Nails : జుట్టు, గోర్లు కత్తిరించేప్పుడు నొప్పి ఎందుకు ఉండదు?.. అసలు కారణమేంటి?

మన గోళ్లు మృతకణాలతో నిర్మితమై ఉంటాయి. అవి కెరాటిన్ అనే పదార్ధం నుంచి తయారవుతాయి. ఇది ఒక రకమైన నాన్-లివింగ్ ప్రోటీన్. అందుకే గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి ఉండదని నిపుణులు చెబుతున్నారు. చర్మానికి చాలా దగ్గరగా గోళ్లను కత్తిరించినప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది.

New Update
Nails : జుట్టు, గోర్లు కత్తిరించేప్పుడు నొప్పి ఎందుకు ఉండదు?.. అసలు కారణమేంటి?

Why does cutting hair and nails don't feel pain?: మన శరీరంలో ఒక భాగం అయినా జుట్టు, గోర్లు మాత్రం ఇతర అవయవాలకు భిన్నంగా స్పందిస్తాయి. వాటిని కత్తిరించేప్పుడు కనీసం నొప్పి కూడా అనిపించదు. మన శరీరంలో ఏదైనా భాగంలో గాయం అయితే చాలా నొప్పిగా ఉంటుంది. కొన్నిసార్లు నొప్పి తీవ్రంగా మారుతుంది. దానికి టాబ్లెట్స్‌ వేసుకుంటూ ఉంటాం. అయితే మన శరీరంలో భాగంగా ఉన్న గోర్లు, జుట్టు విషయంలో ఇలా జరగదు.

గోర్లు, వెంట్రుకలు కత్తిరించేప్పుడు ఎందుకు నొప్పి ఉండదు?

  • గోళ్లు, వెంట్రుకలు కత్తిరించేటప్పుడు నొప్పి రాకపోవడానికి కారణం మృతకణాలు. వాస్తవానికి మృతకణాలు గోర్లు, జుట్టు రెండింటిలోనూ ఉంటాయి. అంతేకాకుండా వాటిని కత్తిరించేప్పుడు నొప్పి కూడా ఉండదు. కెరాటిన్ అనే ప్రొటీన్ పూర్తిగా నిర్జీవమైన గోళ్లు, వెంట్రుకల మృతకణాల్లో ఉంటుంది. అందుకే మనం గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ ప్రోటీన్ చర్మం ప్రక్కనే ఉన్న గోరు భాగంలో ఉండదు. దానికి బదులుగా ఇక్కడ ప్రత్యక్ష కణాలు ఉంటాయి. అందుకే చర్మానికి చాలా దగ్గరగా గోళ్లను కత్తిరించినప్పుడు మాత్రం మనకు నొప్పి వస్తూ ఉంటుంది.

జుట్టు విషయంలోనూ ఇలానే జరుగుతుందా?

  • జుట్టు విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. మృతకణాల నుంచి జుట్టు తయారవుతుంది. అందువల్ల వాటిని కత్తిరించేటప్పుడు నొప్పి అనిపించదు. మరోవైపు కెరాటిన్ ప్రోటీన్ జుట్టుకు చాలా అవసరం. శరీరంలో కెరాటిన్ ప్రోటీన్ లోపం ఉంటే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా పొడిగా మారుతుంది. అలాగే బూడిద రంగులోకి మారుతుంది. కాబట్టి గోళ్లు, వెంట్రుకల పెరుగుదలకు తగినన్ని ప్రొటీన్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో కెరాటిన్ ప్రోటీన్ ఉన్నప్పుడు గోర్లు కూడా ప్రభావితమవుతాయి, బలహీనంగా మారతాయి. చిన్న చిన్న పనులు చేస్తే విరిగిపోతాయని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి :  ఈ ఆకుతో కడుపులో మలినాలు మాయం..ముఖానికి మెరుపు కూడా ఖాయం

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment