బెజవాడ దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డు మూసివేత

గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు కూడా జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఈ క్రమంలోనే బెజవాడ కనక దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు.

New Update
బెజవాడ దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డు మూసివేత

గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు కూడా జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఈ క్రమంలోనే బెజవాడ కనక దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు.

ఘాట్ రోడ్డులోకి భక్తులను అనుమతించడం లేదు అధికారులు. కురుస్తున్న వర్షాలకు ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అందువల్ల ముందు జాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఘాట్ రోడ్డు మూసివేసి.. ప్రస్తుతం విరిగిపడ్డ కొండ చరియల్ని అధికారులు తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులను అనుమతించడం లేదు.

విజయవాడ కస్తూరిబాయ్ పేటలో కూడా ఇంటిపై కొండ రాళ్లు విరిగిపడ్డాయి. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు.. సిటీని ముంచుతున్నాయి. ఘటనా స్థలాన్ని సీపీఎం నేతలు పరిశీలించారు. కొండ చరియలు విరిగి పడకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు