/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime-1.jpg)
Chittor
ఈ రోజుల్లో కొందరు కొడుకులు కన్న తండ్రి మృత దేహం దగ్గర కూడా గొడవలు పడుతున్నారు. నాకు వద్దంటే వద్దని కొందరు శవాన్ని నడిరోడ్డు మీద వదిలేస్తున్నారు. రోజురోజుకీ ఈ సమాజంలో మానవత్వం చచ్చిపోతుంది. అయితే చిత్తూరులో భర్త మృతదేహం కోసం ఇద్దరు భార్యలు గొడవపడిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణవనం మండలంలోని చిత్తూరు కండ్రిగలో విశ్రాంత ట్రాన్స్కో డీఈ సుబ్రహ్మణ్యం ఉంటున్నాడు.
ఇది కూడా చూడండి: గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!
చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే..
ఇతను గత మూడేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే ఇతనికి ఇద్దరూ భార్యలు ఉన్నారు. మొదటి భార్య తిరుపతిలో ఉండగా.. రెండవ భార్య చిత్తూరులో ఉంటుంది. ఇటీవల సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమించడంతో రెండు భార్య, కుమారుడు అతన్ని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుబ్రహ్మణ్యం అక్కడే మృతి చెందాడు.
ఇది కూడా చూడండి: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!
ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య, కొడుకు అక్కడికి చేరుకుని, మృత దేహాన్ని తనకి అప్పగించాలని కోరారు. రెండో భార్య మృతదేహాన్ని తనకే అప్పగించాలని కోరింది. ఇద్దరు భార్యలు అక్కడ గొడవ పడ్డారు. కాస్త అయితే కొట్టుకునే వరకు వెళ్లేవారు. ఇంతలో పోలీసుల వచ్చిన వారికి సర్ది చెప్పారు. ఇద్దరు చర్చించుకున్న తర్వాత వస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. సొంత తల్లిదండ్రుల మృతదేహాలను డబ్బుల కోసం రోడ్డు మీద వదిలేస్తున్నారు. కానీ భర్త మృతదేహం కోసం ఇద్దరు భార్యలు ఇలా గొడవ పడటంతో కొందరు వారిని అభినందిస్తున్నారు.
ఇది కూడా చూడండి: అప్పర్ సర్క్యూట్ను తాకిన వీఆర్ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే?