India-Myanmar : భారత్-మయన్మార్‌ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలుండవ్ : అమిత్ షా

భారత్-మయన్మార్‌ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని (FMR) రద్దు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అమిత్ షా 'ఎక్స్‌'లో వెల్లడించారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత తదితర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

New Update
India-Myanmar : భారత్-మయన్మార్‌ల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలుండవ్ : అమిత్ షా

Amit Shah : మయన్మార్, భారత్‌(India-Myanmar) ల మధ్య యథేచ్చగా జరుగుతున్న రాకపోకలను నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్‌(X) (ట్విట్టర్‌) లో కీలక ప్రకటన చేశారు. దేశ భద్రత, ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా సమతుల్యత తదితర కారణాల వల్ల భారత్- మయన్మార్.. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని(FMR) రద్దు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తక్షిణమే ఈ స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని నిలిపివేయాలని హోంశాఖ సిఫార్సు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read : బీజేపీ గెలవొద్దని కుట్రలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే పలు ఈశాన్య రాష్ట్రాలైన మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాంలు మయన్మార్‌ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా సరిహద్దు దాటి ఇరు దేశాల వైపు 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండానే ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉండేది. అయితే ఈ మధ్య మయన్మార్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. వీటిని అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందుకోసమే సరిహద్దులో 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించనున్నట్లు అమిత్‌ షా(Amit Shah) ఇటీవలే స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా ఎఫ్‌ఎంఆర్‌ను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Also Read: టిష్యూ పేపర్‌ పై రైల్వే మంత్రికి ఐడియా.. అంతే 6 నిమిషాల్లో మంత్రి నుంచి కాల్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: జగన్ క్షమాపణ చెప్పాలి లేదంటే.. జనమాల శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్!

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

New Update
jagan-si-sudhakar

Janamala Srinivasa Rao shocking comments on jagan

AP News: పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ క్షమాపణ చెప్పాలని జనమాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఏపీ పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గా జగన్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ తీరు పోలీసులందరినీ కలవరపాటుకు గురిచేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పోలీసులను బట్టలూడదీస్తానని అనడం ఏమిటని మండిపడ్డారు. జగన్ వెంటనే పోలీసులందరికీ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన మీద న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వాలకు భజన చేయాలా..

ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం ఎప్పుడు ఒకరిపైన విమర్శలు చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా.. పోలీసుల మీద తప్పుగా మాట్లాడితే ఖండించాం. మాకు ప్రభుత్వాలకు భజన చేయాల్సిన అవసరం లేదు. పోలీసుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మీడియా ముందుకు వస్తున్నాం. వేమగిరి ఎస్సై టీడీపీ నేతలతో తిరిగిన వీడియోలు ఉంటే దానిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. 

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

ఇదిలా ఉంటే.. వెలిగొండ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కానీ గతంలోనే ప్రాజెక్టు పూర్తిచేశామని, జాతికి అంకితం ఇస్తున్నామంటూ జగన్‌ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని, చేయని పనులూ చేసినట్లు చెప్పుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ ఎద్దేవా చేశారు.

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

jagan | police | srinivas | tdp | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు