Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. కృష్ణా ఎక్స్‌ ప్రెస్ తో పాటు ఆ 24 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే..

ట్రాఫిక్ బ్లాక్ కారణంగా విజయవాడ డివిజన్లో 24 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిన మధ్య రైల్వే ప్రకటించింది. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే కృష్ణా ఎక్స్ ప్రెస్ ను సైతం అధికారులు రద్దు చేశారు.

New Update
Railway Jobs: రైల్వేలో 9,144 ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway), విజయవాడ డివిజన్ అధికారులు కీలక ప్రకటన చేశారు. ట్రాఫిక్ బ్లాక్, నిర్వహణ పనుల కారణంగా 24 రైళ్లను రద్దు (Trains Cancelled) చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు మరో 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరో 6 రైళ్లను దారి మళ్లిస్తున్నామన్నారు. ఈ మేరకు వారు ప్రకటన విడుదల చేశారు. రద్దైన రైళ్ల జాబితాలో విజయవాడ-తెనాలి, విజయవాడ-ఒంగోలు, గూడురు - విజయవాడ, విశాఖపట్నం - గుంటూరు, విశాఖపట్నం - విజయవాడ, విశాఖపట్నం - మచిలీపట్నం, రాజమండ్రి - విజయవాడ తదితర రైళ్లు ఉన్నాయి. పూర్తి వివరాలను కింది ట్వీట్ లో చూడొచ్చు.
ఇది కూడా చదవండి: Indian Railways: ఆ 4 రైళ్లు ఇక కాజీపేట, కర్నూల్, బోధన్ వరకు.. అదిరిపోయే శుభవార్త చెప్పిన రైల్వే.. రేపటి నుంచే..

ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతికి రాకపోకలు సాగించే కృష్ణా ఎక్స్‌ ప్రెస్ ను సైతం అధికారులు రద్దు చేశారు. కృష్ణా జిల్లా బాపట్ల వద్ద ట్రాక్ పనులు జరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: MMTS: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో 4 ఎంఎంటీఎస్ రైళ్లు.. ఏ రూట్లలో అంటే?

ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్ ప్రెస్(17406)ను ఈనెల 8, 9, 10వ తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇంకా.. తిరుపతి- ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ ప్రెస్ (17405) ట్రైన్ ను ఈనెల 7, 8 9వ తేదీల్లో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

IAS transfers : ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు...సిసోడియా ఔటు- ముత్యాల రాజుకు చోటు..!!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టిన అధికారులకు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తోంది. సీనియర్ ఐఏఎస్ సిసోడియాను బదిలీ చేసారు.

New Update
IAS transfers

IAS transfers

IAS transfers :  ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టిన అధికారులకు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి రెవిన్యూ - రిజిస్ట్రేషన్ శాఖలు కీలకంగా మారాయి.

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

ఈ శాఖలను ఇప్పటి వరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పర్యవేక్షించిన సీనియ ర్ ఐఏఎస్ అధికారి సిసోడియాను బదిలీ చేసారు. సిసోడియాకు హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు కేటాయించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయలక్ష్మి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతల అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

ఇక, ప్రస్తుతం ఐటీ కార్యదర్శిగా ఉన్నా కాటమనేని భాస్కర్ కు ఏపీ హెచ్ఆర్డీ సంస్థ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓలో కీలకం గా వ్యవహరించిన ముత్యాల రాజుకు ఇప్పుడు పోస్టింగ్ దక్కింది. ఆయనకు స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయితీ రాజ్ సెక్రటరీగా నియమించారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న మరో అధికారి మాధవీ లతకు రైతు బజార్ల సీఈవోగా నియామకం చేసారు. మరో ఐఏఎస్ గౌతమికి గిరిజన విద్య సంస్థల కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఫైబర్ నెట్ లో జీవీ రెడ్డి పై ఆరోపణలు చేసి.. అక్కడ నుంచి బదిలీ అయిన దినేష్ కుమార్ ను ఆయూష్ డైరెక్టర్ గా నియమించారు. ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎండీ గా కే నీలకంఠారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

Advertisment
Advertisment
Advertisment