MOVIES:దసరా బరిలో ఐదు సినిమాలు...హిట్ కొట్టేది ఏదో?

దసరా బరిలో ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు చిత్రాలు పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తూ ఉండగా ఒక్క బాలయ్య మూవీ మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతోంది. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో, రవితేజ ట్రైగర్ నాగేశ్వర్రావులు ఇందులో ఉన్నాయి.

New Update
MOVIES:దసరా బరిలో ఐదు సినిమాలు...హిట్ కొట్టేది ఏదో?

పండగలకు రిలీజ్ అయ్యే సినిమాల మీద మంచి క్రేజ్ ఉంటుంది. అందులోనూ దసరా, సంక్రాంతి పండగల కోసం తమ సినిమాలను ప్రత్యేకంగా రిజర్వ్ చేసుకుంటారు మూవీ మేకర్స్. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో దసరా వస్తోంది. దీంతో భారత్‌లో పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్‌లుపెట్టుకున్నాయి. ఈ ఏడాది ఈ రేసులో 5 సినిమాలు ఉన్నాయి.అందులో నాలుగు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కాగా, ఒక్కటి మాత్రం తెలుగులో విడుదల అవుతోంది. కోలీవుడ్ నుంచి ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన లియో మూవీ థియేటర్స్ లోకి అక్టోబర్ 19న వస్తోంది. అదే రోజు భగవంత్ కేసరి తెలుగులో రిలీజ్ అవుతోంది.అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. కన్నడం నుంచి సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ మూవీ అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ నుంచి టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన గణపత్ మూవీ అక్టోబర్ 20న థియేటర్స్ లోకి వస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవ్వనుంది.

ఈ సినిమాల రన్ టైం ఇప్పటికే లాక్ అయ్యింది. టైగర్ నాగేశ్వరరావు మూవీ రన్ టైం రెండు గంటల రెండు నిమిషాల నిడివితో ఉంది. దళపతి లియో మూవీ మూవీ రెండు గంటల 44 నిమిషాల నిడివి ఉండగా...బాలయ్య బాబు భగవంత్ కేసరి మూవీ రెండు గంటల 35 నిమిషాలు రన్ టైమ్ ఉందని చెబుతున్నారు. శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీ రెండు గంటల ఏడు నిమిషాలు, టైగర్ ష్రాఫ్ గణపత్ మూవీ 2 గంటల 10 నిమిషాలు నిడివి ఉందని తెలుస్తోంది.

ఈ చిత్రాలు దేనికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. లియో, ఘోస్ట్ మూవీస్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో వస్తున్నాయి. భగవంత్ కేసరి, గణపత్ సినిమాలు కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ బయోపిక్ స్టోరీగా సందడి చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాలు అన్నింటిపైనా పాజిటివ్ బజ్ ఉంది. లియో పాటలు అట్టర్ ఫ్లాప్ అయినా మూవీ మీద క్రేజ్ మాత్రం నిలిచే ఉంది. ఇంక ఘవంత్ కేసరి మీద అయితే ఫుల్ గా బజ్ ఉంది. ఇపప్పటివరకూ బాలయ్యబాబు చెయ్యని పాత్ర చెయ్యడం ఒకటి అయితే...ఒక అమ్మాయికి తండ్రిగా నటించడం కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. అలాగఏ టైగర్ నాగేశ్వర్రావు మీద కూడా తెలుగు ప్రేక్షకులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అ సినిమాతో రవితేజ్ మరోసారి మాస్ మహారాజా అనిపించుకుంటాడని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

అన్ని సినిమాల్లో కంటే ఎక్కువ నిడివి ఉన్న చిత్రం లియో. అయితే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటూ స్పీడ్ స్క్రీన్ ప్లే కారణంగా లోకేష్ కనగరాజ్ సినిమాలు చాలా వేగంగా పూర్తయిపోయినట్లు ఉంటాయి. లోకేష్ కనగరాజ్ స్టైల్ వల్లనే అతని సినిమాలు సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి కూడా.

Also Read:స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ కు ఊరట

ప్రపంచం అంతా పోరాటం చేస్తాం-హమాస్ కమాండర్ ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Samantha: రెమ్యునరేషన్‌కు లింగ భేదం ఏంటీ..? ఆసక్తికర విషయాలు వెల్లడించిన సమంతా

సమంత ఇటీవల నటీనటుల పారితోషికాల్లో లింగ భేదంపై స్పందించింది. "హీరోతో సమానంగా పని చేసినా, రెమ్యునరేషన్‌లో తేడా ఎందుకు ఉంటుంది..? సమస్య ఎక్కడ ఉందో అక్కడే పరిష్కారం వెతకాలి" అని వ్యాఖ్యానించింది.

New Update
Samantha Latest Comments

Samantha Latest Comments

Samantha: టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్‌ హీరోయిన్ సమంత ఇటీవల సినిమాలలో పెద్దగా మెరవకపోయినా, విభిన్నమైన పాత్రలుచేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. చివరిసారిగా 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సమంత, ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' అనే చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ 'రక్త బ్రహ్మాండ్' లోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. మరోవైపు 'శుభం' అనే సినిమాను సమంత నిర్మాణ బాధ్యతలతో తెరకెక్కిస్తోంది.

Also Read: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సమంత, సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్‌ల మధ్య పారితోషికంలో ఉండే అసమానతపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సమంతా మాట్లాడుతూ...

"చాలా సినిమాల్లో హీరోతో సమానంగా పని చేసినా, రెమ్యునరేషన్‌ మాత్రం సమానంగా ఉండేది కాదు. కొన్ని పెద్ద సినిమాల్లో కథ ఎక్కువగా హీరో చుట్టూ తిరుగుతుంది. అటువంటి సినిమాల్లో తేడా ఉంటే నేను అర్థం చేసుకోగలను. కానీ కొన్ని సినిమాల్లో కథనాయకుడు, కథానాయిక ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉండటంతోపాటు స్క్రీన్‌పై సమానంగా కనిపించినా పారితోషికంలో మాత్రం తేడా ఉంటుంది. ఇది ఇప్పటికీ అన్యాయం." అంటూ స్పందించింది.

Also Read: ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ 'వార్-2'

ఇండస్ట్రీలో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సమంత, ఇప్పటికైనా ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. 

"ఇప్పటికిప్పుడు అన్నీ మార్చలేకపోయినా, ఏదో ఒక మార్గం వెతకాలి. నేను చేయకపోతే మరెవరు చేస్తారు? సమస్య ఎక్కడైతే ఉంది, పరిష్కారాన్ని కూడా అక్కడే వెతకాలి అనే నమ్మకం నాకు ఉంది" అని సమంత వ్యాఖ్యానించారు.

Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

Also Read: "క్రిష్ 4" లో ప్రియాంక చోప్రా ఫిక్స్..

Advertisment
Advertisment
Advertisment