Weather Alert: ముంచుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఏకంగా 48 ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఆ ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం బలపడి ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది.
చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలు కామాంధులుగా మారారు. వృత్తి ధర్మాన్ని మరిచి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఇద్దరు పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం త్వరలో సంజీవని పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి రోగులకు వైద్య సేవలను అందించి, తక్షణ చికిత్స చేయాలని నిర్ణయించింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహిళల విజ్ఞప్తి మేరకు ఘాట్ రూట్లలో సైతం ఫ్రీ బస్సు సర్వీసులను అందించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ మంత్రి నారా లోకేష్కి మాధవ్ ఇచ్చిన భారత చిత్ర పటంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా లేదు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ మండిపడ్డారు. ఏపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుర్తింపును చిత్రపటంలో తొలగించే ప్రయత్నం చేస్తున్నారని కేసు ఫిల్ చేయాలని డీజీపీని కోరారు.
కవిత, షర్మిల మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇద్దరి భర్తల పేర్లు అనిల్, ఇద్దరూ అన్నలపై ఆరోపణలు చేశారు. ఇద్దరూ అన్నతో కలిసి పార్టీ కోసం పని చేశారు. తర్వాత సొంత గుర్తింపు కోసం పోరాడుతున్నారు. కవిత లేఖతో BRS పరిణామాలు ఆసక్తిగా మారాయి.
APPSC గ్రూప్ 1 2018 నోటిఫికేషన్ YCP హయంలో అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలపై కేసు నమోదైంది. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పని చేసిన ఆంజనేయులుపై విజయవాడలో సూర్యారావుపేట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. రహస్యంగా విచారణ జరిగుతోంది.