Train Track Broken:ఆంధ్రలో తప్పిన రైలు ప్రమాదం..విరిగిన రైలు పట్టా.

ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రైలు ప్రమాదం తప్పింది. తిరుపతి జిల్లా పూతలపట్టు మండలంలో రైలు పట్టా విరిగింది.. అయితే, ముందుగా రైలు పట్టా విరిగినట్టు గ్యాంగ్ మేన్ గుర్తించడంతో ప్రమాదం తప్పింది.

New Update
Train Track Broken:ఆంధ్రలో తప్పిన రైలు ప్రమాదం..విరిగిన రైలు పట్టా.

ఈ ఏడాది అంతా రైలు ప్రమాదాలు విషాదాన్నే మిగిల్చాయి. అయినా కూడా ఇంకా అవి భయపెడుతూనే ఉన్నాయి. తాజాగా రామేశ్వరం నుంచి వస్తున్న రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. పూతలపట్టు మండలం, కొత్తకోట వద్ద ఈ ఘటన జరిగింది. రైలు రాక ముందే పట్టా విరిగి ఉందని గ్యాంగ్ మెన్ గమనించారు. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రామేశ్వరం నుంచి వస్తున్న రైలును నిలిపేశారు. దీనివల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టు అయిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Also read:ఆసక్తికరంగా ఐపీఎల్2024..ప్రస్తుత ఫ్రాంఛైజీల పరిస్థితి ఇదీ..

ప్రస్తుతం రైలు పట్టా రమ్మతులు చేసి యథావిథిగా రైళ్లను నడుపుతున్నారు. మరమ్మతుల కారణంగా రామేశ్వరం నుంచి వస్తున్న రైలు 10 నిమిషాలు ఆలస్యంగా పాకాలకు చేరుకుంది . ప్రస్తుతానికి ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలు యథావిథిగా కొనసాగుతున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.

Also Read:అతనే రైతుబంధు ఆపాలని ఈసీఐకి ఫిర్యాదుచేశారు.. హరీష్‌ రావు ఫైర్..

Advertisment
Advertisment
తాజా కథనాలు