YS Sharmila: ఈ మహా యజ్ఙంలో కృషి చేసిన వారందరికీ కృతజ్ఙతలు

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుఫున వైఎస్‌ షర్మిల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఏపీ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు,ఈ మహాయజ్ఞంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటరు మహాశయులకు, పోలీసువారికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఙతలు తెలిపారు.

New Update
YS Sharmila: ఈ మహా యజ్ఙంలో కృషి చేసిన వారందరికీ కృతజ్ఙతలు

Ap Politics: ఏపీలో సోమవారం సాయంత్రంతో ఎన్నికల హడావిడి ప్రశాంతంగా ముగిసింది. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుఫున వైఎస్‌ షర్మిల బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఏపీ ప్రజలనుద్దేశించి ఓ ట్వీట్‌ చేశారు. ''గడిచిన కొన్ని వారాలుగా, పగలనకా, రేయనకా, కష్టాల కోర్చి, బాధలను మింగి, సవాళ్లకు ఎదురు నిలిచి, నన్ను నమ్మి, రాజశేఖర బిడ్డగా, మీ గొంతుగా నన్ను ఆదరించి, నా ఈ పోరాటంలో నాతో కలిసి నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు,ఈ ఎన్నికల మహాయజ్ఞంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటరు మహాశయులకు, శాంతిభద్రతలు సజావుగా సాగేలా చూసిన పోలీసువారికీ , నా అనుచరులూ, అభిమానులూ, ఆప్తులు, స్నేహితులు, నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, శ్రీ రాహుల్ గాంధీ గారికి, అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు,నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను'' అంటూ ఆమె ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

Also read: మళ్లీ గెలిచేది మనమే.. జగన్ సంచలన ట్వీట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు