T20 World Cup : మొదటి మ్యాచ్‌లోనే పాక్‌కు షాక్.. అమెరికా సంచలన విజయం

అమెరికా సంచలనం సృష్టించింది. పెద్ద జట్టు పాక్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ఎ లో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో గెలుపొందింది.

New Update
T20 World Cup : మొదటి మ్యాచ్‌లోనే పాక్‌కు షాక్.. అమెరికా సంచలన విజయం

Shock To Pakistan : టీ20 వరల్డ్‌కప్‌ (T20 World Cup) లో సంచలనాలు నమోదవ్వడం మొదలైంది. అస్సలు అంచనాలు లేని జట్లు పెద్ద విజయాలు దక్కించుకుంటున్నాయి. పెద్ద జట్టు అయిన పాకిస్తాన్‌ (Pakistan) ను అతి చిన్న జట్టు... ఇప్పటివరకు ఎవరికీ తెలియని అమెరికా టీమ్ (USA Team) గెలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. గ్రూప్ ఎలో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అమెరికా సూపర్ ఓవర్‌లో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. తరువాత లక్ష్య ఛేదనకు దిగిన అమెరికా 3 వికెట్ల నష్టానికే 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. తరువాత ఇరు జట్లకూ మధ్య సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. దీంతో పాక్‌కు 19 పరుగులు లక్ష్యం అయింది. ఈ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ తడబడింది. ఒక వికెట్ కోల్పోయి 13 రన్స్ మాత్రమే చేయగలిగింది. దాంతో మ్యాచ్ అమెరికా ఎగురేసుకుని పోయింది.

టీమ్ అమెరికా మొదటి నుంచి ఎక్కడా తడబడకుండా మంచి ప్రదర్శన కనబరిచింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ (Monank Patel) 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. తరువాత వచ్చిన ఆండ్రీస్ గౌస్ 35, ఆరోన్ జోన్స్ 25, నితీశ్ కుమార్ 14 పరుగులు చేశారు. చివరి ఓవర్‌లో అమెరికా విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో నాలుగు సింగిల్స్‌, ఓ సిక్స్‌ వచ్చాయి. చివరి బంతికి నితీశ్ ఫోర్ బాదడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ అమిర్‌, నసీమ్ షా, హరిస్‌ రవూఫ్‌ తలో వికెట్ పడగొట్టారు.

పాకిస్తాన్ టీమ్‌లో కెప్టెన్ బాబర్ ఆజామ్ 44, షాదాబ్ ఖాన్ 40, ఇఫ్తికార్ అహ్మద్ 18, షాహీన్ అఫ్రిది 23 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో కెంజిగే 3, నేత్రవల్కర్ 2, అలీ ఖాన్, జస్దీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. మొత్తానికి నిన్నటి మ్యాచ్ వరల్డ్‌కప్‌లో సంచలనంగా నిలిచింది.

Also Read : అంతర్జాతీయ కెరీర్‌కు కన్నీటి వీడ్కోలు పలికిన సునీల్ ఛెత్రి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment