USA: అమెరికాలో కాల్పుల మోత.. ఇద్దరు దుర్మరణం అమెరికాలో టెక్సాస్లో రెండు గ్రూపు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి రౌండ్ రాక్లోని పార్కులో జరిగిన ఓ ఈవెంట్కు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరో ఆరుగురు తీవ్రంగా గాయలపాలయ్యారు. వీళ్లలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. By B Aravind 16 Jun 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. టెక్సాస్లో రెండు గ్రూపు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి రౌండ్ రాక్లోని పార్కులో ఓ ఈవెంట్ జరిగింది. ఎక్కువమంది ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే దీనికి సమీపంలో రెండు గ్రూపుల మధ్య వివాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పాయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయలపాలయ్యారు. వీళ్లలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. Also Read: అవినీతికి అడ్డాగా ఆ పోలీస్ స్టేషన్.. ఒకే సారి 12 మంది సీఐలు, నలుగురు ఎస్ఐలు ఔట్! సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితులు అక్కడినుంచి పారిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. Also Read: ఢిల్లీలో నీటి సంక్షోభం.. అల్లాడిపోతున్న నగర ప్రజలు #usa #telugu-news #america #crime సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి