Telangana: పాపం.. పరీక్ష సరిగ్గా రాయలేదని.. 10th విద్యార్థిని ఆత్మహత్య!

నల్గొండ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కట్టంగూర్కు చెందిన పూజిత భార్గవి ప్రస్తుతం 10th పరీక్షలకు హాజరవుతోంది. అయితే సోమవారం జరిగిన ఇంగ్లీష్ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

New Update
10th student  suicide

10th student suicide

జీవితంలో సక్సెస్, ఫెల్యూర్ ఒక భాగం మాత్రమే. పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రానా జీవితమే అయిపొయింది అనుకోవడంలో అర్థమే లేదు. పరీక్షల్లో ఫెయిలైనా లైఫ్ ఎంతో మంది.. వ్యాపారవేత్తలుగా, ఎంట్రప్రెన్యూర్స్ గా, ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వడానికి, టాలెంట్ కి ఏ మాత్రం సంబంధం లేదనే చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక.. ప్రాణాలు తీసుకుంటున్నారు కొంతమంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు చోటుచేసుకుంది. 10వ తరగతి పరీక్షలు సరిగ్గా రాయలేదని ఓ విద్యార్థిని  ఆత్మహత్య చేసుకుంది.  

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Also Read :  బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

పరీక్ష సరిగ్గా రాయలేదని.. 

నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన పూజిత భార్గవి అనే విద్యార్థిని స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఇప్పటికే 10th పరీక్షలు మొదలవగా.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాసింది. అయితే సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్ష సరిగ్గా రాయలేదని తీవ్రమనస్థాపానికి గురైంది పూజిత. తాను ఫేయిల్‌ అవుతానేమో అనే భయంతో  ఇంట్లో ఎవరూలేని సమయంలో  ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎదిగిన కూతురు కళ్ళ ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. 

ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి 

Also Read :  ‘కోర్టు’ కిక్కే కిక్కు.. రూ.10 కోట్ల బడ్జెట్- రూ.50 కోట్ల కలెక్షన్- USలో రచ్చ రచ్చే

 

nalgonda | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | telangana crime case | telangana crime incident | telangana crime news | telangana-crime-updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!

ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడింది. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు.

New Update
Wife Set her Husband on fire in Jagtial District

Guntur Young woman attack on young man with petrol

AP Crime: ఏపీలో మరో దారుణం జరిగింది. పల్నాడు జిల్లా ఉయ్యందనలో చిరంజీవి అనే యువకుడిపై శ్రీలక్ష్మీ అనే యువతి పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో దాడికి పాల్పడింది. చిరంజీవి ఆస్పత్రిలో చికిత్స పొందతున్నాడు.

తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని..

అయితే మంటలు అంటుకోవడంతో అతని వీపు కాలిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని సత్తెనపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. దాడికి పాల్పడిన శ్రీలక్ష్మీపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఇక ఈ ఘటన గురించి స్పందించిన శ్రీలక్ష్మీ.. చిరంజీవి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పింది. క్యారెక్టర్ గురించి నిందలు వేస్తున్నాడని, ఎన్నిసార్లు హెచ్చరించినా చిరంజీవి పద్ధి మార్చుకోకపోవడంతో పెట్రోల్‌ పోసి నిప్పంటించి నట్లు తెలిపింది. ఈ ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భోజనం చేస్తుండగానే ఓ యువకుడిని అతి దారుణంగా హత్య చేశారు. వెనక నుంచి దాడి చేసి కత్తులతో అతని గొంతుకోశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని సరిగా చూసుకోవడం లేదని సొంతమామ, బావమరిదే ఈ దారుణానికి ఒడిగట్టారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన పేరం శివ(27)తన ఇంటి పక్కనే ఉన్న రేగుల వెంకటేశు కుమార్తె భానుతో ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. అయితే కొంతకాలం వీరి సంసారం బాగానే ఉంది. అయితే ఇటీవల తరచూ దంపతుల మధ్య గొడవలు జరగుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు మధ్యలో రాజీ చేస్తూ వస్తున్నారు. అయితే భోజనం చేస్తున్న శివను వెనక నుంచి పట్టుకుని బావమరిది, మిగిలిన వారు ఒక్కసారిగా కత్తులతో పీక కోసి అత్యంత దారుణంగా హతమార్చారు. దీంతో రక్తపు మడుగులో గిలగిలలాడుతూ శివ అక్కడికక్కడే మృతిచెందాడు. శివ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

 girl | boy | petrol | attack | guntur | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment