Hyderabad: భారీ కుంభకోణం.. రూ.175 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ భారీ సైబర్ కుంభకోణం బయటపడింది. షంషీర్‌ గంజ్‌ SBIని బురిడీ కొట్టించి ఇద్దరు ఆటో డ్రైవర్లు ఏకంగా రూ.175 కోట్లు కాజేశారు. ఈ నిధులను క్రిప్టో కరెన్సీ ద్వారా సైబర్ నేరగాళ్లకు పంపించారు.

New Update
Hyderabad: భారీ కుంభకోణం.. రూ.175 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్‌లో చాలావరకు సైబర్ కేసులు నమోదయ్యాయి. తాజాగా హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ భారీ సైబర్ కుంభకోణం బయటపడింది. బ్యాంకును బురిడీ కొట్టించి ఏకంగా రూ.175 కోట్లు కాజేశారు. పాతబస్తీలో ఉన్న బ్యాంకు నుంచి ఈ లావాదేవీలు జరిగాయి. అయితే ఈ సైబర్ నేరగాళ్లకు ఇద్దరు ఆటో డ్రైవర్లు కూడా సహకరించారు. షంషీర్‌ గంజ్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 6 బ్యాంక్ ఖాతాలు ఈ ఆటో డ్రైవర్లు ఓపెన్ చేశారు. వీళ్లిద్దరి ద్వారా సైబర్ నేరగాళ్లు రూ.175 కోట్లు లావాదేవీలు జరిపారు.

Also read: సంచలనం సృష్టిస్తున్న ముంబైనటి వేధింపుల వ్యవహారం..తెర వెనుక కీలక నేత

హైదరాబాద్‌ నుంచి దుబాయ్, ఇండోనేషియా, కంబోడియాలకు ఈ నిధులను క్రిప్టో కరెన్సీ ద్వారా ఈ ఆటో డ్రైవర్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. చివరికి SBIలో ఈ అక్రమ లావాదేవీలు జరిగినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించించింది. కేవలం రెండు నెలల్లోనే 6 అకౌంట్ల నుంచి రూ.175 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఆటో డ్రైవర్లు అహ్మద్ షాహిద్, బిన్‌ అహ్మద్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు విచారణ చేస్తున్నారు.

Also read: సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం.. ఏంతంటే ?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment