Union Budget 2024: కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిసలు.. కేంద్ర బడ్జెట్ పై రేవంత్ ధ్వజం!

బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అనే పదాన్ని నిషేధించిందని సీఎం రేవంత్ అన్నారు. 8 మంది కేంద్రమంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిసలుగా పనిచేయొద్దని, వెంటనే రాజీనామా చేయాలంటూ మండిపడ్డారు.

New Update
Union Budget 2024: కిషన్ రెడ్డి, బండి సంజయ్ బానిసలు.. కేంద్ర బడ్జెట్ పై రేవంత్ ధ్వజం!

Union Budget 2024: బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అనే పదాన్ని నిషేధించిందని సీఎం రేవంత్ అన్నారు. అనేకసార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర అభివృద్దికి సహకరించాలంటూ విజ్ఞప్తి చేసినా వివక్ష చూపిందన్నారు.తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపింది. ఇది కేంద్రం కక్ష సాధించినట్లుంది. పెద్దన్నలా ఉండాల్సిన మోదీ ఇది సరికాదు. ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిధులు అడిగాం. ప్రధానిని నేనే మూడుసార్లు కలిసి అడిగాను. అయినా తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు

18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కోరినా..
మా మంత్రులు కూడా కేంద్రమంత్రులను కలిశారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కోరినా మొండిచేయి చూపించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండియ సంజయ్, కిషన్ రెడ్డి బానిసల్లాగా పనిచేయొద్దని సూచించారు. అలాగే తెలంగాణ పట్ల మోదీ మొదటి నుంచి వివక్ష చూపారని, విభజన చట్టం వంకతో ఏపీకి నిధులు కేటాయించారని సీఎం చెప్పారు. తెలంగాణకు నిధులిచ్చే బాధ్యత కేంద్రానికి లేదా అని ఆయన నిలదీశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్ లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా, రాష్ట్ర హక్కులను కాపాడేలా రేపు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామన్నారు. ప్రభుత్వ నిరసనను ప్రధానికి అధికారికంగా తెలియజేయడానికి తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమతో కలిసిరావాలని సూచించారు. గతంలో ఇలాంటి వివక్షనే ప్రత్యేక రాష్ట్ర సాధనకు కారణమైందని సీఎం రేవంత్ గుర్తు చేశారు.

తెలంగాణ పదాన్ని పలకడమే ఇష్టం లేదు.. 
వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలు ఉండాలని, అభివృద్ధికి సహకరించాలని కోరాం. రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పాం. వివక్షను తొలగించి నిధులు కేటాయించాలని కోరాం. మొత్తం బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. తెలంగాణ అనే పదాన్ని పలకడానికే కేంద్రం ఇష్టపడటంలేదు. వారి మనసులో ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి కేంద్రం నిధులు కేటాయించింది. మరి పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు? మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి, రీజనల్ రింగ్ రోడ్డుకు.. ఏ విషయంలోనూ తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించలేదు. ఐటీఐఆర్ గురించి ప్రస్తావించలేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారు. వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారు. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. ఇది కుర్చీ బచావో బడ్జెట్. బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదు. బీజేపీకి తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు మాత్రమే కావాలి.. కానీ అభివృద్ధి పట్టదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: BIG BREAKING: మళ్లీ అవసరం లేదు.. నీట్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

కిషన్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు..
బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డి రాజీనామా చేసి బయటకు రావాలి. తెలంగాణకు ఐఐఎం ఇవ్వం అని కేంద్రం చెప్పినా... కిషన్ రెడ్డి ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలి? ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే.. ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కేవలం క్విడ్ ప్రోకో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుంది. విభజన చట్టం కేవలం ఏపీకి మాత్రమే కాదు.. తెలంగాణకూ వర్తిస్తుంది. బడ్జెట్ ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపెట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లే.. కిషన్ రెడ్డి మౌనం, బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దు. పోలవరంకు నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు నిధులు ఇవ్వరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పార్లమెంట్ లో నిరసనకు బీజేపీ ఎంపీలూ కలిసి రావాలి. తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు