చూడాలి. తెలంగాణలో మొత్తం మూడు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. ఒకటి అంత్యోదయ ఆహార భద్రత కార్డు, ఆహార భద్రత కార్డు, అంత్యోదయ అన్న యోజన కార్డులు అనేవి ఉన్నాయి. మొదటి రకంలో 6 కిలోల బియ్యం, రెండో రకం కార్డులకు 10 కిలోల బియ్యం, మూడో రకం కార్డులకు 35 కిలోల బియ్యం ఇస్తున్నారు. 

ఇది కూడా చూడండి: SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్!

ఇది కూడా చూడండి: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

తెలంగాణలో జపాన్‌ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు

ఏడురోజుల పాటు జపాన్‌లో పర్యటించిన సీఎం రేవంత్ బృందం కీలక ఒప్పందాల చేసుకుంది. మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

New Update
CM Revanth Team in Japan

CM Revanth Team in Japan


సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రైజింగ్ బృందం జపాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ బృందం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఏడు రోజుల పర్యటనలో మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులు సాధించింది. దీనిద్వారా తెలంగాణలో యువతకు 30,500 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన మారుబెని కంపెనీ ఒప్పందం చేసుకుంది. రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడి పెట్టనుంది.

Also Read: ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

మొత్తంగా రూ.5 వేల కోట్ల పెట్టుబడులకు అంచనా వేసింది. అలాగే NTT డేటా, నెయిసా సంస్థలతో కూడా తెలంగాణ సర్కార్‌ ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీలు మొత్తం రూ.10,500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి. తోషిబా  ట్రాన్స్‌మిషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ ఇండియా (TTDI)తో సైతం ఒప్పందం కుదిరింది. ఆ కంపెనీ రూ.562 కోట్లతో రుద్రారంలోని విద్యుత్ పరికరాలు, సామగ్రి తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది.   

Also Read: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఈ కంపెనీల ద్వారా దాదాపు యువతకు 30,500 ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణ సర్కార్‌ ఆధ్వర్యంలో టామ్ కామ్‌తో టెర్న్, రాజ్‌ గ్రూప్‌లు చేసుకున్న ఒప్పందాలు వల్ల రాష్ట్రానికి చెందిన 500 మందికి జపాన్‌లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ఇదిలాఉండగా.. సీఎం రేవంత్ బృందం ఏప్రిల్ 15న జపాన్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22 వరకు అక్కడ పర్యటించింది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్‌ బాబు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్ తదితరులు ఉన్నారు. 

Also read: పహల్గాం ఉగ్రదాడి..మోడీకి ట్రంప్‌ ఫోన్‌!

 telugu-news | rtv-news | cm revanth | japan 

 

Advertisment
Advertisment
Advertisment