Viral News: పాపం.. అందర్నీ నవ్విస్తూనే కుప్పకూలి చనిపోయింది!

మహారాష్ట్రలోని పరండా ఆరాజి షిండే కాలేజీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫేర్‌వెల్ పార్టీలో విద్యార్థిని వర్ష ఖరత్ వేదికపై ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.

New Update
Maharashtra farewell part girl died with heart attack

Maharashtra farewell part girl died with heart attack

Viral News:  కేరింతలు,డాన్సులు, నవ్వులతో సందడిగా ఉండాల్సిన ఫెర్వేల్ పార్టీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వేదికపై ఎంతో సంతోషంగా ప్రసంగిస్తున్న విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో జరిగింది. అసలు ఆఅమ్మాయికి ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ చదవండి. 

Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

ఫేర్‌వెల్ పార్టీలో వీడ్కోలు 

మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలో పరండా పట్టణంలోని పరండా ఆరాజి షిండే కాలేజీలో ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. అయితే వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా BSC ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్ష ఖరత్ వేదికపై ప్రసంగించింది. కాలేజీలో తన అనుభవాలను, స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలను చెబుతూ అందరినీ ఉత్సాహపరిచింది. అప్పటివరకూ అందరినీ నవ్విస్తూ,ఎంతో యాక్టీవ్ గా కనిపించిన వర్ష ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి  తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.  అయితే వర్షకు ఎనిమిదేళ్ల వయసులో హార్ట్ సర్జరీ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత గత 12 ఏళ్లగా ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. మరోవైపు తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 

telugu-news | latest-news 

Also Read: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి' ట్రైలర్! నవ్వులే నవ్వులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 6గురి దుర్మరణం.. కన్నీరు పెట్టించే వీడియోలు..!

అనకాపల్లిలో దారుణం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కంటతడి పెట్టిస్తున్నాయి. విగతజీవులుగా మృతులు దృశ్యాలు ఉన్నాయి.

New Update

అనకాపల్లిలో దారుణం జరిగింది. కైలాసపట్నంలోని బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 6గురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

విగతజీవులుగా పడివున్న దృశ్యాలు

వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది. ఇక ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారు హాస్పిటల్‌ ప్రాణాలతో పోరాడుతున్నారు. మరికొందరు సంఘటనా స్థలంలోనే విగతజీవులుగా కనిపిస్తున్నారు. శరీరం మొత్తం కాలిపోయి విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు కంటతడి పెట్టిస్తున్నాయి. 

https://x.com/YSRCParty/status/1911354811322089657

fire accident | latest-telugu-news | telugu-news | viral-videos

Advertisment
Advertisment
Advertisment