Breaking: నెల్లూరు వైసీపీ అభ్యర్ధిగా అలీ?

నెల్లూరు సీటు విషయం లో జాగర్త గా అడుగులు వేస్తోంది వైసీపీ అధిష్టానం. నెల్లూరు సిటీ అభ్యర్ధి ఖలీల్ స్థానం లో నటుడు అలీ పేరు ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అలీకి దాదాపుగా అందరు జిల్లా నేతలూ అంగీకారం తెలిపారని తెలుస్తోంది.

New Update
Breaking: నెల్లూరు వైసీపీ అభ్యర్ధిగా అలీ?

YCP Nellore MP Ticket To Actor Ali: నెల్లూరు టికెట్‌ను వైసీపీ అధిష్టానం నటుడు అలీకి ఇవ్వనుందా అంటూ అవుననే సమాధానం వినిపిస్తోంది.ఇక్కడి సిటీ అభ్యర్ధి ఖలీల్ స్థానంలో అలీకి టికెట్ ఇవ్వాలని అనుకుంటోంది. అలీ పేరును కొందరు జిల్లా నేతల వద్ద అధిష్టానం ఉంచిందని...జిల్లా నేతలు కూడా దాదాపుగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. వైసీపీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) ఫైనల్ నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని చెబుతున్నారు.

జగన్ పిలుపు కోసం వెయిటింగ్..
అలీ టికెట్ ఇషయం రెండు రోజుల నుంచీ వార్తల్లో వస్తోంది. దీని మీద ఆయన స్పందించారు కూడా.  అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం నాకు కూడా క్లారిటీ లేదని అలీ చెప్పారు. ఇంకా సీఎంవో నుంచి కాల్‌ రావాల్సిఉంది. సీఎం పిలిచి ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడినుంచి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ వారంలో పిలుపు వస్తుందని అనిపిస్తోంది. ఏ పార్టీలో ఉన్నాసరే పోటీలో నిలబడిన వ్యక్తి మంచివాడైతే ప్రజలు తప్పకుండా గెలిపిస్తారు. అక్కడినుంచి ఇక్కడికి.. ఇక్కడినుంచి అక్కడికి పార్టీలు మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరు ఏమిటనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరితో ఎవరు పొత్తులు పెట్టుకున్నా.. అంతిమ నిర్ణయం ఓటరుదే. ఎన్నికలకు మేమూ రెడీ అంటున్నాం. వాళ్లంతా కూడా సిద్దమే అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అంటూ అలీ స్పందించారు.

Also Read:Andhra Pradesh: ఏపీలో టెన్షన్ టెన్షన్..ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori Arrest: అఘోరీకి బిగ్ షాక్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు- 14 రోజులు అక్కడే

అఘోరీకి చేవెళ్ల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. అదే సమయంలో అఘోరీ నుంచి వర్షిణీని వేరు చేసి భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

New Update

లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

14 రోజుల రిమాండ్

విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి భరోసా సెంటర్ అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇదే విషయంపై అఘోరీ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ‘‘కోర్టులో ఇప్పుడు వాదోపవాదనలు ఏం జరగలేదు.  కోర్టు కేవలం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. కోర్టు తరఫున అడ్వకేట్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు నన్ను అపాయింట్ చేసింది. బెయిల్ గురించి ఇప్పుడే చెప్పలేం. కేసుకు సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. ’’ అని చెప్పుకొచ్చారు. 

కేసు ఏంటంటే?

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది అఘోరీ .

క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

aghori Arrest | lady aghori arrest | Lady Aghori Sri Varshini | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు