Wife killed husband: నాలుగేళ్ల ప్రేమ.. పెళ్లైన 15 రోజులకే భర్తను లేపేసిన నవవధువు!

యూపీలో భర్తల గుండెపగిలే సంఘటన జరిగింది. పెళ్లైన 15 రోజులకే ప్రగతి అనే నవ వధువు భర్త దిలీప్‌ను లేపేసింది. ప్రియుడికోసం పెళ్లికి బహుమతిగా వచ్చిన రూ.2 లక్షలు సుపారి ఇచ్చి చంపించింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

New Update
up murder

UttarPradesh Wife kills husband

Wife killed husband: యూపీలో భర్తల గుండెపగిలే సంఘటన జరిగింది. దాంపత్య జీవితంపై ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న యువకుడిని పారాణి ఆరకముందే నవ వధువు లేపేసింది. ఒకరిని ప్రేమించి పేరెంట్స్ బలవంతానికి మరొకరిని ఇష్టం లేని పెళ్లి చేసుకున్న యువతి అతనితో సంసారం చేయలేక రెండు వారాల్లోనే ప్రియుడితో కలిసి కడతేర్చింది. పెళ్లి బహుమతిగా వచ్చిన డబ్బులను సుపారిగా ఇచ్చి అత్యంత దారుణంగా వ్యాపారి అయిన వరుడిని చంపించింది.

నాలుగు సంవత్సరాలుగా ప్రేమ..

ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని  ఔరయ్య నివాసి అయిన ప్రగతి (22).. మెయిన్‌పురికి చెందిన వ్యాపారవేత్త  (24) దిలీప్‌కు 2025 మార్చి 5 వివాహం జరిగింది. అయితే ప్రగతి అప్పటికే అనురాగ్ అనే యువకుడితో గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమలో ఉంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ పేరెంట్స్ ప్రగతికి బలవంతంగా పెళ్లి చేశారు. దీంతో ఎలాగైనా దిలీప్ ను చంపి అనురాగ్ ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసిన ప్రగతి.. ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది. 

Also Read: Pawan Kalyan: ఇకపై సినిమాలు చేయరా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలోనే పెళ్లితో బహుమతిగా వచ్చిన రూ. 2 లక్షలను సుపారి గ్యాంగ్ కు ఇచ్చారు. వివాహం జరిగిన 15 రోజులకు మార్చి 19న దిలీప్ పై దుండగులు కాల్పులు జరిపారు. అనురాగ్ బయటకెళ్దామని చెప్పి దిలీప్ ను తీసుకెళ్లగా.. నమ్మించి ఔరయ్యలోని సహార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పాలియా గ్రామం సమీపంలోని గోధుమ పొలంలో కాల్చేపడేశారు. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ దిలీప్ మార్చి 21 మరణించారు. స్థానికులు, బంధువుల సమాచారం ప్రకారం  సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. ప్రగతి, ఆమె ప్రేమికుడు అనురాగ్, ఒక షూటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.  వారి నుంచి 315 బోర్ పిస్టల్స్, లైవ్ కార్ట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఔరయ్య) అభిజీత్ ఆర్ శంకర్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

murder | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం

డిజిట‌ల్ అరెస్టు కారణంగా రిటైర్డ్ క‌ల్నల్ దంప‌తులు రూ.3.4 కోట్లు  కోల్పోయారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి 10 రోజులు డిజిటల్ అరెస్ట్ అయ్యారు. రిటైర్డ్ క‌ల్నల్ ద‌లీప్ సింగ్‌(82), ఆయ‌న భార్య ర‌వీంద‌ర్ కౌర్ బాజ్వాతో చండీఘ‌డ్‌లో సెక్టార్ 2ఏలో నివాసం ఉంటున్నారు.

New Update
retired Colonel

retired Colonel Photograph: (retired Colonel)

డిజిట‌ల్ అరెస్టు కారణంగా రిటైర్డ్ క‌ల్నల్ దంప‌తులు భారీగా మోస‌పోయారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి సేవ్ చేసుకున్న రూ.3.4 కోట్లు  కోల్పోయారు. ప‌ది రోజుల పాటు మోస‌గాళ్లు ఆ దంప‌తుల్ని డిజిట‌ల్ అరెస్టు చేసి ఆ మొత్తాన్ని కాజేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. 82 ఏళ్ల రిటైర్డ్ క‌ల్నల్ ద‌లీప్ సింగ్‌, ఆయ‌న భార్య ర‌వీంద‌ర్ కౌర్ బాజ్వాతో క‌లిసి చండీఘ‌డ్‌లోని సెక్టార్ 2ఏలో నివాసం ఉంటున్నారు. అయితే ఈడీ అధికారుల‌మంటూ మోస‌గాళ్లు ఆ వృద్ధ జంట‌ను మోసం చేశారు. తొలుత వాళ్లు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి బెదిరించారు. ఆ త‌ర్వాత కోర్టు నోటీసులు ఇచ్చి భయపెట్టారు. చండీఘ‌డ్ సైబ‌ర్ సెల్‌లో ఆ వృద్ధ జంట ఫిర్యాదు చేసింది.

Also read: Forbes Billionaires List: 2025లో ప్రపంచ కుబేరులు వీరే.. టాప్ 10 నుంచి మాయమైన ముఖేష్ అంబానీ

మార్చి 18న సింగ్‌కు గుర్తు తెలియ‌ని నెంబ‌ర్ నుంచి వాట్సాప్ కాల్ వ‌చ్చింది. ముంబైలోని కెన‌రా బ్యాంక్‌తో ఉన్న అకౌంట్‌తో మ‌నీ ల్యాండ‌రింగ్ లింకు ఉన్నట్లు ఆ కాల్‌తో సింగ్‌ను బెదిరించారు. జెట్ ఎయిర్‌వేస్ ఓన‌ర్ న‌రేశ్ గోయ‌ల్‌కు మ‌నీ ల్యాండ‌రింగ్ చేసినట్లు సైబ‌ర్ నేర‌గాళ్లు ఆరోపించారు. ముంబైలో ద‌లీప్ సింగ్ బజ్వా పేరుతో అకౌంట్ ఉన్నట్లు ఆయ‌న భార్యకు నేర‌గాళ్లు ఫోన్ చేశారు. భ‌ర్త పేరుతో ఉన్న ఓ కార్డును కూడా చూపించారు.

Also read: Waqf Board Bill: ఇండియాలో ఆ 9లక్షల 40వేల ఎకరాల భూమి ఎవరిది.. వక్ఫ్ బోర్డ్ కథేంటి..?

సింగ్ పేరుతో ఉన్న కార్డును చూపించి. 5 వేల కోట్ల ఫ్రాడ్‌తో క‌నెక్షన్ ఉన్నట్లు బెదిరించార‌ని కౌర్ పేర్కొన్నది. ఆ స్కామ్‌లో 24 మంది బాధితులు ఉన్నట్లు కూడా కొన్ని ఫోటోలు షేర్ చేశారని చెప్పిందామె. మార్చి 18 నుంచి 27వ తేదీ వ‌ర‌కు సైబ‌ర్ నేర‌గాళ్లు ఆ వృద్ధ దంప‌తుల్ని డిజిట్ అరెస్టు చేశారు. ఫోన్లు ఎప్పటికీ ఆన్‌లో పెట్టుకోవాల‌ని ఆ జంట‌ను నేర‌గాళ్లు హెచ్చరించారు. ఎవ‌ర్నీ కాంటాక్టు కావొద్దన్నారు. విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే అరెస్టు చేస్తామ‌ని బెదిరించారు. సుప్రీంకోర్టు లెట‌ర్ ప్యాడ్‌తో ఉన్న లేఖ‌ల్ని కొన్ని చూపించారు. అయితే తీవ్ర వ‌త్తిడికి లోనైన ఆ జంట‌.. త‌మ అకౌంట్ల‌లో దాచుకున్న 3.4 కోట్లను సైబ‌ర్ నేర‌గాళ్లకు చెందిన వివిధ అకౌంట్లకు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment