IPL 2024 : హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్ళింపు

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు ముంబై ఇండియన్స్, సన్ రైజన్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. దాంతో పాటూ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

New Update
IPL 2024 : హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్ళింపు

Hyderabad : హైదరాబాద్‌లో ఇవాళ క్రికెట్(Cricket) సందడితో నిండిపోనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం(Rajiv Gandhi Stadium) లో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్(SRH) కు ముంబై ఇండియన్స్(MI) మధ్య ఈరోజు మ్యాచ్ అవనుంది. సాయంత్రిం 7.30గంటలకు ఆట ప్రారంభం అవుతుంది. దీని కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లూ చేసేశారు. టికెట్లు అన్నీ కూడా నిమిషాల్లో అమ్ముడుపోయాయి. ఇరు జట్లూ హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్నాయి.

భారీ భద్రతా చర్యలు...

ఇక మ్యాచ్‌ కోసం హైదరాబాద్ పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంచనీయా సంఘటనలు జరగకుండా 2,500 మంది పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి(Tarun Joshi) తెలిపారు. స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో సీటింగ్‌ సామర్థ్యం 39 వేలు. టికెట్లు అన్నీ అధికారికంగా విక్రయించారు. అవి కాకుండా ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు అమ్మాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తరుణ్ జోషి తెలిపారు. స్టేడియం లోపల, వెలుపల భారీగా పోలీసులను మోహరించనున్నారు. గ్రౌండ్ లోపలికి ల్యాప్‌ ట్యాప్‌, వాటర్‌ బాటిల్స్‌, బ్యానర్స్‌, లైటర్స్‌, సిగరెట్స్‌, బైనాక్యులర్స్ తీసుకురాకూడదు. బ్లూటూత్స్ మాత్రమే అనుమతిస్తాం అని చెబుతున్నారు.

అలాగే స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్‌(She Teams) నిఘా ఉంటుందని చెప్పారు. మ్యాచ్ కు 3 గంటల ముందు నుంచి ప్రేక్షకులను అనుమతిస్తామన్నారు. ముందస్తు భద్రతకోసం 4 అంబులెన్స్‌లు, మెడికల్‌ టీమ్స్‌, ఫైర్‌ ఇంజిన్లను సిద్ధంగా ఉంచబోతున్నట్లు చెప్పారు. అలాగే స్టేడియం దగ్గర ఎవరికీ ఇబ్బంది కలగకుండా పార్కింగ్‌ సదుపాయం కల్పించామని తెలిపారు.

ట్రాఫిక్ మళ్ళింపు..
భద్రతా చర్యలతో పాటూ ట్రాఫిక్ మీద కూడా దృష్టి పెట్టారు. మ్యాచ్ జరిగినంతసేపూ ఎక్కడా ట్రిఫిక్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. భారీ వాహనాలను నియంత్రించనున్నారు. దాంతో పాటూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు ఉంటాయని సీపీ తరుణ్ జోషి తెలిపారు. బోడుప్పల్, చెంగిచెర్ల, పీర్జాదిగూడ నుంచి వచ్చే వాహనాలను హెచ్‌ఎండీఏ భగాయత్ లే అవుట్ ద్వారా నాగోల్ వైపు మళ్ళించనున్నారు. అలాగే నాగోల్ నుంచి వచ్చే వాహనాలు మెట్రోస్టేషన్ నుంచి యూటర్స్ తీసుకుని, భగాయత్ లే అవుట్ నుంచి వెళ్ళాలని సూచించారు. తార్నాక నుంచి వచ్చే వెహికల్స్ హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం వైపు మళ్ళించనున్నట్లు చెప్పారు. వీటితో పాటూ మెట్రో ట్రైన్‌ సర్వీసులను కూడా పొడిగించనున్నామని తెలిపారు.

Also Read : Andhra Pradesh : నేటి నుంచే వైసీపీ ఎన్నికల శంఖరావం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

author-image
By Manogna alamuru
New Update
ipl

CSK VS LSG

గెలిచింది...గెలిచింది...చెన్నై సూపర్ కింగ్స్ మొత్తానికి మ్యాచ్ గెలిచింది.  పేలవమైన ప్రదర్శనతో అందరినీ నిరాశకు గురి చేస్తున్న సీఎస్క్ కు ఈరోజు మంచి విజయం దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 5 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. వరుసగా ఐదు ఓటములను మూట గట్టకున్న సీఎస్కో ఎట్టకేలకు కాస్త ఊపిరి పీల్చుకుంది. స్వయంగా కెప్టెన్ ధోనీనే మ్యాచ్ ను గెలిపించడం ఈ మ్యాచ్ లో మరొక విషయం. ముందు బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్‌ దూబె (43*), రచిన్‌ రవీంద్ర (37), షేక్‌ రషీద్‌ (27), ధోనీ (26*) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2, అవేశ్‌ ఖాన్‌, మార్‌క్రమ్‌, దిగ్వేశ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి..

ఈరోజు మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్, నికోలస్ పూరన్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఇద్దరూ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవలేకపోయారు. తొలి ఓవర్‌ ముగిసేసరికి లక్నో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. 

చెలరేగిన పంత్..

ఆ తర్వాత క్రీజ్‌లోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. అక్కడనుంచి మార్ష్, పూరన్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. కానీ పూరన్ దూకుడు తక్కువ సమయానికే పరిమితం అయింది. నికోలస్ పూరన్ (8) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో లఖ్‌నవూ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.  దీంతో లక్నో జట్టు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు సాధించింది. ఇక పంత్, మార్ష్‌ నిలకడగా ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. మార్ష్‌ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది. ఆ తర్వాత పంత్ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 49 బంతుల్లో 63 పరుగులు రాబట్టాడు. అలాగే బడోని 17 బంతుల్లో 22 పరుగులు, అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 166 పరుగులు రాబట్టారు.  
 

today-latest-news-in-telugu | IPL 2025 | csk-vs-lsg 

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Advertisment
Advertisment
Advertisment