మేకోవర్ అద్భుత సృష్టీ.. పింక్ బార్బీ లుక్‌లో మోదీ, సోనియా, రాహుల్

గ్లోబల్‌వైడ్‌గా ప్రస్తుతం మనకు వినిపిస్తున్న పేరు ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌(AI). ఈ టెక్నాలజీ అద్భుతమైన పనులు చేస్తూ ఎంతగానో పాపులర్ అయ్యింది. ఈ టెక్నాలజీని ఉపయోగించి అన్నిరకాల ఫోటోలను మారుస్తూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు. దీంతో పెట్టిన కొన్నిగంటల్లోనే ఈ ఫోటోలు ట్రెండింగ్‌ అవుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే తమకిష్టమైన నాయకులు, హీరోలు, హీరోయిన్లు ఇలా రకరకాల ఫోటోలను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ ఉపయోగించి మార్చుతున్నారు. తాజాగా ఇదే కోవలోకి రాజకీయ నేతలు వచ్చి చేరారు.ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

New Update
మేకోవర్ అద్భుత సృష్టీ.. పింక్ బార్బీ లుక్‌లో మోదీ, సోనియా, రాహుల్

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెక్షన్‌ బార్బీ సినిమాతో ముచ్చటించింది. బార్బీ ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి అందరిని అట్రాక్ట్ చేస్తోంది.ఈ నేపథ్యంలో ఏఐని పొలిటికల్ యాంగిల్‌కు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఒక AI కళాకారుడికి తట్టింది. తన టాలెంట్‌తో ఏఐ శైలిని ఉపయోగించి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాడు. ఇలా భారత రాజకీయ నాయకులను టెలిపోర్ట్ చేయడానికి హూ వోర్ వాట్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఫోటోలను పంచుకున్నాడు. ఇందులో మన దేశ రాజకీయ నాయకులకు ఏఐతో బార్బీ మేకోవర్ చేశాడు."వీరిలో మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? ఇక్కడ బార్బీ, అక్కడ బార్బీ! ప్రతిచోటా బార్బీ" అని క్యాప్షన్ ఇచ్చాడు.

బార్బీ లుక్‌లో భారత రాజకీయ నేతలు

భారత ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, భారత హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లకు సినిమాటిక్ లుక్ ఇచ్చాడు.బార్బీ మేకప్,సరికొత్త హెయిర్ స్టైల్ తో గులాబీ రంగు దుస్తులతో తీర్చిదిద్దారు.ఇంకేముంది ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.నాయకుల ట్రెండీ లుక్ ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్‌

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రెండింగ్‌లో ఏది నడుస్తుంటే వాటిని ఫాలో అవుతుంటారు సహజమే. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రం బార్బీ రికార్డ్‌ కలెక్షన్లను కొల్లగొడుతోంది. దీంతో అంతటా బార్బీ ఫీవర్ నడుస్తోంది. ప్రజలు, వ్యాపారాలు, బ్రాండ్‌లు ఇలా ప్రతి ఒక్కటీ గులాబీ రంగులో దూసుకుపోతోంది.ఏఐని ఉపయోగించి భారత్‌లోని 10 మంది రాజకీయ నాయకుల ఫోటోలకు మెరుగులు దిద్దాడు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు వావ్‌, సూపర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistani Colony: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారు. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు.

author-image
By Seetha Ram
New Update
Pahalgam Terror Attack (4)

Pahalgam Terror Attack

పాకిస్తాన్.. ఈ పేరు వింటే చాలా మంది భారతీయులు కట్టలు తెంచుకుంటారు. అయితే మరి అలాంటి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ కాలనీ ఉందని మీకు తెలుసా?. అవును మీరు విన్నది నిజమే. ఏపీలోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఎంతో మంది జీవిస్తున్నారు కూడా. అది విజయవాడ సిటీ కార్పొరేషన్‌ పరిధిలోని 62వ డివిజన్‌లో ఉంది. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

అక్కడ ఉండే ప్రజల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్స్ సహా అన్నింటిలోనూ వారి అడ్రస్ పాకిస్తాన్ కాలనీ, బెజవాడగా ఉంటుంది. అయితే మరి ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది?.. అక్కడ పాకిస్తానీలు జీవిస్తున్నారా?, ఒకవేళ వారు జీవించకపోతే అక్కడునున్న వారు ఈ పేరు వల్ల ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా? లేదా? అనేది పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు

అప్పట్లో 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారని.. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారని ఆ ప్రాంత కార్పొరేటర్‌గా గతంలో పనిచేసిన ఓ వ్యక్తి తెలిపారు. అంతేకాకుండా అక్కడ బర్మా కాలనీ కూడా ఉందని పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్ కాలనీలో నివశిస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. అక్కడ పాకిస్తాన్ వాళ్ల కోసం ఆ కాలనీ కట్టారని.. వాళ్లు బట్టల వ్యాపారం చేసేవారని.. అయితే అమ్మకాలు సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారని తెలిపారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

ఎక్కడ నుంచి వచ్చారంటే?

1971లో తూర్పు పాకిస్తాన్ (ఈస్ట్ బెంగాల్), పాకిస్తాన్‌ మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పట్లో భారత్.. ఈస్ట్ బెంగాల్ తరపున పోరాడింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. ఆ సమయంలోనే ఎన్నో లక్షల మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చారు. వారికి ఆశ్రయం ఇచ్చి, శిబిరాలు ఏర్పాటు చేసింది భారత్. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

అయితే ఇప్పుడు మాత్రం ఆ పాకిస్తానీ కాలనీ ప్రాంతంలో శరణార్థులు ఎవరూ లేరని స్థానిక ప్రజలు చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లు కొద్ది రోజులు మాత్రమే ఉన్నారని.. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయారని తెలిపారు. అయితే అప్పట్లో బెజవాడకు ఈ ప్రాంతం చాలా శివారులో ఉండేది. అంతేకాకుండా కరెంటు సరిగా ఉండేది కాదు, రోడ్లు ఉండేవి కావు, ఇళ్లు కూడా సరిగా లేకపోవడం ఒక కారణం. అలాగే బుడమేరుకి అప్పట్లో భారీ వరద రావడంతో ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయింది. దీంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

పాకిస్తాన్ కాలనీ వల్ల ఇబ్బందులు

ప్రస్తుతం ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు.. పాకిస్తాన్ కాలనీ పేరు వల్ల చాలా ఇబ్బందుల పడుతున్నామని చెబుతున్నారు. కొందరు పీజీలు పూర్తి చేసి విదేశాలకు వెళ్లాలనుకుంటే పాస్ పోర్ట్ ఆఫీసులో పాకిస్తాన్ కాలనీ పేరు చూసి చాలా ప్రశ్నలు అడుగుతున్నట్లు ఆ ప్రాంత యువత చెబుతుంది. అలాగే ఉద్యోగాల కోసం వెళ్లినపుడు కూడా ఇంటర్వ్యూలలో ఆ పేరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. 

పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

ఆ కాలనీ ప్రజల సమస్యను ఏపీ ప్రభుత్వం పరిష్కరించింది. ఈ మేరకు ఆ కాలనీకి మరో పేరును పెట్టింది. భగీరథ కాలనీగా కొత్త పేరును నామకరణం చేసింది. అదే సమయంలో స్థానికుల చిరునామాను (అడ్రస్) మార్చినట్లు జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రకటించారు. దీంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. 

Pahalgam attack | pahalgam terror attack | pahalgam terrorist attack | vijayawada viral-news | pakistan | india-and-pakistan

Advertisment
Advertisment
Advertisment